మనం గొప్ప పోరాటాలు, త్యాగాలతో స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాము. అలాంటి స్వాతంత్య్ర్య సమరయోధులకు నివాళులర్పించి, వారి ఘన చరిత్రము దేశ పౌరులకు తెలియజేసి విజ్ఞానాన్ని పెంచే ఉద్దేశ్యంతోనే 'ఆజాదీ అమృత్ మహోత్సవ్' కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. 75 ఏళ్ళ క్రితం భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించింది. భారతదేశం స్వాతంత్య్ర ఉద్యమాన్ని అహింసతో నడిపించి రక్తపాతం లేకుండా కూడా స్వాతంత్ర్యాన్ని సాధించవచ్చని ప్రపంచానికి నిరూపించింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రారంభమైన 'ఆజాద్ కా అమృత్ మహోత్సవ్' కింద దేశ వ్యాప్తంగా 25 వేలకు పైగా కార్యక్రమాలు నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సీరిస్ లో భాగంగా ఈసారి జూలై మాసం ఒకటవ తేదీన జన్మించిన నలుగురి జీవిత విశేషాలు తెలుసుకుందాం, దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన సుమంత్ మెహతా, సుశీల చైన్ ట్రెహాన్, అమరేంద్రనాథ్ చటర్జీ, అలేఖ్ పాత్ర వంటి సమరయోధుల గురించి తెలుసుకోండి..
లండన్ నుంచి తిరిగివచ్చి స్వాతంత్ర్యం కోసం పోరాడిన వైద్యుడు సుమంత్ మెహతా: సుమంత్ మెహతా, తన భార్యను స్పూర్తిగా తీసుకుని భారతదేశ స్వాతంత్య్ర్య పోరాటానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన ఒక వైద్యుడు. పేదల ప్రజల సంక్షేమంకోసం ఎంతగానో కృషి చేశారు. ఆయన వైద్య విద్య ఇంగ్లండ్ లో పూర్తి చేశారు. పై చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్ళే ముందే ఆయన వివాహం జరిగింది.
అలేఖ్ పాత్ర 18ఏళ్ళ వయసులోనే స్వాతంత్యోద్యమ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ప్రముఖ నాయకుల్లో ఒకరు. ఆయన ఒరిస్సాలోని వివిధ ప్రాంతాలలో జరిగిన పౌర హక్కులు, పర్యావరణ పరిరక్షణ ఉద్యమాల్లో పాల్గొనే విధంగా సామాన్య ప్రజలను ప్రోత్సహించారు. అలేఖ్ పాత్ర ఒరిస్సాలోని పూరిలో 1923 జూలై 1న జన్మించారు. ఆయన చిన్నవాటి నుండే దేశభక్తి స్పూర్తి కలిగి ఉండడంతో 18 ఏళ్ళ చిరుప్రాయంలోనే స్వాతంత్య్రం పోరాటంలో పాల్గొనడం ప్రారంభించాడు. స్వేచ్ఛా పోరాటంలో భాగంగా తన స్నేహితులతో కలిసి నిమ్మపాడ పోలీస్ స్టేషన్ కు నివ్వు పెట్టాడని చెబుతారు.
ఈ సందర్భంగా పోలీసులు నిరసనకారులని అడ్డుకునేందుకు కాల్పులు జరపగా వారి సన్నిహితుల్లో ఒకరు అక్కడికక్కడే మరణించారు. అలేఖ్ పాత్రను పోలీసులు అరెస్టు చేసి పూరీ జైలులో నిర్బంధించారు. అక్కడ ఆయన్ని చిత్ర హింసలకు గురి చేశారు. కానీ అతను ఎంతో దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి. ఎంత హింసించి తన మార్గాన్ని మార్చుకోవాలనుకోలేదు. జైలు నుంచి విడుదలైన తరువాత ఆయన తన స్థావరాన్ని కలకత్తాకు తరలించి బ్రిటీష్ వలసవాదానికి వ్యతిరేకంగా అజ్ఞాతంలో ఉంటూ తన పోరాటాన్ని కొనసాగించాడు. అక్కడ అతను ఒక వ్యక్తి కోసం గృహ సేవకుడిగా పని చేశాడు. అయినప్పటికీ తని అండర్ గ్రౌండ్ కార్యకలాపాలు ఆగిపోనివ్వలేదు.
అయితే, అతను కోల్ కతాలో ఎంతో కాలం ఉండలేకపోయాడు. ఆచార్య హరిహర్, గోపబందు దాస్ లతో కలిసి స్వాతంత్య్ర్య పోరాటంలో బహిరంగంగా పాల్గొనాలని కోరుకున్నారు. అదే సమయంలో అతని సహచరులు కూడా అతను అండర్ గ్రౌండ్ లో ఉంటూ పని చేయడం కాకుండా, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్య్రం పోరాటంలో బహిరంగంగా పాల్గొనాలని కోరుకున్నారు. దాంతో ఆయన కోల్ కతా నుంచి పూరీకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. అయితే కోల్ కతా నుంచి పూరీకి తిరిగి వస్తుండగా అతన్ని పోలీసులు అరెస్టు చేసి మళ్ళీ జైలుకి పంపారు. జైల్లో ఉన్న సమయంలో మహాత్మా గాంధీ సూచనలు పాటించారు. నూలు వడికి, ఖాదీ చేసి సొంతంగా తన బట్టలు, తయారు చేసుకున్నాడు. శుభ్రతను ప్రచారం చేయడం కోసం మరుగుదొడ్లను శుభ్రం చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక హోమ్ అడ్మినిస్ట్రేషన్, ఇతర సర్వోదయ విధులు నిర్వహణ కోసం స్వరాజ్ లో శిక్షణ పొందేందుకు వార్థా వెళ్ళడు.
అక్కడి నుండి ఒరిస్సాకు తిరిగి వచ్చిన తరువాత సాంఘిక సంస్కరణ కోసం పని చేయడం ప్రారంభించాడు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆయన అనేక అవార్డులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సన్మానాలు పొందారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఆయన ప్రజల కోసం సంక్షేమ పనులు కొనసాగిస్తూ నిరంతరం వారి కోసం చురుగ్గా పని చేసేవారు. ఆయన 76 సంవత్సరాల వయసులో 1999, నవంబర్ 17న మరణించారు.

బ్రిటీష్ బానిసత్వం మంచి భారతదేశాన్ని విముక్తి చేయాలని బలంగా కోరుకున్న ప్రముఖులలో అమరేంద్రనాథ్ ఒకరు. ఆయన విప్లవ పంథాలోనే అది సాధ్యం అని భావించారు. అందుకే ఆయన యుగంతర్ బృందంలో చేరాడు. వివిధ శాఖల ద్వారా, వివిధ ప్రాంతాలలో ఉండే యువకులను ఒక చోట సమావేశపరచి బ్రిటీష్ వారితో పోరాడగలిగేలా వారిని శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు చేయడమే ఈ గ్రూప్ ప్రధాన కార్యకలాపం. అంతేకాదు. ఈ సంస్థ రహస్యంగా బాంబులు తయారు చేసి, దుష్టులైన బ్రిటీష్ అధికారులను చంపేందుకు కావలసిన ఆయుధాల పంపిణీ, శిక్షణను అందజేయడం వంటివి కూడా చేస్తుంది.
విప్లవం ద్వారా భారతదేశాన్ని బ్రిటిష్ వారి బానిసత్వం నుండి విముక్తి చేయాలని కోరుకున్న భారత స్వాతంత్య్ర పోరాట యోధుల జాబితాలో అమరేంద్ర నాథ్ ఛటర్జీ పేరు చేర్చబడింది.
ఈ సంస్థలో క్రీయాశీల సభ్యులు బ్రిటీష్ వారికి తొత్తులుగా పనిచేసే భారతీయ అధికారులను, దేశ ద్రోహులుగా భావించి వారిని కూడా చంపేవారు. అమరేంద్రనాద్ చటర్జీ 1880 జూలై 1న పశ్చిమ బెంగాల్ హూగ్లీ లోని ఉత్తరపద గ్రామంలో ఉపేంద్రనాథ్ చటర్జీ ఇంట్లో జన్మించారు. ప్రారంభంలో అతను విప్లవాత్మక కార్యకలాపాల విషయంలో జాతీంద్రనాధ్ ముఖర్జీ పక్షాన నిలిచారు. తరువాత 1907లో ఆయన అరబిందో ఘోష్ ను కలుసుకుని, బ్రిటీష్ బానిసత్వం నుంచి దేశ విముక్తి కోసం పూర్తిగా అంకితమయ్యారు. విప్లవకారులకు నిధుల సేకరణలో సహాయం చేయడానికి అతన్ని అరబిందో బాగా ప్రోత్సహించేవారని చెబుతారు. ఆయన 1915లో అండర్ గ్రౌండ్ కి వెళ్ళి 5 సంవత్సరాల పాటు ఉంటూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారువేషంలో ప్రాయాణించేవారని చెబుతారు.
