మలిక్ పేల్చిన ఆఫిడవిట్ బాంబ్ “టెర్రరిస్ట్కి PM థాంక్స్ చెప్పారా?” సంచలంగా మారిన యాసిన్ మలిక్ క్లెయిమ్
జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (JKLF) చీఫ్. ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న టెర్రరిస్ట్ యాసిన్ మలిక్, 2025 ఆగస్టు 25 ఢిల్లీ హైకోర్టుకి సమర్పించిన ఆఫిడవిట్లో షాకింగ్ విషయాల్ని పొందుపరిచాడు.
2006లో పాకిస్తాన్లో లష్కర్-ఎ-తొయిబా (LeT) వ్యవస్థాపకుడు మరియు 26/11 ముంబై దాడి మాస్టర్మైండ్ హఫీజ్ సయీద్తో తను మీటింగ్ ఏర్పాటు చేసి కలవడంపై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వ్యక్తిగతంగా తనకు ధన్యవాదాలు తెలియజేశారని చెప్పాడు.
ఈ మీటింగ్ తన స్వంత కోరికతో కాకుండా భారత ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) సీనియర్ అధికారుల అభ్యర్థన మేరకు భారత-పాక్ బ్యాక్చానల్ పీస్ ప్రాసెస్లో భాగంగా జరిగిందని మలిక్ వాదనలు చేశారు. మలిక్ పొందుపరిచిన ఈ సంచలన విషయం ఇప్పుడు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తూ భారత రక్షణ–విదేశాంగ చరిత్రలో తీవ్ర కలకలం రేపుతోంది.
ఏంటా మీటింగ్? IB అభ్యర్థన ఏంటి?
2005 కాశ్మీర్ భూకంపం తర్వాత 2006లో పాకిస్తాన్కు రిలీఫ్ వర్క్ కోసం వెళ్లిన మలిక్ను, IB స్పెషల్ డైరెక్టర్ వి.కె. జోషి ఢిల్లీలో కలిసి, పాక్ రాజకీయ నాయకులతో పాటు టెర్రర్ గ్రూప్ లీడర్లతో—ముఖ్యంగా హఫీజ్ సయీద్తో మాట్లాడాలని అభ్యర్థించారని మలిక్ తన ఆఫిడవిట్లో పేర్కొన్నారు.
పాక్తో చర్చలు అర్ధవంతరంగా ఉండాలంటే టెర్రరిస్ట్ నాయకులను కూడా చర్చల్లో చేర్చాలని IB అధికారులు తనకు చెప్పారని, అలాగే యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ సభ్యులతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్లు మలిక్ చెప్పాడు.
ఈ మీటింగ్ వల్ల మలిక్ను “నాన్-వయాలెంట్ మూవ్మెంట్ ఫాదర్”గా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రశంసించారని, ఒక ఫోటోపై రాసిన మెసేజ్లో కూడా ఇది పేర్కొన్నారని మలిక్ తన అఫిడవిట్లో చెప్పారు.
జిహాద్ గ్రూప్స్కి శాంతి సందేశం ఇచ్చానని మలిక్ వాదన
అతను ఆఫిడవిట్ లో చెప్పిన దాని ప్రకారం...
హఫీజ్ సయీద్ పాకిస్తాన్లో జిహాద్ గ్రూప్స్ని
పెద్ద ఎత్తున సమీకరించి, ఆ మీటింగ్లో మలిక్కు మాట్లాడే అవకాశం కల్పించారన్నారు.
అదే సభలో మలిక్ టెర్రరిస్టులు హింస వదిలి శాంతికి ఒప్పుకోవాలని పిలుపునిచ్చానని చెప్పుకొచ్చాడు. ఈ మీటింగ్ భారత్–పాక్ శాంతి చర్చలకు ముఖ్యం అని మలిక్ చెప్పాడు, కానీ తర్వాత కొన్ని రోజులకు అదే విషయాన్ని తన మాటలు వక్రీకరించారనే ఆరోపణ చేశాడు.
హఫీజ్ సయీద్తో చేసిన షేక్ హ్యాండ్స్ ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. మలిక్ దీన్ని “శాంతి చర్చలు”గా వివరించాడు. ఆ తర్వాత JKLF – LeT గ్రూప్స్ మధ్య డైలాగ్కు ఇది దారితీసిందని, కానీ ఇప్పుడు మాత్రం టెర్రర్ ఫండింగ్ ఆరోపణల కేసులో తనను జైల్లో పెట్టారని వాదిస్తున్నాడు.
NSA చీఫ్ సమక్షంలో మన్మోహన్ సింగ్ థాంక్స్?
పాక్ ట్రిప్ తర్వాత ఢిల్లీ తిరిగి వచ్చిన మలిక్. మాజీ NSA చీఫ్ ఎం.కె. నారాయణన్ సమక్షంలో మన్మోహన్ సింగ్ని కలిసాడు. అక్కడ తన పాక్లో జరిగిన మీటింగ్ల వివరాలన్నిటినీ అప్డేట్ చేశానని, అందుకు పీఎం తన కృతజ్ఞత వ్యక్తం చేశారని మలిక్ అఫిడవిట్లో చెప్పారు.
