ఇందులో శరీరమాలిన్యం పోవటానికి ఆసనాలు, శ్వాసకి సంబంధించిన మాలిన్యం పోవటానికి ప్రాణాయామాలు, నడవడిలోని మాలిన్యం పోవటానికి యమ, నియమ, ప్రత్య హారాలు, మనోమాలిన్యం పోవటానికి ధారణ, ధ్యాన, సమాధులని పతంజలి వివరించారు.
వ్యాయామంలో బ్లడ్ షంటింగ్ అనేది ఇన్వాలంటీర్గా జరుగుతుంది. అదే ఆసన అభ్యా సంలో ఆ ఆసన స్థితిని అనుసరించి Conscious గా జరుగుతుంది. ఈ ప్రత్యేకత వలననే, ఆసనాలు శరీరావయవ ప్రవర్తనల్లో చోటుచేసుకొన్న వికృతు లను తొలగించి, ఆరోగ్యకరమయిన సంస్కృతిని ఆ అవయవానికి కలగచేస్తాయి.
శ్వాసకి సంబంధించిన మాలిన్యం పోవటానికి ప్రాణాయామాలు: ప్రాణాయామాన్ని శ్వాస ప్రవాహ నియంత్రణ అని అంటారు. మన శరీరంలోని వ్యవస్థలలో శ్వాసక్రియ వ్యవస్థకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది ‘Dual nature’ కలిగినది. శ్వాసను మన ప్రమేయం లేకుండానే పీల్చుకుంటాం. దీనిని ఇన్వాలంటరీ అంటారు. శ్వాసని మనం వాలంటరీగా కూడా తీసుకోవచ్చు. అందుకనే బాగా దీర్ఘంగా కూడా శ్వాసని పీల్చగలం. కనుకనే శ్వాసపక్రియ వ్యవస్థ (వాలంటరీ / ఇన్వాలంటరీ) Dual nature ని కలిగి ఉన్నది అని అంటారు. ఈ సౌకర్యం వల్లనే మనం ప్రాణాయామం చేయగలం.
శ్వాస ద్వారా మనం గ్రహించే ఆక్సిజన్ తక్కువ ఉండటంవల్ల జీవక్రియలు మందగిస్తాయి. ప్రాణాయామంలోని దీర్ఘ శ్వాసక్రియ వలన అవి చైతన్యవంతమవుతాయి. నిమిషానికి 16 నుంచి 18సార్లు తీసుకునే సాధారణ శ్వాసక్రియ ప్రాణాయామ అభ్యాసం వల్ల క్రమంగా తగ్గి ఆక్సిజన్ వినియోగం పెరుగుతుంది.
దీనివలన వంద ట్రిలియన్ జీవకణాలకి జరుగవలసిన ఆహారపదార్థాల సరఫరా, టాక్సిన్ల సేకరణ చక్కగా జరిగి Aging Process నిదానమవుతుంది. దీనివలన వ్యక్తి చురుకుగా, ఆరోగ్యంగా ఉంటాడు. ఒత్తిడిలేని దీర్ఘశ్వాసల ద్వారా చేసే ఈ ప్రాణాయామం వలన శరీరంలో నిరంతరం పేరుకుపోతూ ఉండే మాలిన్యాలు బయటకు పోతాయి. కొన్ని చెమటరూపంలో, కొన్ని బహిశ్వాసతోపాటు తొలగిపోతాయి. శ్వాస గతి స్థిరంగాను, నిలకడగానూ ఉంటుంది. అంతేగాక ఈ ప్రాణాయామం ప్రత్యక్షంగా న్యూరో హార్మోనల్ వ్యవస్థలపైన పనిచేసి వాటికి తగిన విశ్రాంతిని కలుగజేస్తుంది.
నడవడిలోని మాలిన్యం పోవటానికి యమ, నియమ, ప్రత్య హారాలు: నడవడిలో మాలిన్యాన్ని తొలగించుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దానికి పతంజలి సూచించిన మార్గాలే యమ, నియమ, ప్రత్యాహారాలు.
యమ: ఈ అంగంలో ఐదు రకాలయిన వ్రతాలను పాటించాలని పతంజలి సూచిం చారు.అవి:
1. అహింస : భయం, క్రోధం, వీటికి మూలాలు. వీటిని వదిలివేసినట్లయితే హింసా ప్రవృత్తి మనసు నుండి వైదొలగి వ్యక్తి ఆరోగ్య వంతుడవుతాడు.
