వీళ్ల గురించి ఎవరు మాట్లాడతారు? మౌనాన్ని వీడండి!! The Yezidi Community – History, Faith, and the Struggle for Survival

megaminds
0
Yezidi genocide

వీళ్ల గురించి ఎవరు మాట్లాడతారు? మౌనాన్ని వీడండి!!: ఎందుకు ప్రపంచం అంతా మౌనంగా ఉండిపోయింది. ఈ నిశ్చబ్దాన్ని నేను చేదిస్తానని భావిస్తూ నా మౌనాన్ని వీడుతున్నాను, నా గళాన్ని విప్పుతున్నాను, నా కలాన్ని కన్నీటితో తడిపి ఈ వాఖ్యాలు వ్రాస్తున్నాను.

మనం ఎప్పుడూ వినని ఒక తెగ యజిడి. ISIS వాళ్లు పూర్తిగా యజిడీలను నాశనం చేయాలని చూశారు. కానీ వారు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఉత్తర ఇరాక్‌లోని అత్యంత పురాతన జాతి. మతం పరంగా మైనారిటీ అయిన యజీడీలు, శతాబ్దాలుగా హింసను ఎదుర్కొంటూ సొంత నేలపై బానిసలుగా ఉండిపోయారు. 2014లో ISIS వారిని తుడిచిపెట్టేయాలని ప్రయత్నించింది.

యజీడీ మతం అనేది జొరాస్ట్రియన్ మతం, ఇస్లాం, క్రైస్తవం మతాల మేళవింపు. శతాబ్దాలుగా వారిని‌ క్రైస్తవం, ఇస్లాం సైతానులుగా దూషించాయి. ఈ సైతాన్ లుగా భావించడం వలన ఇస్లాం మతం వారిపై ద్వేషాన్ని పెంచింది. వారిపై జరిగిన మారణహోమాలకు పునాదిగా మారింది. ఈ చరిత్రాత్మక తప్పిదమే ISIS చేసిన మారణ హోమానికి దారితీసింది. 2014 ఆగస్టు, ISIS యజిడీల ప్రధాన కేంద్రం సింజార్ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. గ్రామాలు ధ్వంసమయ్యాయి. వేలాది మంది పురుషులను చంపేశారు. మహిళలు, బాలికలు బానిసలుగా అమ్మబడ్డారు, మరియు పక్కా అత్యాచారాలకు గురయ్యారు. ఐక్యరాజ్యసమితి పరిశోధకులు దీన్ని అధికారికంగా “మారణహోమంగా” గా గుర్తించారు.

ISIS యజిడీ మహిళలు మరియు పిల్లలను కొనుగోలు, అమ్మకం చేసే బానిస మార్కెట్లు నిర్వహించింది. 9 ఏళ్ల పసిపిల్లల్నీ “భార్యలుగా” అమ్మేశారు. కుటుంబాలు విడిపోయాయి, అనేకమంది మహిళలు సిరియా, ఇరాక్ అంతటా పదుల సార్లు మార్చి మార్చి తిరిగి బానిసలుగా అమ్మబడ్డారు. వేలాది మంది సింజార్ కొండపైకి పారిపోయారు, ఆహారం, నీరు లేకుండా అలమటించారు. అలా ఆకలితో, దాహంతో విలవిలలాడుతున్న యజిడీ కుటుంబాల చిత్రాలు ప్రపంచాన్ని షాక్‌కు గురి చేశాయి. అమెరికా వైమానిక దాడులు, కుర్ద్ సైనికుల సహాయంతో ఆ ముట్టడి చివరకు ముగిసింది. కానీ అప్పటికే వేలాది ప్రాణాలు పోయాయి.

ఈ తీవ్రమైన గాయాల తర్వాత కూడా యజిడీలు ధైర్యాన్ని కోల్పోలేదు. తమ భాష, సంగీతం, పవిత్ర సంప్రదాయాలను కాపాడుకునేందుకు వారు పోరాడుతునేవున్నారు. వారి పుట్టిన మాతృభూమి నాశనాన్ని తలచుకుంటూనే యూరప్‌లో శరణార్థులుగా జీవిస్తూ, కొత్త జీవితం మొదలుపెట్టారు.