ఈ సందర్భంగా తనను మన్మోహన్ సింగ్ “కాశ్మీర్లో నాన్-వయాలెంట్ మూవ్మెంట్ ఫాదర్”గా ప్రశంసించారని కూడా మలిక్ చెప్పుకొచ్చాడు.
మలిక్ బ్యాక్గ్రౌండ్ – రక్తపాతం చరిత్ర
యాసిన్ మలిక్ JKLF యొక్క మాజీ కమాండర్-ఇన్-చీఫ్. 1990లో శ్రీనగర్లో 4 మంది IAF ఆఫీసర్లను చంపిన కేసు, ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కూతురు రుబైయా సయీద్ అపహరణ, కాశ్మీరీ పండిట్లపై దాడులు, మారణహోమం—ఈ అన్నింటిపై ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
NIA టెర్రర్ ఫండింగ్ కేసులో మలిక్, హఫీజ్ సయీద్, సలహుద్దీన్, షబ్బీర్ షా కలిసి పాక్ టెర్రర్ గ్రూప్స్తో కుట్ర చేసి కాశ్మీర్లో అశాంతి రేపారని దర్యాప్తు చేసింది.
మలిక్ మాత్రం “శాంతి కోసం పనిచేశాను, ఇవన్నీ రాజకీయ కుట్రలు” అని చెబుతూనే ఉన్నాడు. కానీ UAPA ట్రిబ్యునల్ JKLFపై నిషేధాన్ని కొనసాగిస్తూ “ఏర్పాటు వాద ఉగ్రవాదానికి సహనం లేదని” స్పష్టం చేసింది.
BJP రియాక్షన్ – “UPAకి దేశ భద్రత మీద పట్టు లేదు”
మలిక్ అఫిడవిట్ వెలుగులోకి రాగానే BJP నేతలు మండిపడుతున్నారు. UPA ప్రభుత్వాన్ని దేశ భద్రతను బలి చేసినదని ఆరోపిస్తున్నారు. BJP IT హెడ్ అమిత్ మాల్వియా కూడా దీనిపై పదునైన ట్వీట్లు చేశారు.
శాంతి చర్చల్లో టెర్రరిజం నీడ
మలిక్ ఆఫిడవిట్ భారత-పాక్ శాంతి చర్చల్లో టెర్రర్ నీడను బయటపెట్టింది. హఫీజ్ సయీద్, జిహాద్ కౌన్సిల్స్ వరకు వెళ్లిన ఈ చర్చలు దేశ రాజకీయాల్లో మళ్లీ తుఫాన్ సృష్టిస్తున్నాయి.
మలిక్ తనను శాంతికర్తగా చూపించుకోవాలనుకున్నా, అతని హింసాత్మక గతం మరియు ఈ అఫిడవిట్ కలిపి మరింత పెద్ద వివాదానికి దారితీస్తున్నాయి.
ఇప్పుడు ఈ విషయం కోర్టు, రాజకీయాలు, మీడియా ప్రతీ ప్లాట్ఫామ్లో ఒక హాట్ టాపిక్గా మారింది.
ఉగ్రవాదులకే వేదిక — దేశాన్నే తాకట్టు పెట్టిన కాంగ్రెస్ పాలన
కాశ్మీర్ పండిట్ల మారణకాండకు ప్రత్యక్ష బాధ్యుడైన యాసిన్ మలిక్ లాంటి కిరాతక ఉగ్రవాదితో, హఫీజ్ సయీద్ ఎదుట చర్చలు జరపమని IB వంటి జాతీయ భద్రతా సంస్థలనే వాడి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు నెట్టడం, భారతదేశానికి చేసిన అతిపెద్ద విశ్వాస ఘాతం. అమాయకుల రక్తంతో చేతులు కడుక్కున్నవారిని "శాంతి దూతలు"గా ముస్తాబు చేసి ప్రధానమంత్రి కార్యాలయం నుంచే కృతజ్ఞతలు తెలిపి సత్కరించడం, దేశాన్ని తాత్కాలిక రాజకీయ లాభాల కోసం ఉగ్రవాదుల పాదాలదగ్గర వంగబెట్టిన ఘోర తప్పిదం.
కేవలం తప్పిదం కాదు, దేశ సార్వభౌమత్వాన్ని బలి చేసిన పాపం. కాశ్మీరీ పండిట్లు నరమేధంలో ప్రాణాలు కోల్పోతుంటే, కాంగ్రెస్ మాత్రం ఆ మారణకాండకే ప్రధాన నాయుకుడైన మలిక్తో రహస్య చర్చలు జరిపి అతణ్ని చట్టబద్ధం చేయడానికి ప్రయత్నించింది. దేశాన్ని రక్తపాతం చేసిన ఉగ్రవాదులకు తెరకట్టిన వేదిక, అప్పటి పాలకులు నిజానికి తీవ్రవాదం వెన్నుదన్నుగా నిలిచారని ఈ అఫిడవిట్ మళ్లీ నిరూపిస్తోంది. కరుణాకర్ బుదురు. రాజకీయ, సామాజిక విశ్లేషణలు.
Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.
Karunakar Buduru #team Mega Minds, buduruwritings #BreakingNews #ExplosiveAffidavit #ShockingClaim #IndiaDebates #TerrorLinks #HafizSaeed #YasinMalik #NationalSecurity#UPA #Congress #BJP #indianpolitics
At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.