సరిహద్దు దేశాల్లో తిరుగుబాటు: భారతదేశ విచ్ఛిన్నానికి కుట్ర
ఇటీవలి కాలంలో దక్షిణాసియా అంతటా విద్యార్థుల (యువత) ఉద్యమాలు ఉధృతమవుతున్నాయి. నేపాల్లో ఖాట్మండు వీధులు, ఇండోనేషియాలో జకార్తా రోడ్లు, బంగ్లాదేశ్లో ఢాకా చౌరస్తాలు ఇలా అన్నిచోట్లా విద్యార్థుల నిరసనలు ఒక్కసారిగా ఉప్పెనలా ఎగిసిపడుతున్నాయి. పైకి చూస్తే ఇవన్నీ స్థానిక సమస్యల ముసుగులో జరిగే నిరసనలుగా కనిపిస్తాయి. కానీ కాస్త అధ్యయనం చేసి లోతుగా పరిశీలిస్తే, ప్రణాళికా బద్ధంగా వీటి వెనుక ఒకే లక్ష్యం దాగి ఉందని అర్థమవుతుంది అదే భారతదేశాన్ని అస్థిరపరచడం.
నేపాల్ యువత "మార్పు కోసం" అని వీధుల్లోకి వస్తే అల్లర్లు, జకార్తాలో పోలీసులు విద్యార్థుల ఘర్షణలు చెలరేగాయి. అదే రీతిలో ఢాకాలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగి ప్రభుత్వం కూలిపోయింది కొత్త ప్రభుత్వం ఏర్పడింది. విభిన్న నినాదాలు, విభిన్న జెండాలు ఉన్నా వీటన్నింటికీ ఒకే మూలకారణం ఉంది. కేవలం యువతను గందరగోళానికి గురిచేసి వారినే సాధనాలుగా మార్చడం. "ఆదర్శవాదం" అనే మాటతో వారిని ఆకర్షించి, "సామాజిక న్యాయం" పేరిట వీధులలోకి నెట్టడం కొత్త పద్ధతి కాదు, కానీ ఇప్పుడు ఇది తీవ్రరూపం దాల్సి పక్కాగా అమలు చేస్తున్నారు.
విద్యార్థులే ఎందుకు లక్ష్యం? ఎందుకంటే వారు భావోద్వేగానికి లోనవుతారు, శక్తివంతంగా ఉంటారు, మార్పు కోసం కలలు కంటారు. వారిని ఒకసారిగా కదిలించడం చాలా సులభం. "విద్యార్థుల ఉద్యమం" అనే ముసుగులో అసలు లక్ష్యం వేరే దిశలో ఉంటుంది. ఉదాహరణకు, నేపాల్లో భారత్తో సాన్నిహిత్యం పెరుగుతుండగా నిరసనలు ప్రబలడం, ఇండోనేషియా ఇండో-పసిఫిక్ సహకారంలో భారత్తో కలిసి నడుస్తుంటే జకార్తాలో అశాంతి చెలరగడం, బంగ్లాదేశ్ ఎన్నికల ముందు ఉద్రిక్తతలు పెరగడం అన్నీ కలిపి ఒక్కసారిగా చూసినప్పుడు ఇవన్నీ యాదృచ్ఛికం కావు.
భారతదేశంలో కూడా ఇదే టూల్కిట్ నడుస్తోంది. ఇక్కడ "రిజర్వేషన్", "ఉద్యోగాలు", "విద్యార్థుల సమస్యలు" పేరుతో యువతను ఇటువంటి ఉద్యమాల్లోకి లాగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షం దీనిని బహిరంగంగానే ప్రోత్సహిస్తోంది. ఇది నేపాల్, ఢాకాలో కనిపించిన స్క్రిప్ట్కే. "విద్యార్థులు అనే కార్డ్" చరిత్రలో ఎన్నో సార్లు అస్థిరతకు వాడిన అస్త్రం అదే విధానం ఇక్కడ కూడా దేశాల విచ్ఛిన్నానికి జరుగుతుంది.
