Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

తుప్పుపట్టని ఇనుప స్థంభం గురించి మీకు తెలుసా ? Iron Pillar in Delhi - megaminds

1500 సంవత్సరాలుగా తుప్పుపట్టని ఇనుప స్థంభం.. ఎక్కడుందో మీకు తెలుసా ?   ఢిల్లీ లోని మెహ్రౌలీ ప్రాంతం లో ఉన్న కుతుబ్ మినార్ ప్ర...



1500 సంవత్సరాలుగా తుప్పుపట్టని ఇనుప స్థంభం.. ఎక్కడుందో మీకు తెలుసా ? ఢిల్లీ లోని మెహ్రౌలీ ప్రాంతం లో ఉన్న కుతుబ్ మినార్ ప్రాంగణంలో సుప్రసిద్ధ కుతుబ్ మినార్ (విష్ణు స్థంభం) మరియు మరెన్నో ఇతర ప్రామాణిక చారిత్రక స్మారకాలకి నిలయం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడిన ఈ ప్రాంతం లో అనేక రాజవంశానికి చెందిన కట్టడాలు ఉన్నాయి. ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ మరియు ఢిల్లీ లోని ఒక మంచి విహార ప్రదేశం.

1500 సంవత్సరాలుగా గాలికి,వానకు,ఎండకు తడుస్తూ తుప్పుపట్టని ఇనుప స్థంభం ఒకటి మన ఇండియాలోనే వుంది. ఇది ప్రపంచంలో మరి ఎక్కడా కనీవినీ ఎరుగని వింత. కొన్ని వందల సంవత్సరాలుగా ఆ లోహం ఎందుకు తుప్పుపట్టలేదు అనేది ఒక అంతుపట్టని విషయం. ఇనుప స్తంభం సాధారణంగా ఎంత దాచినా ఇనుము అనేది తుప్పు పట్టక మానదు అలాంటిది దాదాపు 1500 ఏళ్ల నుండి ఎండకు ఎండినా, వానకు తడిచినా, మంచులో ఉన్నా కూడా తుప్పు పట్టలేదు.

ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ ఢిల్లీ లోని కువాత్ ఉల్ ఇస్లాం మసీద్ లో ఉంది. 'ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ' అని బాగా ఫేమస్.. 7.23 మీటర్ల ఎత్తు ఉన్న ఈ స్థంభం 1500 ఏళ్లైనా తుప్పు పట్టలేదు.ప్రపంచంలోని ఎందరో శాస్త్రవేత్తలు వచ్చి పరీక్షించినా దాని రహస్యం బయటపెట్టలేకపోయారు. అయితే దీన్ని ఐరన్ హైడ్రోజన్ పాస్పేట్ హైడ్రేట్ ద్వారా రూపొందించినట్లు కొందరు భావిస్తున్నారు. సజీవ సాక్ష్యం అయితే అన్ని ఏళ్ల కిందట దీన్ని ఎలా రూపొందించి ఉంటారన్నది వారు ఇప్పటికీ తల గోక్కొంటున్నారు. ఢిల్లీ నగరంలోని కుతుబ్ మినార్ ప్రాంగణంలో వున్న ఇనుప స్థంభం భారతీయ విజ్ఞాన శాస్త్ర వున్నతికి సజీవ సాక్ష్యం. ఈ స్తంభం ప్రాచీన భారతదేశపు మెటలర్జిస్టుల నైపుణ్యానికి సజీవ సాక్ష్యం.

ఇటువంటిది ప్రపంచంలో మరెక్కడా లేదు. దీని ఎత్తు 7.23మీ కాగా వ్యాసం 40 సెం.మీ వుంది. దీని బరువు 6 టన్నుల పైనే వుంది. ఐఐటి కాన్పూర్ విద్యార్ధులు ఈ ఐరన్ పిల్లర్ పై పరిశోధనలు కూడా జరిపారు. వారు దానిపై మిస్వైట్ అనే సన్నని పొర స్తంభాన్ని తుప్పు పట్టకుండా కాపాడుతుందని కనుగొన్నారు. ఈ రసాయనం ఇనుము, ఆక్సిజన్, హైడ్రోజన్తో గుప్తుల కాలంలో తయారుచేయబడిందట. ఇందులో వాడబడ్డ ఇనుములో అధిక భాగం పాస్పరస్ వున్నట్లు తెలిసింది. ఇది గుప్తుల కాలంనాడు నిర్మించినట్లు తెలియవస్తుంది. కాంస్య బుద్ధ ప్రతిమ ఇటువంటిదే, బీహార్ రాష్ట్రంలో మరియొక కాంస్య బుద్ధ ప్రతిమ కూడా కలదు. ఇది కూడా వాతావరణ ప్రభావానికి ఎదురునిలచి ఇంకను ఆకర్షణీయంగానే కనపడుచున్నది. ఈ రెండు లోహ మిశ్రమముల వివరాలు రాసాయనిక ధర్మాలు ఈనాడు మనకి లభించవు.

ఇటువంటి మేధోపరమైన రసాయనిక శాస్త్ర విజ్ఞానమూర్తులు ఆనాడు ఎందఱో వుండేవారు. వారిలో ఆచార్య నాగార్జునుడు రసాయన శాస్త్ర ఘని. వీరి రసాయన శాస్త్ర గ్రంథం నుంచి అరబ్బులు అల్కమీగా పిల్చుకునే ఇతర లోహాలను బంగారంగా మార్చే ప్రక్రియను సంగ్రహించారు. ప్రాచీన భారతీయ రసాయన శాస్త్రం ప్రాచీన భారతీయ రసాయన శాస్త్ర ఘనుల్లో ఇలాటివారు ఎంతో మంది వున్నారు. లోహ నిర్మాణంలో వాడిన ఆ రసాయనిక ధర్మాల వివరాలను ఎవ్వరూ ఇంకా కనిపెట్టలేకపోయారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments