Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

భారత దేశంపై విషాన్ని చిమ్మే కౄరమైన సాహిత్య ప్రచారం, ఎవరీ ప్రచారం చేస్తున్నారు? - Samala Kiran - megaminds

భారత్& హిందుత్వ నాశనానికి వాడుతున్న పాశ్చాత్య ఆయుధం- క్రూరత్వ సాహిత్యం:  1927 లో విడుదలయిన కేథరిన్ మాయో రచన “మదర్ ఇండియా”, బ...

భారత్& హిందుత్వ నాశనానికి వాడుతున్న పాశ్చాత్య ఆయుధం- క్రూరత్వ సాహిత్యం: 1927 లో విడుదలయిన కేథరిన్ మాయో రచన “మదర్ ఇండియా”, బహుశా భారత దేశానికి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా రచించబడ్డ మొదటి క్రూరత్వ సాహిత్యం. ఈ పుస్తకం లో మాయో హిందువులని ఒక అనాగరిక, క్రూర జాతిగా చిత్రీకరించింది. అక్కడక్కడ జరిగిన కొన్ని సంఘటనలని ఎంచుకొని హిందూ పురుషులని, స్త్రీలని పిల్లలని హింసించే వారిగా చిత్రీకరించింది. హిందూ సమాజం అనాగరికమైనదని, వారికి బ్రిటీష్ వారు నాగరికత నేర్పుతున్నారు అని ప్రపంచాన్ని మోసం చెయ్యడం ఈ పుస్తక లక్ష్యం. ఈరోజుకి కూడా భారత దేశానికి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా క్రూరత్వ సాహిత్యం సృష్టించబడుతూనే ఉంది.

“క్రూరత్వ సాహిత్యం” అంటే ఏమిటి?: స్థానిక నాగరికతలని, సంస్కృతులని అణచివేసి, స్వాధీన పరచుకొని, జీర్ణీకరించుకొని చివరికి నాశనం చెయ్యడానికి పాశ్చాత్యులు వందల సంవత్సరాలుగా వాడుతున్న ఒక మానసిక ఆయుధమే ఈ క్రూరత్వ సాహిత్యం. దీనికి మీడియారంగం తోడైతే దీని ప్రభావం అత్యధిక స్థాయిలో, కొన్ని సార్లు శాశ్వతంగా ఉంటుంది. ఎవరైతే తమ నాగరికతని, సంస్కృతిని నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారో వారినే నాశనం అవుతున్న వారు తమని రక్షిస్తున్న వారిగా భావించడం ఇందులో అత్యంత ప్రమాదకరమైన విషయం. పాశ్చాత్యులు ఇప్పటికే దీనిని స్థానిక అమెరికన్లకి, నల్ల జాతి వారికి, మనకి, ఇంకా ఎన్నో జాతులకి వ్యతిరేకంగా ఉపయోగించారు, ఉపయోగిస్తున్నారు. క్రీస్టియన్ మిషనరీలు, చర్చి, NGOలు, పాశ్చాత్య/భారత విద్యా సంస్థలు, మనవ/జంతు సంబంధ రక్షణ సంస్థలు మనకి వ్యతిరేకం గా ఈ క్రూరత్వ సాహిత్యాన్ని వాడుతున్నాయి.

“తాము ముందుగా ఒక నాగరికతని లక్ష్యంగా ఎన్నుకొని, అలా ఎంచుకున్న నాగరికత/సంస్కృతి తమ ప్రజలపైనే హింస సాగిస్తోందని, కాబట్టి వారిని రక్షించడానికి పాశ్చాత్య జోక్యం తప్పనిసరి అని ప్రపంచాన్ని నమ్మించే లక్ష్యంతో సృష్టించబడే సాహిత్యమే ఈ క్రూరత్వ సాహిత్యం” అని శ్రీ రాజీవ్ మల్హోత్రా దీని గురించి తన “బ్రేకింగ్ ఇండియా” పుస్తకంలో రాశారు. ప్రతీ సమాజం, నాగరికత, వ్యవస్థ, మతం, కులం, సంఘం, దేశం, ఇలా అన్నిట్లో ఎంతో కొంత చెడు ఉండి తీరుతుంది, అనే నిజం మీదే ఈ వ్యూహమంతా ఆధారపడి ఉంటుంది. వివాహ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థల లాంటి వాటికి కూడా ఇది వర్తిస్తుంది. ప్రతీ వ్యవస్థ వల్లా నష్ట పోయే వాళ్ళు కొందరైనా ఉంటారు కదా.