ISIS యజీదీలను నాశనం చేయాలని ప్రయత్నించింది. కానీ దాని బదులుగా, వారి కథ ధైర్యం మరియు స్థైర్యానికి ప్రతీకగా మారింది. వారిని చరిత్ర నుండి చెరిపేయాలని ప్రయత్నించినా, అన్ని ప్రతికూలతల మధ్య కూడా యజిడీలు తమ సంస్కృతిని ససజీవంగా ఉంచారు.

అయితే యజిడీల దీనగాథ ISISతో ముగియలేదు. 2023 సంవత్సరంలో 2014లో ISIS కిడ్నాప్ చేసిన ఒక యజిడీ మహిళ గాజాలో హమాస్ చేతుల్లో బంధిగా మారింది. ISIS మరియు హమాస్ మధ్య ఉన్న సంబంధం అదే సిద్ధాంతం, అదే తీవ్రవాద దృష్టికోణం. యజీదీ మహిళలను బానిసలుగా మార్చిన ఆ ఆలోచనే, ఇప్పటికీ ప్రపంచాన్ని భయపెడుతోంది. 2014 లో ISIS బందీలుగా చేసి బానిసలుగా వేలం చేసి మరీ అమ్ముకుంది అక్షరాలా 7000 మందిని అందులో 2599 మంది ఈ రోజు కీ ఎక్కడున్నారో, ఏమయ్యారో తెలీదు.

ఇకపోతే యూదులు: ఇస్లాం, క్రైస్తవ మతాలకు పుట్టుకకు కారణమే యూదు జాతి అటువంటి వారినే పాలస్తీనా నేలపై లేకుండా ప్రపంచ వ్యాప్తంగా తరిమివేయబడ్డారు ఇస్లాం మత చాందసంతో అలా పారిపోయిన వారికి ఆశ్రమం ఇచ్చింది భారత దేశం. మరలా 1918 లో పాలస్తీనాని ఒట్టమన్ సామ్రాజ్యం నుండి విముక్తి గావించి మొదటి ప్రపంచ యుద్ధం లో వారికి ఇచ్చింది భారత కలవరీ దళాలు. ఆ తరువాత 1948 లో అమెరికా చొరవతో పూర్తిగా వారికి స్వాతంత్ర్యం లభించి ప్రపంచంలో ఉన్న యూదుల‌ందరూ అక్కడకు చేరి మరలా వారి వైభవాన్ని పున: ప్రారంభం చేశారు.

మొత్తం ముస్లిం దేశాల మధ్య తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఒక పెద్ద సైనిక వ్యవస్థను ఏర్పరుచుకుని తమ జీవితాలను ఈ 76 ఏళ్లల్లో అద్బుతంగా తీర్చి దిద్దుకుంటే, బ్రిటీషర్స్ చేసిన ఒక చిన్న తప్పు పాలస్తీనా లో ఉన్న ఇతర మతస్తులను వెళ్లగొట్టవద్దు అన్న దానిని గౌరవించి, గాజా ప్రాంతాన్ని ముస్లింలకు వదిలేసి హాయిగా బ్రతుకుతుంటే గాజాలో ISIS తరహా సంస్థ హమాస్ 2023 అక్టోబర్ 7న హాయిగా ఎంజాయ్ చేస్తున్న యూదులపై ఇజ్రాయెల్ లో అతిభయంకరమైన దాడులు చేసి 1200 మందిని చంపి 251 మందిని సుమారుగా బందీలుగా చేసి తీసుకెళ్లారు. రెండేళ్లు పూర్తయ్యింది. హమాస్ ని భయంకరమైన దాడులతో భూస్థాపితం చేసే ప్రయత్నం చేసింది ఇజ్రాయెల్. ఎట్టకేలకు ట్రంప్ 20 బిందువులతో ఒక ప్రణాళిక తయారు చేసి హమాస్ బందీలను విడుదల చేస్తే శాంతికై ఇజ్రాయెల్ యుద్ధ విరమణ కు ఒప్పుకుంది. కానీ ఏమయ్యింది, 20 మందిని మాత్రమే వదిలింది హమాస్ మరి మిగతా 231 మంది ఏమయినట్లు. అనేది అతిపెద్ద ప్రశ్న.

