Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మహా విప్లవ వీరుడు టిరోట్ సింగ్ సైయామో - Anglo-Khasi War - Unsung Hero U Tirot Sing

మేఘాలయలోని ఖాసీ కొండల్లో జరిగిన భారత స్వాతంత్ర్య పోరాట కథ ఇది. బ్రిటీష్ పాలన నుండి భారతదేశాన్ని విముక్తి చేయడానికి తమ జీవితాలను ...


మేఘాలయలోని ఖాసీ కొండల్లో జరిగిన భారత స్వాతంత్ర్య పోరాట కథ ఇది. బ్రిటీష్ పాలన నుండి భారతదేశాన్ని విముక్తి చేయడానికి తమ జీవితాలను త్యాగం చేసిన అనేక మంది యోధులకు భారత స్వాతంత్ర్య పోరాటం జన్మనిచ్చింది. బ్రిటీష్ వాళ్ళు మనల్ని పాలించడం మోదలుపెట్టాక దశలవారీగా తమ రాజకీయ నియంత్రణలోకి ఖాసీ, గారో మరియు జైంతియా కొండలను తెచ్చుకున్నారు. ఖాసి గిరి, వనవాసుల పెద్దలు, స్థానిక నాయకుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. మేఘాలయలోని మధ్య-పశ్చిమ ఖాసీ కొండల్లో ఉన్న నోంగ్‌ఖ్లావ్ అనే ఖాసీ రాజ్యానికి టిరోట్ సింగ్ సైయెమ్ (చీఫ్) గా ఉన్నారు. టిరోట్ సింగ్ 1802లో జన్మించాడు. సియెమ్లీ వంశస్తుడు. చక్కటి నాయకత్వ లక్షణాలను కలిగిన టిరోట్ సింగ్ ని కొండ ప్రజలు అతన్ని సియెమ్ అని పిలుస్తారు.

మొదటి ఆంగ్లో-బర్మీ యుద్ధం (1824-26) మరియు యాండబూ ఒప్పందం (1826)పై సంతకం చేసిన తరువాత, బ్రిటీష్ ప్రభుత్వం బ్రహ్మపుత్ర మరియు సుర్మా యొక్క రెండు లోయలను ఆల్-వెదర్ రహదారి ద్వారా అనుసంధానించడానికి బ్రహ్మపుత్రను ఆక్రమించాలని నిర్ణయించింది. అటువంటి రహదారిని ఖాసీలో హిమా నోంగ్‌ఖ్లావ్ ప్రాంతం గుండా మాత్రమే నిర్మించవచ్చు. అస్సాం మరియు సిల్హెట్‌లను బెంగాల్‌లోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానించడానికి ఇది అనువైన మార్గం. రెండు ముఖ్యమైన బ్రిటీష్ ప్రధాన కార్యాలయాలు - కామరూప్ (ప్రస్తుతం గౌహతి) సిల్హెట్ (ప్రస్తుత బంగ్లాదేశ్‌లో)తో అనుసంధానం చేయడం దీని లక్ష్యం. రహదారి మెరుగుపరచడం ద్వారా వారి దళాల వేగంగా ఒకచోట నుండి మరొక చోటుకి మార్చవచ్చు అందుకే ఈ రెండు లోయలను అనుసంధానించడం బ్రిటిష్ వారికి ప్రాముఖ్యతను కలిగి ఉంది.

ఈశాన్య సరిహద్దులో బ్రిటీష్ వారి ఏజెంట్ డేవిడ్ స్కాట్ ఈ రహదారి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని టిరోట్ సింగ్‌ను అభ్యర్థించాడు. స్కాట్ అనుమతికి బదులుగా, అస్సాం గుండా వెళ్ళే దువార్లు మరియు చెక్-పోస్టులపై టిరోట్ సింగ్‌కు నియంత్రణ ఇవ్వబడుతుందని ప్రతిపాదించారు. ప్రతిపాదిత మార్గంలో స్వేచ్ఛా వాణిజ్యానికి కూడా వారు హామీ ఇచ్చారు. టిరోట్ సింగ్ తన దర్బార్‌తో రెండు రోజుల సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత ఈ ప్రతిపాదనకు సమ్మతించాడు, ఇది ఖాసీ ప్రాంతంలో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని నమ్మాడు. ఈ రహదారి నిర్మాణం ప్రారంభమైన తర్వాత, ప్రస్తుత అస్సాంలోని రాణికి చెందిన రాజా బలరామ్ సింగ్ దువార్లపై టిరోట్ సింగ్ వాదనను వివాదం చేశారు. తిరోట్ సింగ్ తన దళాలతో అతనిని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు, బ్రిటిష్ వారు చివరి క్షణంలో అతనికి ద్రోహం చేశారు.

బ్రిటీష్ వాళ్ళు బలవంతంగా కొండల్లోకి చొచ్చుకుపోయి, భూములను ఆక్రమించుకుని, స్థానికులపై మతమార్పిడీలకి పాల్పడుతున్నారు. విదేశీయుల ఏకపక్ష చర్యలపై టిరోట్ సింగ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాసీలు కొండల నుండి విదేశీయులను తరిమికొట్టాలని నిర్ణయించుకున్నారు, ఇది చివరికి 1829-1833 ఆంగ్లో-ఖాసీ యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధంలో టిరోట్ సింగ్ ఆదర్శప్రాయమైన పాత్ర పోషించాడు. బ్రిటీష్ వాళ్ళు గౌహతి మరియు సిల్హెట్ నుండి మరిన్ని బలగాలను తీసుకువస్తున్నారనే వార్త అతనికి అందింది. బ్రహ్మపుత్ర మరియు సుర్మా లోయల మధ్య ఉన్న మొత్తం భూభాగాన్ని వారు స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారని అతను అర్థం చేసుకున్నాడు.

తన రాజ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన చెంది, వెంటనే నోంగ్‌ఖ్లావ్‌ ను విడిచి పెట్టమని బ్రిటీష్ వారికి నోటీసు ఇచ్చాడు. కానీ, ఆయన ఆదేశాలను వారు పట్టించుకోలేదు. ఖాసీ కొండలను వలసరాజ్యం చేసేందుకు బ్రిటిష్ వారి ప్రయత్నానికి వ్యతిరేకంగా అతను యుద్ధం ప్రకటించాడు. ఏప్రిల్ 4, 1829 రాత్రి, టిరోట్ సింగ్ యొక్క దళాలు నోంగ్‌ఖ్లావ్‌లోని బ్రిటిష్ దండుపై దాడి చేశాయి, ఇందులో ఇద్దరు అధికారులు మరణించారు, ప్రాణనష్టానికి గురయ్యారు. టిరోట్ సింగ్ మరియు అతని సైన్యం లొంగిపోకుండా నాలుగు సంవత్సరాలు నిరంతరం పోరాడారు.

టిరోట్ సింగ్ యోధుల ప్రత్యేక బృందాలను ఎన్నుకున్నాడు మరియు మందుగుండు సామగ్రిని ఉత్పత్తి చేయడానికి వారిని కొండలలోని రహస్య గుహలలో మోహరించాడు. ఖాసీ కొండల్లో నియమించబడిన బ్రిటీష్ అధికారులను వారి అవుట్‌పోస్టులపై రాత్రిపూట ఘోరమైన దాడులు నిర్వహించి భయభ్రాంతులకు గురిచేశాడు. వారు గెరిల్లా వార్‌ఫేర్‌లో స్థానికంగా అభివృద్ధి చేసిన వివిధ పద్ధతులను కూడా ఉపయోగించారు. తమ కొండ ప్రాంతాల పరిజ్ఞానాన్ని తమ అత్యంత ప్రయోజనం కోసం ఉపయోగించుకున్నారు. టిరోట్ సింగ్ తీవ్రమైన బుల్లెట్ గాయం తగిలిన తర్వాత కూడా అతని దేశభక్తి పరాక్రమాన్ని తగ్గించలేకపోయింది. అతను తన తెలివిగల సంస్థాగత నైపుణ్యాలకు ప్రసిద్ది చెందాడు, సమర్థవంతమైన గూఢచారుల మద్దతు ఉంది. తమ తోటి వీరులకి ప్రేరణకోసం రోమాంచిత మాటలు పలికేవాడు - "సామంతుడిగా పరిపాలించడం కంటే స్వతంత్ర రాజుగా చనిపోవడం మంచిది" - ఈ మాటలు ఖాసీ ప్రజలలో బలం మరియు ధైర్యాన్ని నింపింది.

టిరోట్ సింగ్ కొండలలో దాగి ఉన్న ప్రదేశం నుండి బ్రిటిష్ దళాలచే జనవరి 1833 న బంధించబడ్డాడు. విచారణ అనంతరం అతడిని ఢాకాకు తరలించారు. టిరోట్ సింగ్ జూలై 17, 1835న ఢాకా సెంట్రల్ జైలులో మరణించాడు. అతని పేరు షిల్లాంగ్‌లోని అమరవీరుల స్థూపం వద్ద గారో నాయకుడు పా టోగన్ నెంగ్మింజా సంగ్మా మరియు జైంతియా యోధుడు యు కియాంగ్ నంగ్‌బా పేర్లతో పాటు చిరస్థాయిగా నిలిచిపోయింది.

మైరాంగ్‌లోని మదన్ మోట్ టిరోట్‌లో 2020 సంవత్సరం అతని 186వ వర్ధంతి సందర్భంగా టిరోట్ సింగ్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు. మేఘాలయలో ప్రతి సంవత్సరం జూలై 17న తిరోట్ సింగ్ వర్ధంతి జరుపుకుంటారు (రాష్ట్ర సెలవుదినంగా ప్రకటించారు). భారత ప్రభుత్వం 1988లో ఆయన గౌరవార్థం ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది. 700 మంది యోదుల బృంధాన్ని కలిగిన మహా విప్లవ వీరుడు టిరోట్ సింగ్ సైయామో. తిరోట్ సింగ్ వంటి వీరోచిత నాయకులు బ్రిటిష్ పాలనలో ఎందరో అసువులు బాసారు...

1 comment