అదే సమయంలో ఇటువంటి సారూప్యత కలిగిన నినాదాలు గమనిస్తే మరింత స్పష్టత వస్తుంది. నేపాల్లో "ప్రజాస్వామ్యాన్ని రక్షించు", బంగ్లాదేశ్లో "రాజ్యాంగాన్ని రక్షించు", భారతదేశంలో "రిజర్వేషన్ నీ హక్కు" వంటి పదాలు వేరు, కానీ వీటన్నిటి లక్ష్యం మాత్రం ఒకటే యువతలో " మా భవిష్యత్తు దోపిడీకి గురవుతోంది" అనే భావన నాటడం. ఫలితంగా, వారి కోపాన్ని రోడ్ల మీదకు మళ్ళించడం సులభమవుతుంది. ఈ ప్రక్రియ చివరికి దాగి ఉన్న అంతర్గత, భాహ్య శక్తులకు మేలు చేస్తుంది, చివరకు భారతదేశ వనరులను, అభివృద్ధి ను నాశనం చేస్తుంది.
ఈ పరిస్థితి ఆగకపోతే, భారతదేశం "తగలబడి" పోతుంది ఒకాయన నేను దేశం అంతా కిరోసిన్ చల్లానని డైరెక్ట్ స్టేట్మెంట్ లు ఇస్తున్నాడు, హైడ్రోజన్ పేలుస్తా అంటున్నాడు. పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్, ఇండోనేషియా అశాంతులు, అంతర్గతంగా రిజర్వేషన్, ఉద్యోగ సమస్యల పేరిట గందరగోళాలు ఇలా అన్నీ ఒకే ఉద్దేశ్యంతో నడుస్తున్నాయి. వీటి ప్రారంభం ఎప్పుడూ హింసతో కాకుండా "నినాదాలతో"నే జరుగుతుంది. కానీ ఆ తర్వాతి దశలో అవి అల్లర్లకు దారితీస్తున్నాయి.
అలాగే ఫ్రాన్స్లో మాక్రాన్ ప్రభుత్వం కూలిపోగా, జపాన్ ప్రధాని రాజీనామా, నేపాల్లో రాజీనామా, ఇండోనేషియాలో అల్లర్లు, బంగ్లాదేశ్లో రాజీనామా ఇలా దక్షిణ ఆసియా ప్రాంతం మొత్తం అల్లకల్లోలంలో మునిగిపోతున్న వేళ, చలించకుండా, దృఢంగా మన దేశాన్ని నిలబెట్టిన నాయకత్వం మాత్రం గత 11 సంవత్సరాల్లో ఆరుగురు పాక్ ప్రధానులు, ఐదుగురు యుకె ప్రధానులు, నలుగురు అమెరికా అధ్యక్షులు, నలుగురు శ్రీలంక అధ్యక్షులు, ఇద్దరు ఫ్రెంచ్ అధ్యక్షులు మారిపోయినా మనదేశ నాయకత్వం మాత్రం ధీరత్వంతో నిలబడి, భారతదేశాన్ని ప్రపంచ నాయకత్వం వైపు నడిపిస్తున్నారు.
కాబట్టి వీటన్నిటినీ మనమంతా గమనిస్తూ పోవాలి. భారత యువత అప్రమత్తంగా ఉండాలి. నిజమైన సమస్యలపై పోరాడటం ఒకవైపు, అలాగే బయట నుంచి నడిపించే శక్తుల్లో, కుట్రల్లో knowingly లేదా unknowingly పాల్గొనకుండా ఉండటం మరోవైపు. చరిత్ర చెబుతున్నది స్పష్టమే, విద్యార్థుల తిరుగుబాట్లు ఒక దేశ భవిష్యత్తుని బలోపేతం చేయవు, అస్థిరం చేస్తాయి. రాబోయే రోజుల్లో యువత తమ శక్తిని దేశ నిర్మాణంలో పెట్టాలి, అశాంతి, గందరగోళం రేపే శక్తులకు యువత పావులుగా మారకూడదు. దేశాన్ని కాపాడేది యువతే, కానీ అదే యువతను ఉపయోగించి దేశాన్ని బలహీనపరచాలని ప్రయత్నం జరుగుతోంది. దీనిని గుర్తించి, మసలుకోగలిగితేనే భారత్ మరింత శక్తివంతంగా నిలుస్తుంది. విశ్వగురుత్వం వహిస్తుంది. -రాజశేఖర్ నన్నపనేని, Mega Minds
Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.
fake narratives, misinformation awareness, digital lies, social media myths, propaganda detection, truth vs lies, online awareness, fact check
At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.