అలగే హిందువులపై ఇస్లాం జరిపిన నరమేధం ఒకే ఒక ఉదాహరణ ఇస్తున్నాను, కాశ్మీరీ పండిట్‌ల నరమేధం 1990లో 4 లక్షలకు పైగా హిందువులు తమ ఇళ్లు విడిచి పారిపోవలసి వచ్చింది. వందలాది మందిని క్రూరంగా చంపేశారు.

ఇప్పుడు చెప్పండి ఇస్లాం తన పుట్టుకకు కారణమైన యూదులను, యజిడీ జాతులనే కాదు యావత్ ప్రపంచానికి జ్ఞానానిచ్చిన హిందూ జాతినే తుడిచిపెట్ట చూస్తుంటే మరి ఎందుకు? ఎందుకు? ఈ దేశ మేదావులుగా చలామణి అవుతు‌న్న అర్బన్ నక్సల్స్, సెక్యులర్లు, కమ్యునిష్ట్ లు, మానవ హక్కుల సంఘాల వాళ్లు మౌనాన్ని వహిస్తున్నారు.

ఎందుకు హిందువుల, యజిడీల, యూదుల బాధ వీరికి కనిపించదు? ఎందుకు వీళ్ల కన్నీళ్లు కనిపించవు? ప్రతిసారీ ఈ సమాజాలపై దారుణమైన దాడులు జరిగితే అదే మానవ హక్కుల సంఘాలు మౌనం పాటిస్తారు. లేదా వ్యతిరేక కథనాలు అల్లుతారు ఇజ్రాయెల్ ని తప్పుగా చూపిస్తారు, హిందువులపై నిందలేస్తూ కాషాయ తీవ్రవాదం అంటూ మండిపడతారు. ఒకవేళ బాధితుడు వేరే మతానికి చెందినవాడైతే వెంటనే ప్రెస్‌ కాన్ఫరెన్సులు, కొవ్వొత్తి ర్యాలీలు, ట్విట్టర్‌ తుఫాన్లు.

ఇంత డబుల్‌ స్టాండర్డ్ ఎందుకు? ఎందుకు హిందూ, యూదు, యజిడీల రక్తం అంత నీచంగా కనిపిస్తోంది వీరి కళ్ళకు?  ఎందుకంటే వీళ్లు వారి ఇష్టమైన కథనాల్లో సరిపోరు. “హిందువులు మెజారిటీ కాబట్టి వారు బాధితులు కాలేరు” ఇదే వారి లాజిక్. కానీ నిజం సంఖ్యలపై ఆధారపడదు.
బాధ అంటే బాధే. నష్టం అంటే నష్టమే. అది మెజారిటీకి జరిగినా, మైనారిటీకి జరిగినా తేడా లేదు. ఈ మౌనం నిరపరాధం కాదు, ఇది వారి లెక్కలతో కూడిన మౌనం.

కానీ వారు ఎంచుకున్నప్పుడు మాత్రమే వేగంగా స్పందిస్తారు! నేరస్థుడి పేరు హిందూ అయితే వెంటనే “హిందుత్వ హింస” అంటారు. అలానే‌ యూదులని, యజిడీలను. అల్లర్లలో హిందువులు, యూదులు పాల్గొన్నా, అది రక్షణకై అయినా “హిందూ తీవ్రవాదం” అని అరుస్తారు, గగ్గోలు పెడతారు. కానీ హిందువులు, యూదులు చనిపోతే “మేము ఇంకా వివరాలు సేకరిస్తున్నాం” లేదా మతరంగు పులమకండి ఉగ్రవాదానికి మతం లేదు అంటారు. మానవత్వం ముసుగు ధరించి, వాస్తవికత దాచేస్తారు.