ఒక చిన్న ఉదాహరణ ద్వారా దీనిని వివరించే ప్రయత్నం చేస్తాను. కోటి మంది జనాభా ఉన్న ఒక పట్టణం ఉందనుకోండి. కోటి మంది జనాభా ఉన్న పట్టణంలో సహజంగానే అన్ని వృతుల వారు, మతాల వారు, కులాల వారు, పొడుగు వారు, పొట్టి వారు, నల్ల వారు, తెల్ల వారు, దొంగలు, హంతకులు, ఇలా అందరూ ఉంటారు. అది రామ రాజ్యం అయితే తప్ప అక్కడ హత్యలు, మానభంగాలు, దోపిడీలు, కొట్లాటలు ఇలా అన్ని రకాల నేరాలు జరుగుతూనే ఉంటాయి. అక్కడ గత 5 సంవత్సరాలలో 100 హత్యలు జరిగాయి అనుకుందాం. ఆ పట్టణంలో లో ఉన్న పొడుగు వారిని నాశనం చెయ్యడం కనుక లక్ష్యం అయితే వారికి వ్యతిరేకంగా క్రూరత్వ సాహిత్య సృష్టి జరుతుగుతుంది. 100 హత్యలలో కొన్నైనా పొడుగువాడు పొట్టి వాడిని చంపినవి ఉంటాయి. మీడియా ఆ హత్యల మీదే దృష్టి పెడుతుంది. “పొడుగు వాడి చేతిలో బలైపోయిన మరో పోట్టివాడు” లాంటి శీర్షికలు ఇటువంటి హత్య జరిగిన ప్రతీ సారీ మీడియాలో విపరీతంగా కనిపిస్తాయి. కొంత కాలానికి న్యాయ వ్యవస్థ ఆ హత్యలకి పొడుగుకి ఏ సంబంధం లేదు అని తేల్చవచ్చు, కానీ దానికి మీడియా రంగం ప్రాధాన్యత ఇవ్వరు, అందువల్ల ప్రజలకి ఆ విషయం తెలియదు. ఇలా కొంత కాలం జరిగేసరికి “పొట్టి వారిని చంపేస్తున్న పోడుగువారు” అనే వృత్తాంతం ప్రజలలో బలంగా నాటుకుపోతుంది. ఇలా క్రూరత్వ సాహిత్యాన్ని మాధ్యమ రంగ సహాయంతో ఉపయోగించి ఏ వర్గాన్నైనా, ఏ వర్గానికైనా వ్యతిరేకం అని ప్రజలని నమ్మించవచ్చు. విషయాన్ని బాగా లోతుగా, సమాచారాన్నంతా ఉపయోగించి విశ్లేషిస్తేనేకానీ అసలు విషయం తెలియదు. దీని ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందంటే చివరికి పొడుగు వారు కూడా దీనిని నమ్మేస్తారు, నమ్మడమే కాకుండా ఈ సాహిత్యాన్ని సృష్టిస్తున్న వారి దగ్గరికే సహాయం కోసం కొందరు వెళ్ళినా ఆశ్చర్యం లేదు. ఇలా క్రూరులుగా చిత్రీకరించబడ్డ పోడుగువారిని, పోట్టివారిని కాపాడటం అనే నెపంతో నాశనం చేసేస్తారు. ఈ ఉదాహరణలో పొడుగు వారి స్తానంలో హిందూ ధర్మాన్ని పొట్టి వారి స్థానంలో ఇతర మతాలని పెట్టి చూస్తే మనపై జరుగుతున్న కుట్ర మీకే అర్ధమవుతుంది.
ముందుగా నిర్ధారించుకున్న వృత్తాంతానికి సంబంధించిన వార్తలకి మాత్రమే విశేష ప్రచారం ఇవ్వడం, కొన్ని సందర్భాలలో వార్తలని ఈ వృత్తాంతానికి తగ్గట్టుగా మార్చి ప్రచారం చెయ్యడమే ఈ వ్యూహం.

క్రూరత్వ సాహిత్యం గురించి అర్ధమైతేనే కానీ మన దేశంపై, ధర్మంపై, సంస్కృతిపై జరుగుతున్న వివిధ దాడులని అర్దం చేసుకోలేము
-దీపావళి నాడు బాంబులు పేలిస్తే కాలుష్యం.
-హోలీ ఆడితే నీరు వృధా
-వినాయక చవితి వలన నీటి కాలుష్యం
-పుట్టలో పాలు పొయ్యడం మూఢనమ్మకం
-కోడి పందాల వల్ల కోళ్ళకి, ఎడ్ల పందాల వల్ల ఎడ్లకి ఇబ్బంది
-జల్లికట్టులో జంతు హింస

ఇలా చెప్తూ పోతే ఇంకా బోలెడు. ఇది ఇలానే కొనసాగితే, హిందువులు గాలి పీల్చడం వలన వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోతోంది కాబట్టి హిందువులు గాలి పీల్చకూడదు అని కూడా అంటారు. పైన నేను ఉదాహరించిన వాటిలో కొంత నిజం లేకపోలేదు. అయితే వీటిని వ్యతిరేకించే సంస్థలకి కానీ, మనుష్యులకి కానీ జంతువులపై కానీ, పర్యావరణంపై కానీ ప్రేమ లేదు. వారి లక్ష్యం మనల్ని మన సంస్కృతి నుండి దూరం చెయ్యడం. అలా దూరమైన వారిని మతం మార్చడం సులభం. దీపావళి వల్ల వాయు కాలుష్యం, జల్లికట్టులో జంతు హింస నిజమే. కొన్ని వేల ఎడ్లు పాల్గొనే సంబరంలో అక్కడక్కడా ఎడ్లని ఇబ్బంది కలిగించే సంఘటనలు జరగడం సహజం. అయితే దీనికి పరిష్కారం నియంత్రణ. నియమ నిబంధనలు ఏర్పరిచి వాటిని సరిగా అమలు చెయ్యడం. అంతే కానీ నిషేధం కాదు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అని ప్రయాణాలని నిషేధించరు కద.

ఇటువంటి క్రూరత్వ సాహిత్యం ప్రచారం పట్ల భారతీయులు, హిందువులు జాగ్రతగా ఉండటం అలవర్చుకోవాలి. అసలు విషయాల్ని అర్ధం చేసుకోవాలి. క్రూరత్వ సాహిత్య హిందుత్వ పై జరిగే దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యతిరేకించడం చాలా అవసరం. సేకరణ సామల కిరణ్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments