చిప్ అయినా షిప్ అయినా భారత్ లోనే తయారుచేసుకుందాం - సముద్రం నుండి సమృద్ధి
ఈ రోజు మోడీ జీ భావ్ నగర్ లో పోర్ట్ ల అభివృద్ధి కార్యక్రమాల కు సంబంధించి దేశం లోని 40 ప్రాంతాల్లో ఉన్నటువంటి పోర్ట్ ల అధికారులని, కొంత మంది పారిశ్రామిక వేత్తలను పిలిచి అతిపెద్ద నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సభలో మోడీ జీ విస్తుపోయే విషయాలు ప్రస్తావించారు.
ఒకప్పుడు భారతదేశం చాళుక్యులు, చోళులు, 500 ఏళ్ల క్రితం రాణి అబ్బక్క చౌత, 350 ఏళ్ల క్రితం ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి వారు సముద్రం పై ఆధిపత్యం కలిగి ఉండేవాళ్ళు. అలాగే నౌకావ్యాపారం, సొంత నౌకల నిర్మాణం, నౌకలపై యుద్ధాలు ఇవన్నీ భారత్ సొంతంగా ఉండేది, సముద్రం పై భారత్ అజేయశక్తిని కలిగి ఉండేది అలాంటిది, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎలాంటి దుస్తితి కి చేరిందో, కాంగ్రెస్ భారత్ ని ఎలా నాశనం చేసిందో మోడీ జీ మాటల్లో ఇక్కడ మీకందిస్తున్నాను.
భారత్ ఈరోజు “విశ్వ బంధు” భావనతో ముందుకు సాగుతోంది. మనకు శత్రువు ఎవ్వరూ లేరు. నిజమైన శత్రువు ఇతర దేశాలపై ఆధారపడటం. ఎంత ఎక్కువ ఆధారపడతామో, మన దేశం అంత విఫలమవుతుంది. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉండాలి. 140 కోట్ల భారతీయుల భవిష్యత్తును మనం ఇతరుల దయపై వదిలేయలేం. గుజరాత్ లో ఒక వాక్యం వుంది “సౌ దుఖోకి ఏక్ దవాయి” (100 కష్టాలకు ఒకే ఔషధం) అదే ఆత్మనిర్భర్ భారత్. ఇతరులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి. భారత్ తన శక్తిని ప్రపంచం ముందు నిలబెట్టుకోవాలి.
భారతదేశానికి శక్తి లోపం లేదు. కానీ స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు భారత శక్తిని పట్టించుకోలేదు. దశాబ్దాల తరబడి లైసెన్స్ కోటా రాజ్తో దేశాన్ని కట్టిపడేశారు. తర్వాత గ్లోబలైజేషన్ వచ్చినప్పుడు కేవలం దిగుమతుల దారినే నడిపారు. కోట్ల రూపాయల అవినీతి చేశారు. దీనివల్ల భారత యువత దెబ్బతిన్నారు.
ఒక ఉదాహరణ – షిప్పింగ్ రంగం. వందల ఏళ్లుగా భారత్ ప్రపంచంలో పెద్ద సముద్ర శక్తిగా ఉండేది. 50 ఏళ్ల క్రితం మన ఇంపోర్ట్-ఎక్స్పోర్ట్లో 40% దేశంలోనే తయారైన నౌకలతో జరిగేది. కానీ కాంగ్రెస్ విధానాల వల్ల నౌకానిర్మాణ పరిశ్రమ నాశనం అయింది. ఈ రోజు మన వాణిజ్యంలో 95% కోసం విదేశీ నౌకలపై ఆధారపడుతున్నాం.
ప్రతి సంవత్సరం మనం 75 బిలియన్ డాలర్లు (6 లక్షల కోట్ల రూపాయలు) విదేశీ షిప్పింగ్ కంపెనీలకు చెల్లిస్తున్నాం. ఇది మన రక్షణ బడ్జెట్కు సమానం. ఈ డబ్బు మన దేశంలో పెట్టుబడి పెట్టబడుంటే, ఈ రోజు ప్రపంచం భారత నౌకలను వాడేది.
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందాలంటే ఒకే మార్గం ఉంది ఆత్మనిర్భర్ భారత్. చిప్ అయినా, షిప్ అయినా భారత్లో తయారు కావాలి. అందుకే నూతన సముద్ర చట్టాలు, “ఒకే దేశం – ఒకే డాక్యుమెంట్”, “ఒకే దేశం – ఒకే పోర్ట్ ప్రాసెస్” విధానం ప్రారంభించాము. పాత బ్రిటిష్ చట్టాలను రద్దు చేశాము.
