ఇండో పాక్ యుద్ధం 1947 - బ్రిగేడియర్ రాజేందర్ సింగ్ బలిదానం - 1947 Indo - Pak war and brigadier-rajinder-singh in telugu

megaminds
0
ఎటువంటి రక్తపాతం, అల్లర్లు ఉండవని నేను హామీ ఇస్తున్నాను, నేను సైనికుణ్ణి, సామాన్య పౌరుణ్ణి కాదు అంటూ మౌంట్ బాటన్ ప్రగల్భాలు పలికి దేశాన్ని మత ప్రాతిపదికన రెండు ముక్కలు చేశాడు. భారతచరిత్రలో ఎన్నడూ ఎవరూ చూడని మహాప్రళయం సంభవించింది. కాంగ్రెస్ నిరాకరించిన జనాభా బదలాయింపు మొదలైంది. జనం కుటుంబాలతో మూటాముల్లె సర్దుకుని ఎడ్లబండ్లలో, కాలినడకన ప్రయాణమై వస్తుంటే, వేలాది మందిని చంపేసి, ముష్కర మూకలు దోపిడీ చేసారు. ప్రపంచచరిత్రలో అంతకుముందు కనీవినీ ఎరుగని అతిపెద్ద జనాభా మార్పిడి ఇది. రాజధాని ఢిల్లీలో అతి ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలో ప్రతి 4వ వ్యక్తి, పాకిస్తాన్ నుంచి భారతానికి వచ్చిన హిందూ లేక సిక్ఖు కాందిశీకులే.

సరిహద్దుల వెంబడి హిందువుల, సిఖ్ఖుల రక్తం ఏరులై పారించారు ముస్లిం మత చాందస పాకిస్థానీలు. ఇది ఇలా ఉండగా అంతలోనే మాటమార్చిన మౌంట్ బాటన్ కాశ్మీర్ ను పాకిస్తాన్ లో కలపమని మహారాజా హరిసింగ్ కి చెప్పినప్పటికీ, 1947 అక్టోబర్ 17న గురూజీ గోల్వాల్కర్ కాశ్మీరును భారత్ లో విలీనం చేయమని మహారాజుని ఒప్పించారు. కాశ్మీర్ కి రాజు హిందువు కానీ జనాభా ప్రాతిపదికన ఎక్కువమంది ముస్లింలు ఉన్నారు ఇది గమనించిన పాకిస్తాన్, కాశ్మీర్ ముస్లింలు అండతో కాశ్మీర్ ని చేజిక్కించుకోవాలని స్వాతంత్ర్యం వచ్చిన రెండునెలలు గడవకుండానే భారత్ పై యుద్దం ప్రకటించి కాశ్మీర్ ని చెజిక్కించుకోవాలని పన్నాగం పన్నింది. ఈ యుద్దంలో భారత్ కాశ్మీర్ ని ఎలా కాపాడుకోగలిగింది. కాశ్మీర్ ని కాపాడి బలిదానం అయిన బ్రిగేడియర్ రాజేంద్ర సింగ్ గురించి పూర్తిపాఠం తెలుసుకుందాం.

గోళ్వాల్కర్ గురూజీ అభ్యర్థన మేరకు మహారాజా హరిసింగ్ భారత్ లో విలీనం సంగతి తెలిసి, పాకిస్తానీ ముష్కర సైన్యం కాశ్మీర్ ని ఆక్రమించుకోవాలని నిర్ణయించుకుని సరిహద్దులవైపు సైన్యంతో దూసుకువచ్చింది. బారాముల్లా మీదుగా కాశ్మీర్‌లోకి ప్రవేశించి, సిక్కు మరియు కాశ్మీరీ పండిట్‌లను లక్ష్యంగా చేసుకుని, భారతభూమిని 'ప్రక్షాళన' చేసే ప్రయత్నంలో అత్యాచారం, హత్య మరియు దహనం చేశారు. 21 అక్టోబరు 1947న జమ్మూ, కాశ్మీర్ రాష్ట్ర బలగాలు దాని సరిహద్దుల వెంబడి వేలాది మంది పాకిస్తానీ సైన్యంతో పోరాడాలని, వారిని తరిమికొట్టాలని నిర్ణయించుకుంది. పరిమిత మందుగుండు సామాగ్రితో చిన్న దళం ఎటువంటి రహదారి కమ్యూనికేషన్ లేకుండా, పాకిస్తానీ సైన్యంతో పట్టుదలతో పోరాడారు. శత్రువు దగ్గరకి వచ్చేస్తున్నాడు. ఉడి, డోమెల్, బారామూలాలను దాటేస్తే తరువాత కశ్మీర్ లోయ గుండెకాయ శ్రీనగర్ కి చేరుకుంటాడు. శ్రీనగర్ చేజిక్కితే మొత్తం లోయ పాకిస్తాన్ చేజిక్కినట్టే. అందాల నందనవనం కశ్మీరం ముష్కరుల చేజిక్కినట్టే.