అతన్ని పట్టించిన వారికి 10,000 రూపాయలు బహుమతి కూడా బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా బెంగాల్ మొదటి మహిళా రాజకీయ ఖైదీ అయిన నానిబాలా దేవి అమరేంద్రకు దూరపు బంధువు. ఆమె అతని ద్వారా ప్రేరణ పొంది విప్లవాత్మక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆమె చందన్ నగర్ లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఆనరేంద్రనాథ్ చటర్జీకి, యుగాంతర్ సంస్థకు చెందిన ఇతర విప్లవకారులు జాదు గోపాల్ ముఖర్జీ, శివ్ భూషణ్ దత్ మొదలైన వారికి ఆశ్రయం కల్పించింది. 1923లో అనురేంద్రనాధ్ కొన్ని రోజులు జైల్లో ఉన్నాడు. తర్వాత ఇతరత్రా మార్గాల ద్వారా తన క్రియాశీలత పెంచుకుని ఉత్సాహంగా పని చేశాను. భారతదేశానికి స్వాతంత్యం వచ్చిన తరువాత కూడా ఆయన చురుగ్గా పని చేశారు. ఆయన 1957, సెప్టెంబర్ 4న 77 ఏళ్ళ వయసులో పశ్చిమ బెంగాల్ లో మరణించారు. అమరేంద్రనాధ్ చటర్జీ శిలా విగ్రహాన్ని అతని స్వస్థలమైన ఉత్తరపద ప్రధాన రహదారిలో ప్రతిష్టించారు.
సుశీల చైన్ ట్రెహాన్ తుది శ్వాస వరకు దేశ సేవలోనే: సుశీల చైన్ ట్రెహాన్ స్వాతంత్ర్యోద్యమకారులైన ఇతర మహిళలతో కలిసి దేశ స్వాతంత్యం కోసం తీవ్రంగా పోరాటం చేశారు. దేశ స్వాతంత్యం కోసం పోరాడుతున్న సమయంలో ఆమె పోలీసుల చేతిలో చిత్రహింసలు అనుభవించారు. పంజాబ్ లో ఆడ పిల్లలకు. చదువు నిషిద్ధంగా పరిగణించే ఆ రోజుల్లో ఆమె ఆడపిల్లల్ని విద్యావంతుల్ని చేయాలంటూ ప్రచారం చేపట్టారు. సుశీల పంజాబ్ లోని పఠాన్ కోట్ లో జూలై 1వ తేదీ 1923న జన్మించారు. నలుగురు తోబుట్టువుల్లో సుశీల చిన్నది. ఆమె తండ్రి మధురదాస్ ట్రెహాన్ వృత్తిరీత్యా కాంట్రాక్టర్, ఆయన పఠాన్ కోట్ లో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులలో ఒకరుగా పని చేశారు.
'అదే సమయంలో ఆయన ఆర్య సమాజ్ లో ప్రముఖ సభ్యుడిగా కూడా ఉన్నారు. సుశీల వయసు పెరుగుతున్నకొద్దీ భారతదేశ స్వాతంత్యం మీద అనుబంధాన్ని పెంచుకుంది. ఆమె తండ్రి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆ సమయంలో ఆమెకు ఒక పుస్తకం దొరికింది. అది చదివాక ఆమె భారతదేశ స్వాతంత్యం గురించిన ఆలోచనలు ఆమెను. చాలా ఉద్వేగభరితంగా మార్చాయి. భగత్ సింగ్ జీవితానికి సంబంధించిన ధైర్యసాహసాలతో కూడుకున్న కథల నుంచి ఆమె ఎంతగానో ప్రేరణ పొందింది.
స్త్రీలలో విద్యాస్పూర్తిని మేల్కొల్పి, వారిని స్వావలంబన దిశగా నడిపించేందుకు ఆమె సుదూర గ్రామాలకు సైకిల్ పై చాలా దూరం ప్రయాణించాల్సివచ్చేది. అక్కడ ఉండే మహిళలకు వంటపని, కుట్టుపని, పరిశుభ్రత వంటి విషయాలపట్ల అవగాహన కల్పించి ప్రోత్సహించేది. ఆ సమయంలో అమ్మాయిలు సైకిల్ తొక్కడం ఆ ప్రాంతంలో నిషిద్ధంగా పరిగణించేవారు. అయినా సుశీల ఆ ఆలోచన విడిచిపెట్టేది కాదు.