మానవ హక్కులు, కమ్యునిష్ట్ సంస్థలు అంటాయి వారు సమానత్వం, గౌరవం, మానవ జీవితం కోసం నిలుస్తామని. కానీ వారి ప్రవర్తన ఇలా చెప్పకనే చెబుతుంది:
ముస్లిం బాధితుడు - ఆగ్రహం పెల్లుబుకుతుంది.
క్రైస్తవ బాధితుడు - ఐక్యత కొట్టొస్తుంది.
కమ్యునిష్ట్ బాధితుడు - చర్య వెంటనే మొదలవుతుంది.
హిందూ, యూదు, యజిడీ బాధితుడు అయితే మాత్రం - మౌనం గా ఉండి వారికి అనుకూలంగా మార్పు చేసి మళ్లీ వీళ్లపై‌నే తప్పుడు ప్రచారం చేస్తారు. వారికి హిందువులు, యూదులు, యజిడీలు “మనుషులుగా” కాదు, “అణచివేసేవారుగా” మాత్రమే కనిపిస్తారు.

అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా మౌనం: హిందువులపై, యూదులపై, యజిడీలపై హింస జరిగినప్పుడు అంతర్జాతీయ మీడియా కవరేజ్‌ ఉండదు. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు ఉండవు. UN సంస్థల నుండి లేఖలు ఉండవు. బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, లేదా యూకేలోని లీసెస్టర్‌లో ఆలయాలపై దాడులు జరిగినప్పటికీ ప్రపంచం నిశ్శబ్దంగా చూస్తూ మాకేంతెలీదు, మేమేం చూడలేదు అసలు మా దృష్టికే రాలేదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు.

దీని అర్థం ఏమిటి ఈ మౌనం కేవలం బాధాకరం కాదు ప్రమాదకరం. ఎందుకంటే ఒక సమాజపు బాధను విస్మరించేప్పుడు, అన్యాయం మళ్లీ మళ్లీ జరుగుతుంది, తీవ్రవాదులు ధైర్యం పొందుతారు, బాధితులు న్యాయంపై నమ్మకం కోల్పోతారు. హిందువులకు, యజిడీలకు, యూదులకు కూడా సమాన మానవ హక్కులు లేకపోతే ఎలా? మనం అడగాల్సిందే ఇవి నిజంగా మానవ హక్కుల సంస్థలా? లేక రాజకీయ హక్కుల సంస్థలా?

ఈ విషయాలను మీకు చెప్పడానికి నా కలాన్ని కన్నీటితో తడిపాను. 251 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని బందీలుగా చేసి 20 మందినే పంపిస్తే 231 మంది ఏమయినట్లు, కనీసం వాళ్ల శవాలను కూడా ఇంకా ఇవ్వలేదు. ఒకవేళ ఎప్పటికీ ఇవ్వకపోతే వాళ్ళ కామానికి బలై మరణించినట్లే, అలాగే యజిడీలను, కాశ్మీరీ హిందువులను కూడా వీళ్లు ఇలానే చేశారు. ఈ సమాచారాన్ని మీకు అందించడానికి ముఖ్య కారణం 9 ఏళ్ల‌క్రితం బందీ కాబడ్డ యజిడీ చెల్లెలి కోసం నిరీక్షించిన అన్న‌ ఆమెని చూసి కన్నీరు, మున్నీరైన సన్నివేశం చూసి, అలాగే హమాస్ లకు బందీలు కాబడ్డ మహిళా తల్లుతండ్రుల‌ మౌన రోదన చూసి భరించలేక‌ నా మౌనాన్ని వీడుతూ మీ ముందుంచాను.

మరి ఇప్పుడు మనం చేయవలసింది ఒక్కటే మాట్లాడమే, మౌనాన్ని వీడటమే, ప్రతీ ఘటించడమే చరిత్రే సాక్ష్యంగా చేసుకుని ముల్లుని ముల్లుతోనే తీయాలి. స్వాతంత్ర్య వీరుల త్యాగాలు వృదాగా పోరాదు. హిందువుల బాధను పట్టించుకోని మానవ హక్కులు మానవహితమైనవే కావు.
అన్యాయాన్ని చూసి మౌనం పాటించడం తటస్థత కాదు అది ద్రోహం. -రాజశేఖర్ నన్నపనేని. MegaMinds

Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.

MegaMinds

Yezidi community, Yezidis history, Yezidi religion, Yezidi genocide, Iraq minorities, Middle East religions, Yezidi beliefs, Yezidi persecution, Yezidi culture, Yezidi faith


At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top