22 అక్టోబర్ 1947న, మహారాజా హరి సింగ్ జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా పనిచేసిన బ్రిగేడియర్ మహారాజు సేనాధ్యక్షుడు బ్రగేడియర్ రాజేంద్ర సింగ్ జమువాల్ ను పిలిపించాడు. “బ్రిగేడియర్ రాజేంద్ర సింగ్…. శత్రువు దూసుకొస్తున్నాడు. శత్రువును ఎలాగైనా ఉడి దాటనీయకూడదు. తుదకంటా పోరాడండి. చివరి వ్యక్తి వరకూ పోరాడండి.” ఇదీ ఆయన ఆదేశం. మహారాజు కు వినయంగా నమస్కరించాడు రాజేంద్ర సింగ్. మహారాజు ఆజ్ఞ అర్థమేమిటో అతనికి తెలుసు. ఆరువేల మంది శత్రువులు… తన చేతిలో కేవలం నూటయాభై మంది. ఆయుధాలు కూడా పెద్దగా లేవు. శత్రువును నిలువరించడం అంటే ప్రాణాలపై ఆశవదులుకోవలసిందే. కానీ మరో ఆలోచన లేకుండా సైన్యంతో బయలుదేరి వెళ్లాడు రాజేంద్ర సింగ్.

అక్టోబర్ 23, 1947న, జమ్మూ కశ్మీర్ భారత్ సాయం కోసం, రాజేంద్ర సింగ్ బలిదానం కోసం ఎదురుచూస్తోంది. నూటయాభై మంది సైనికులతో ఉడి చేరుకున్నాడు రాజేంద్ర సింగ్. అప్పటికే కోహాలా, డోమెల్ లు శత్రువు చేతికి చిక్కాయి. ఇక తరువాతి దాడి ఉడిపైనే. తన సేనలతో రాత్రికి రాత్రి బంకర్లు నిర్మింపచేశాడు రాజేంద్ర సింగ్. ఉడి వంతెనను ధ్వంసం చేయాలి. అలా చేస్తే శత్రువు కు నదిని దాటడం కష్టమౌతుంది. అయితే వంతెనను ధ్వంసం చేస్తే అటు వైపు నుంచి వచ్చే శరణార్థులకు ఇటువైపు రావడం కష్టమౌతుంది. అందుకని చివరి వరకూ ఆగి శత్రువు దగ్గరికి వచ్చిన తరువాత వంతెనను ధ్వంసం చేయాలని నిర్ణయించాడు రాజేంద్ర సింగ్. శత్రువు అయిదారు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు వంతెనను ధ్వసం చేయించాడు. దీనితో శత్రువు యాత్ర ఆగిపోయింది. శత్రువు భారీ ప్రాణనష్టం చవిచూసి వెనక్కి తగ్గాడు. సుమారు రెండు గంటల తర్వాత, శత్రువు మరొక భారీ దాడిని ప్రారంభించాడు. డిఫెన్సివ్ ఫోర్స్ మరొక డిఫెన్సివ్ పొజిషన్ కోసం మహురాకు తిరిగి వచ్చింది. బ్రిగేడియర్ మరియు అతని మనుషులు రాత్రి 10 గంటలకు మహురా చేరుకున్నారు.

అక్టోబరు 25న ఉదయం 7 గంటలకు శత్రువులు దాడిని పునఃప్రారంభించారు. రక్షణ చాలా ప్రభావవంతంగా ఉంది, శత్రువులు వెనుక నుండి రక్షణపై దాడి చేయడానికి ఫుట్‌బ్రిడ్జ్‌లపై జీలం ఎగువన దాటడానికి కొన్ని నిలువు వరుసలను పంపారు. ఈ ఎత్తుగడను పసిగట్టిన రాజిందర్ సింగ్, కెప్టెన్ జ్వాలా సింగ్‌ను పైకి వెళ్లి వంతెనలను పేల్చివేయమని కోరాడు. సాయంత్రం 4.30 గంటలకు పని పూర్తయింది. కానీ అప్పటికి కొన్ని శత్రు సేనలు ఇటువైపు దాటాయి. మళ్లీ బ్రిగేడియర్ పత్తర్ శిథిలాల దగ్గర రక్షణ కల్పించేందుకు రాంపూర్‌కు వెళ్లాడు. హడావిడిగా కందకాలు తవ్వబడ్డాయి మరియు నడుము లోతైన బంకర్లను తవ్వవలసి రావడంతో దళాలు రాత్రంతా విశ్రాంతి తీసుకోలేకపోయాయి.

అక్టోబర్ 26, 1947 తేదీ ఉదయం శత్రువుల కాల్పులు అన్ని వైపుల నుంచి ప్రారంభమయ్యాయి. రక్షణ, మరోసారి, చాలా ప్రభావవంతంగా ఉంది, రోజంతా శత్రువులు దాడి చేయలేరు. అప్పుడు వారు వ్యూహాత్మక తిరోగమనాన్ని కూడా అడ్డుకునేందుకు రోడ్‌బ్లాక్‌లు వేయాలని ప్లాన్ చేశారు. బ్రిగేడియర్, సంధ్యా సమయంలో, బారాముల్లాకు పశ్చిమాన ఉన్న మరో సెరి వంతెనను ఉపసంహరించుకోవాలని శత్రు తరలింపును ఆపడానికి ఆదేశించాడు. అక్టోబర్ 26న, మహారాజా హరి సింగ్ ఈ ప్రాంతం పాకిస్తాన్ దళాల నుండి ముట్టడిలో ఉన్నందున భారత యూనియన్‌లో చేరడానికి ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్‌పై సంతకం చేశారు.

అక్టోబర్ 27, 1947 తెల్లవారుజామున 1 గంటలకు కదిలాయి మరియు శత్రువుల కాల్పులు మళ్లీ అన్ని వైపుల నుండి ప్రారంభమయ్యాయి. మొదటి రోడ్‌బ్లాక్ ఎటువంటి నష్టం లేకుండా క్లియర్ చేయబడింది, కానీ దివాన్ మందిర్ (బునియార్) సమీపంలో రెండవది, ప్రముఖ డ్రైవర్ ఢీకొని చనిపోయాడు. కాన్వాయ్ ఆగింది. బ్లాక్ క్లియర్ చేయడానికి కెప్టెన్ జ్వాలా సింగ్ దిగినప్పుడు, మొదటి మూడు వాహనాల డ్రైవర్లు చనిపోయారని అతను కనుగొన్నాడు. అతను ఎలాగోలా ఈ మూడు వాహనాలను పక్కకు నెట్టాడు మరియు నాలుగు వాహనాలు ముందుకు వెళ్లేలా చేసాడు, కానీ బ్రిగేడియర్ వాటిలో లేడు మరియు కెప్టెన్ బారాముల్లాకు వెనక్కి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

