జపాడ్-2025లో భారత్ పాల్గొనడం పై పాశ్చాత్య మీడియా కలవరానికి కారణమేంటి?
రష్యా-బెలారస్ సంయుక్త సైనిక విన్యాసాలు జపాడ్-2025 సెప్టెంబర్ 12 నుండి 16 వరకు జరుగుతున్నాయి. ఇందులో భారత్ కూడా 65 మంది సైనికులతో పాల్గొంటోంది. ముఖ్యంగా కుమావోన్ రెజిమెంట్ నుంచి సైనికులు, అలాగే భారత వాయుసేన, నౌకాదళం ప్రతినిధులు ఈ విన్యాసాల్లో భాగమవుతున్నారు. మలినో ట్రైనింగ్ గ్రౌండ్లో కంపెనీ స్థాయి కార్యకలాపాలు, టాక్టికల్ డ్రిల్స్, ప్రత్యేక యుద్ధ నైపుణ్యాల శిక్షణ ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఉంటాయి.
ఈ విన్యాసాలను రష్యా, బెలారస్ ఉగ్రవాదులకు వ్యతిరేక రక్షణాత్మక చర్యలుగా ప్రకటించినా, ఇందులో అణు ఆయుధాలు, ఓరెష్నిక్ మిస్సైల్ వంటి ఆధునిక వ్యవస్థలు కూడా శిక్షణలో ఉపయోగిస్తుండటంతో NATO దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యాన్ని ఉపయోగించుకుని బ్రిటిష్ మీడియా సంస్థ The Times భారత్ ఈ విన్యాసాల్లో పాల్గొనడం ద్వారా “red line crossed” అని వ్యాఖ్యానించింది.
అసలు విషయానికొస్తే, ఇది భారత్కి కొత్తేమీ కాదు. ఇప్పటికే భారత్ జపాడ్-2021లో 200 మంది సైనికులతో పాల్గొంది. ఆ సమయంలో రష్యాలోని నిజ్నీ నోవ్గోరోడ్ ప్రాంతంలో సెప్టెంబర్ 3 నుండి 16 వరకు జరిగిన శిక్షణలో నాగా రెజిమెంట్ బెటాలియన్, మెకానైజ్డ్ ఇన్ఫాంట్రీ, IAF కమాండోలు పాల్గొన్నారు. ఈ విన్యాసాల్లో హెలికాప్టర్ ఆపరేషన్లు, ఫ్రీ ఫాల్ జంప్స్, మెకానైజ్డ్ మాన్యువర్స్ వంటి ప్రత్యేక శిక్షణలు ప్రదర్శించారు.
జపాడ్-2021లో మొత్తం 17 దేశాలు పాల్గొనడం గమనార్హం. మంగోలియా, ఆర్మేనియా, కజక్స్తాన్, కిర్గిజ్స్తాన్, సెర్బియా వంటి దేశాలు ఉండగా, చైనా, పాకిస్తాన్ పరిశీలకులుగా వచ్చాయి. అప్పట్లో కూడా ఉగ్రవాద వ్యతిరేక శిక్షణకే ప్రధాన ప్రాధాన్యం ఇవ్వబడింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ స్వయంగా పరిశీలించగా, భారత్ ప్రతిభను కనబరిచింది.
భారత్ ఎప్పటినుంచో రష్యాతో బహుళ సైనిక విన్యాసాలు చేస్తూ వస్తోంది. ఇంద్రా, వోస్టాక్, మిలన్ వంటి శిక్షణలు ఈ స్నేహానికి సాక్ష్యాలు. అదే సమయంలో భారత్ అమెరికా, యూరప్ దేశాలతోనూ క్రమం తప్పకుండా విన్యాసాలు చేస్తోంది. ఇది భారత్ విదేశాంగ విధానం – ఎవరి పట్లా వక్రదృష్టి లేకుండా, సమాన దూరాన్ని పాటిస్తూ, బలమైన సైనిక సంబంధాలను కొనసాగించడం.
పోలాండ్ వంటి కొన్ని NATO దేశాలు బెలారస్ సరిహద్దును మూసివేసి భద్రత పెంచుకుంటున్నప్పటికీ, భారత్ ఈ విన్యాసాల్లో పాల్గొనడం ఎప్పటికీ ‘redline’ కాదు. దీనిని రక్షణ సహకారం బలోపేతం చేయడంగానే చూడాలి. అయితే The Times వంటి పాశ్చాత్య మీడియా సంస్థలు భారత్పై అనవసరమైన విమర్శలు చేసి, అంతర్జాతీయ వేదికపై తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఇలాంటి జాతి వివక్షతో కూడిన, ద్వంద్వ వైఖరి చూపే మీడియా హౌస్లు భారత్పై ఎలాంటి అపవాదలు మోపినా, వాస్తవం ఏమిటో ప్రపంచం బాగా తెలుసుకుంటుంది. భారత్ ఎప్పటిలాగే స్వతంత్రంగా, ధైర్యంగా తన దారిలో ముందుకు సాగుతుంది. అందుకే The Times లాంటి పక్షపాతపూరిత పత్రికలకు సరైన సమాధానం దేశం మొత్తం ఐక్యంగా నిలబడడమే.
“భారత్పై వ్యతిరేక కథనాలు సృష్టించే అబద్దపు పోర్టల్స్ను & వెబ్ సైట్ లను చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇవ్వాల్సిందే!!!” -పతంజలి వడ్లమూడి. MegaMinds.
Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.
Zapad 2025, Russia Belarus military exercise, India participation Zapad 2025, NATO response Zapad 2025, Russian military drills 2025, Belarus war games, Zapad 2025 fake news, The Times UK India Russia, Indian Army Zapad 2025, Russia Belarus joint drills, global security Zapad 2025, military alliance news 2025, Zapad 2025 geopolitics, India Russia relations 2025, Zapad 2025 NATO tensions
At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.