భారత్ మళ్లీ పెద్ద నౌకలు నిర్మించగల శక్తిని తిరిగి పొందుతుంది. INS విక్రాంత్ – భారత్లోనే నిర్మించబడింది. అవసరమైన స్టీల్ కూడా భారత్లో తయారు చేయబడింది. మన సామర్థ్యం నిరూపించబడింది.
ఇప్పుడు ప్రభుత్వం పెద్ద నౌకలను “ఇన్ఫ్రాస్ట్రక్చర్”గా గుర్తించింది. దీనివల్ల షిప్బిల్డింగ్ కంపెనీలకు రుణాలు సులభంగా లభిస్తాయి. వడ్డీ తగ్గుతుంది. గ్లోబల్ పోటీలో భారత్ ముందుకు వస్తుంది.
ఇకపై మూడు కొత్త స్కీమ్స్ ద్వారా షిప్ బిల్డింగ్ రంగానికి 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. షిప్ బిల్డింగ్ను “Mother of All Industries” అంటారు. ఇది స్టీల్, మెషినరీ, టెక్స్టైల్, ఐటీ వంటి అనేక రంగాలకు ప్రోత్సాహం ఇస్తుంది. ఒక్క ఉద్యోగం ఆరు కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది. నైపుణ్యం కోసం ITIs, Maritime Universityలు, NCC–నేవీ సమన్వయం – వీటితో కొత్త అవకాశాలు వస్తాయి.
గత 11 ఏళ్లలో మన పోర్ట్ సామర్థ్యం రెండింతలు అయింది. టర్న్ అరౌండ్ టైమ్ 2 రోజుల నుంచి 1 రోజుకి తగ్గింది. కేరళలో డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, మహారాష్ట్రలో వాధవన్ పోర్ట్ – ఇవి ప్రపంచ స్థాయిలో నిర్మాణం జరిగాయి.
ప్రస్తుతం ప్రపంచ సముద్ర వాణిజ్యంలో భారత్ వాటా 10%. 2047 నాటికి మూడింతలు చేయాలనుకుంటున్నాం. మన సీ-ఫేరర్స్ సంఖ్య 3 లక్షలు దాటింది – భారత్ ప్రపంచంలో టాప్-3 దేశాల్లో ఒకటి.
మన సముద్ర వారసత్వం మత్స్యకారులు, ప్రాచీన పోర్ట్ నగరాలు ఇవన్నీ భవిష్యత్ తరాలకు అందించాలి. లోథల్లో ప్రపంచంలోనే అతి పెద్ద Maritime Museum నిర్మాణం జరుగుతోంది. Statue of Unityలా ఇది కూడా భారత్కు గుర్తింపు పొందుతుంది. గుజరాత్ తీరప్రాంతం మళ్లీ వరంగా మారుతోంది. దేశంలో వచ్చే కార్గోలో 40% గుజరాత్ పోర్టులు హ్యాండిల్ చేస్తున్నాయి. Dedicated Freight Corridor వల్ల మరింత వేగంగా సరుకు రవాణా అవుతుంది. అలంగ్ Ship-Breaking Yard అనేక ఉద్యోగాలు సృష్టిస్తోంది.
వికసిత భారత్కు దారి ఆత్మనిర్భర్ భారత్. మనం కొనే ప్రతిదీ స్వదేశీ కావాలి. మనం అమ్మే ప్రతిదీ స్వదేశీ కావాలి. ప్రతి దుకాణంలో ఒక బోర్డు ఉండాలి “గర్వంగా చెప్పండి, ఇది స్వదేశీ”. మన ప్రతి పండుగలో భారత్ సమృద్ధి పండుగ అవ్వాలి. నవరాత్రి మండపాల నుంచి మొదలెట్టి “ఆత్మనిర్భర్ భారత్” సందేశాన్ని దేశమంతటికీ తెలుపుదాం. జయ్ హిందురాష్ట్ర, రాజశేఖర్ నన్నపనేని, Mega Minds
Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.
Chip or Ship Make in India, Atmanirbhar Bharat manufacturing, India semiconductor industry, India shipbuilding growth, Make in India 2025, Electronics manufacturing India, India self-reliance technology
At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.