వాస్తవానికి రెండవ రోడ్డు బ్లాక్ వద్ద బ్రిగేడియర్ల డ్రైవర్ చంపబడ్డాడు మరియు చిన్న కాన్వాయ్‌లో రెండవ నంబర్ ఉన్న తన వాహనం యొక్క స్టీరింగ్‌ను రాజిందర్ సింగ్ స్వయంగా నియంత్రించాడు. అలాంటి పరిస్థితిలోనూ తన సైనికులను బారాముల్లా వైపు వెళ్లి, అక్కడ మిగతా డోగ్రా సేనలతో కలిసి పోరాడమని ఆదేశించాడు. ఆయన సహచరుడు ఖజాన్ సింగ్ ఆయనను మోసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కానీ తనను మోసుకువెళ్తే సైనికులు వేగంగా వెళ్లలేరు. కాబట్టి తనను వదిలేసి వెళ్లమని ఆయన ఆదేశించాడు. తమ నేతను సైనికులు బునియార్ వద్ద ఒక కల్వర్ట్ వద్ద వదలి వెళ్లిపోయారు. రాజేంద్ర సింగ్ ను చూడటం అదే చివరి సారి.

ఒక సర్వ సేనాని సమరాంగణంలో స్వయంగా నాయకత్వం వహించి పోరాడటం అత్యంత అరుదు. రాజేంద్ర సింగ్ చేసిన నిరుపమాన త్యాగం వల్ల పాక్ ముష్కరులు శ్రీనగర్ చేరుకోలేకపోయారు. నాలుగు రోజుల పాటు వారిని ఆయన నిలువరించారు. 27 అక్టోబర్ నాడు భారత సేనలు శ్రీనగర్ విమానాశ్రయంలో దిగాయి. పాక్ సేనలను చావుదెబ్బ తీశాయి. రాజేంద్ర సింగ్ అసమాన త్యాగం వల్ల శ్రీనగర్ లోయను రక్షించడం సాధ్యమైంది. ఆయన పోరాటం భారత దేశ చిత్రపటంలో కశ్మీరును కలికితురాయి చేసింది. ఆయన సాహసోపేత పోరాటాన్ని జాతి కృతజ్ఞతతో మహావీర చక్ర ఇచ్చి గౌరవించుకుంది. దేశ చరిత్రలోని తొలి మహావీర చక్ర ఆయనకే దక్కింది.

జమ్మూ నడిబొడ్డున రాజేంద్ర సింగ్ విగ్రహం త్యాగం గాథలను మరచిపోవద్దని మరీమరీ చెబుతుంది. జమ్మూ ప్రజలు, బ్రిగేడియర్ సింగ్‌ను ‘అమర డోగ్రా’ మరియు ‘కాశ్మీర్ రక్షకుడు’ అని పిలుస్తారు. ఆయన పుట్టిన ఊరు బగూనా తన పేరును రాజేందర్ పురా గా మార్చుకుంది. ఆ గ్రామం నుండి భారతదేశ సైనిక దళాలలో ప్రతి ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు సభ్యులు సైనిక దళాలలో పనిచేస్తున్నారు.

బ్రిగేడియర్ రాజిందర్ సింగ్ 1899 జూన్ 14న సాంబా జిల్లాలోని బగూనా గ్రామంలో (ప్రస్తుతం రాజిందర్‌పురాగా పేరు మార్చారు) జన్మించారు. తండ్రి సుబేదార్ లఖా సింగ్, మాతృభూమికి సేవ చేశాడు. 1921లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ తర్వాత, అతను జూన్ 1921లో జమ్మూ, కాశ్మీర్ స్టేట్ ఫోర్స్‌లో నియమితుడయ్యాడు. మే 1942 లో బ్రిగేడియర్ అయ్యాడు, జమ్మూ బ్రిగేడ్, కాశ్మీర్ బ్రిగేడ్‌కు నాయకత్వం వహించాడు. భార్య రామ్ దేయ్ మరియు 5 మంది కుమార్తెలు ఉషా పర్మార్, ఊర్వశి రాణి పఠానియా, బిమ్లా పఠానియా, రంభా ఠాకూర్ మరియు డాక్టర్ క్రిరా జమ్వాల్ ఉన్నారు. ఓ వీరుడి త్యాగం ద్వారా ఈ రోజు భారత్ లో కాశ్మీర్ అంతర్భాగంగా మిగిలివుంది. జై జవాన్ జై హింద్.

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top