2. సత్యం : సాధ్యమయినంతవరకు సత్యాన్నే చెప్పడం వలన వ్యక్తికి బలం చేకూరుతుంది. సత్యాన్ని పలకటం అంటే, తన అభిప్రాయాన్ని ఇతరులకు చెప్పేటప్పుడు మాటలో మోసం కాని, భ్రాంతి కాని, అర్థంకాకుండా ఉండటం కానీ ఉండకపోవటం.
3. అస్తేయం : ఇతరుల వస్తువులను తీసుకోకపోవటం, వాటి మీద ఆసక్తి లేకపోవటం.
4. బ్రహ్మచర్యం : అంటే మైథునంను త్యజించటం.
మనసు, వాక్కుల ద్వారా జరిగే సమస్త మైథునాలను త్యజించటం. ఇది వీర్య రక్షణ చేస్తుంది. కామోద్దీపనం కలిగించే ఆహారం తీసుకోకూడదు. కామ ప్రకోపాన్ని కలిగించే దృశ్యాలు చూడరాదు. అటువంటి మాటలు వినరాదు. అటువంటి సాహిత్యం చదవకుండా ఉండటం. ఆ విధమయిన భావాలు మనసులో రాకుండా ఉండటం బ్రహ్మచర్యమవుతుంది.
5. అపరిగ్రహం : ఆరాటపడటం, కావలసినదానికంటే ఎక్కువగా కూడ బెట్టడం, ఈ ఒక్క దానిపట్ల నియంత్రణ లేక నేడు అధికశాతం మానవులు అనారోగ్యం పాలవుతున్నారు.
నియమాలు : ఈ అంగంలో ఐదు తప్పనిసరిగా పాటించవలసిన పక్రియలను చెప్పారు పతంజలి.
6. శౌచం : అంటే శుభ్రత. నేటి విపత్కర పరిస్థితులలో ఈ విషయం పట్ల మనం చూపే శ్రద్ధనే మనల్ని ‘‘కరోనా’’ వంటి రోగాల నుంచి కాపాడుతుంది. శౌచం, బాహ్య శౌచమని, అంతర శౌచమని రెండు రకాలు. బాహ్యశౌచం శరీర శుభ్రతకి సంబంధించింది. అంతఃశౌచం – రాగద్వేషాలను తొలగించుకోవటం. దీనివలన మనసు స్వచ్ఛమై అందరి ఎడల ప్రీతిని కలిగి ఉంటుంది. ఇటువంటి శౌచాన్ని పాటించటం వలన వ్యక్తి శరీరం, మనసు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి.
7. సంతోషం : తనకు లభించిన దానితో తృప్తిని కలిగి ఉండే గుణం. ఇది లేని కారణంగా నేడు మనలో అనారోగ్యం ప్రబలుతున్నది. అందరం తప్పక అలవర్చుకోవలసిన గుణం ఇది.
8. తపస్సు : ఆకలి – దప్పిక శీతలం – ఉష్ణం, స్థాన (నిలబడటం) – ఆసనాలు (కూర్చోవటం) వంటి ద్వంద్వములను సహించటం, ఈ లక్షణములు కలిగిన నాడు వ్యక్తి తాము తపించే పనిలో లీనమవుతాడు. దీనివలన విజయం కలుగుతుంది.
9. స్వాధ్యాయం : ఓంకార జపం లేదా మోక్షమార్గం చూపే శాస్త్రాల పఠనం.
10. ఈశ్వర ప్రణిధానం : మనం చేసే పనులని పరమేశ్వరునికి సమర్పించటం. ఈ భావన లేకపోవడంతోనే మనిషి అంతా తానే అయినట్టు కర్మతో అనుబంధం ఏర్పరచుకొని, ఎలా బయట పడాలో తెలియక అనారోగ్యం పాలవుతున్నాడు. దీనిని ఈశ్వరునికి అర్పించటం వల్ల వ్యక్తి తాను చేసే పనిలో నిపుణతను పెంచుకోగలడు.
ప్రత్యాహారం: ఇంద్రియాలు తమ తమ లక్షణాలతో సంబంధం కోల్పోవడమే ప్రత్యాహారం. మనకి అయిదు జ్ఞానేంద్రియాలున్నాయి. అవి, జ్ఞాన సముపార్జనకు ఉపయోగపడే మాధ్యమాలు. రూపాలను గ్రహించడానికి కన్ను, శబ్దాలను గ్రహించటానికి చెవి, వాసనలను గ్రహించటానికి ముక్కు, రసము / రుచిని గ్రహించటానికి నాలుక, స్పర్శను గ్రహించటానికి చర్మం. ఐదు కర్మేంద్రియాలు కూడా ఉన్నాయి. వాక్కుకి వచనం / మాట్లాడటం, పాదానికి సంచారం, హస్తానికి గ్రహణం / తీసుకోవడం, వాయువుకు జీర్ణమయిన ఆహారాన్ని విసర్జించటం, ఉపస్థకు సంతానాన్ని కలుగజేయటం.
11. చివరిది మనస్సు. ఈ పదకొండు ఇంద్రియాల ద్వారా మనిషి జీవనం సాగదీస్తుంటాడు. ఇంద్రియ కార్యకలాపాలను ధర్మంతో సరిచేసుకొంటూ నిగ్రహాన్ని కలిగి ఉండినప్పుడు మనసులో ప్రశాంతత ఉంటుంది. అది లేనినాడు కనపడిన / విన్న / తిన్న / తాకిన ప్రతి విషయం మనలని తనవైపుకు లాగి పొందేలా చేస్తుంది. బలహీనమయిన మనసు దురలవాట్లకు దారి తీస్తుంది. ఇంద్రియాలు బుద్ధి అధీనంలో ఉండాలి కానీ బుద్ధి ఇంద్రియ అధీనంలో ఉండకూడదని యోగశాస్త్రం చెబుతుంది.
మనోమాలిన్యం పోవటానికి ధారణ, ధ్యాన, సమాధి: ధారణ: ధారణ అంటే బ్రహ్మమును (ఈశ్వరుని అనుకోవచ్చు) హృదయపద్మములో ధరించుట. ఇది మనో స్థితి. ధ్యానం బ్రహ్మ ఆత్మల గురించిన గురించిన చింత . ఇది సాధన. (ప్రగతితో కూడిన గతి) .గమ్యం సమాధి. అహంబ్రహ్మ తత్త్వం అనుభవంలోనికివచ్చే స్థితి. ధ్యానము : ధ్యేయ వస్తువుపై మనసును లగ్నముచేసి, అన్య పదార్థములను గమనించక, నిశ్చలమైన మనసుతో (చిత్తముతో) ధ్యేయ వస్తువైన ఈశ్వరుని గురించిన చింతలో ఉండుటయే ధ్యానము. సాధనా పూర్వకముగా పొందిన ద్వైత రహిత స్థితి సమాధి. (జీవుని ఈశ్వరుని వేరుగా భావించుట ద్వైతము, వానిని ఒకే వస్తువుగా అనుభవైంచుట అద్వైత సిద్ధి, అదే సమాధి స్థితి. సమాధి : నిత్యమూ శుద్ధమైన బుద్ధితో కూడి, సత్యమైన ఆనందముతో కూడిన తురీయ (మెలకువ, నిద్ర, స్వప్న స్థితులకు అతీతమైన) స్థితిలో ఏకము, అక్షరము (శాశ్వతము) ఐన నేను ఉన్నాను (అహమస్మి) అనే బ్రహ్మ భావనలో అహంబ్రహ్మాస్మి (నేనే ఆ బ్రహ్మమును) అనే ఎరుక కలిగియుండు అవస్థయే సమాధి.
పైన వివరింపబడిన అష్టాంగ యోగా సూత్రాలను పాటించినట్లయితే అందరమూ ఆనందముగా జీవించవచ్చు..
International Yoga Day 2025, Yoga Day 2025, World Yoga Day 2025, Yoga Day theme 2025, Yoga Day date 2025, Yoga Day 2025 celebration, Yoga Day 2025 activities, Yoga Day 2025 speech, Yoga Day 2025 essay, Why is June 21 yoga day?, ఎందుకు జూన్ 21 యోగా రోజు?
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
It is not reflecting. Patanjali yogadarsanam it is refleting
ReplyDelete