Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఘనమైన చరిత్రకు నిదర్శనం గిరిజనుల పోరాటాలు - tribal freedom fighters of india

మన స్వతంత్ర సమరాన్ని గురించి మట్లా డుకుంటున్నప్పుడు కొందరిని గురించి మాత్రమే ప్రస్తావిస్తాము. వాస్తవానికి కొన్ని సందర్భాల్లో ఇది అ వసరాన...

మన స్వతంత్ర సమరాన్ని గురించి మట్లాడుకుంటున్నప్పుడు కొందరిని గురించి మాత్రమే ప్రస్తావిస్తాము. వాస్తవానికి కొన్ని సందర్భాల్లో ఇది వసరానికన్నా ఎక్కువనే చెప్పవచ్చు. కానీ, మన స్వాతంత్రం సమరం లో అడవులలో మన గిరిజన వీరులు పోషించిన పాత్ర అనుపమానం. వారు నివసించింది అడవులలో కానీ దేశానికి చేసిన సేవ మాత్రం మాటలతో నిర్వచించలేనిది. 1857 నుంచి మనకు స్వాతంత్ర్యం సిద్ధించే దాకా వారి వారి ప్రాణాల్ని త్యాగం చెయ్యని గిరిజన తెగ ఒక్కటంటే ఒకటి కూడా లేదు. స్వతంత్ర మంటే ఏమిటి ? బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాట మంటే ఏమిటి ? వంటి విషయాలనన్నింటి నీ మాటలతో కాకుండా తమ త్యాగాల ద్వారా వారు అవేమిటో మనకు నేర్పారు. కానీ, మన రాబోయే తరాలకు ఈ చరిత్ర పూర్తిగా తెలిసి అవకాశం లేదు. అందుకే ఈ గిరిజనులు ఎక్కడ నివసించారు, ఏయే రాష్ట్రాలలో బ్రిటిష్ పాలకులతో సంఘర్షించారో, తలవంచడానికి నిర్ద్వంద్వంగా ఎందుకు నిరాకరించారు ఏ గిరిజన ఉద్యమాలు జరిగాయో తెలుసుకుందాం రండి!!
రంపా తిరుగుబాటు (తెలుగురాష్ట్రాల్లో)
1766 లో నిజాం రాజు రంపా ప్రాంతాన్ని తూర్పు ఇండియా కంపెనీ ఇచ్చాడు. కంపెనీ అధికారుల మితిమీరిన జోక్యానికి వ్యతిరేకంగా 1802-03లో రామభూపతి నాయకత్వంలో కోయలు, కొండరెడ్లు తదితర గిరిజన తెగలు పోరాటం సాగించాయి. 1813లో బ్రిటిషర్ల రామభూపతిని ఈ ప్రాంతానికి అధిపతిగా అంగీకరించడం తో పోరాటాన్ని నిలిపేశారు. కానీ, ఆ తర్వాత రామ భూపతి కుమారుడు బ్రిటీష్ అధికారుల ప్రోద్బలంతో గిరిజనులపై అనేక రకాల పన్నులు విధించడంతో వారు తమ్మన్నదొర నాయకత్వంలో 1879లో మళ్లీ తిరుగుబాటు చేశారు. ఇది విశాఖ, భద్రాచలం, రేకపల్లి, చోడవరం మొదలైన ప్రాంతాలకు విస్తరించింది. 1880లో సైనిక బలం తో ఈ తిరుగుబాటు బలవంతంగా అణచివేశారు. అయినప్పటికీ వీరోచితంగా బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఈ తిరుగుబాటు చరిత్రలో నిలిచిపోయింది.

ఖోందులతిరుగుబాటు(ఒడిశా)
ఖోందులు ఒరిస్సా లో నివసించే గిరిజనులు. మొదటిసారిగా 1817 లో తిరుగుబాటు లేవదీశారు. తర్వాత 1830లో చినోయి దొర, 1850 లో చక్ర బోయి దొర, 1857లో సురేంద్ర సాయి నాయకత్వంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. 1894 లో. కొండసవరలు విదేశీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాట్లన్నింటినీ బ్రిటీష్ వారు తమ సైనిక బలం తో అణచివేశారు.
కోల్ తిరుగుబాటు
చోటా నాగపూర్ ప్రాంతంలో కోల్ గిరిజన తెగకు చెందిన వారు నివసించే వారు. బ్రిటిష్ పాలకులు గిరిజనేతర రైతులను గిరిజన ప్రాంతాల్లో స్థిరపడేలా ప్రోత్సహించడం తో భూ యజమానుల తో కౌలు సంబంధాలు మొదల య్యాయి. దీంతో ద్రవ్య విధానం కూడా ప్రారంభమైంది. వడ్డీ వ్యాపారుల దోపిడీలు మొదలయ్యాయి. కోల్ గిరిజనుల్లో అశాంతి అధికమైంది. గిరిజనులు వారి భూములు వారి కట్టు బానిసలుగా మారారు. ప్రభుత్వ, గృహఅవసరాల్లోనూ శ్రమ దోపిడీ ఎక్కువైంది. వీటికి నిరసనగా కోల్లు 1831-32 లో తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటును బ్రిటిష్ ప్రభుత్వం అణిచి వేసింది.
సంతాల్ తిరుగుబాటు

ఈ తిరుగుబాటు బిహార్డ్, బెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో సంభవించింది. దీన్ని గొప్ప తిరుగుబాటు గా పేర్కొంటారు. దీనికి ప్రముఖ కారణం కారన్ వాలిస్ ప్రవేశపెట్టిన శాశ్వత శిస్తు విధానం. దీనికి వ్యతిరేకంగా సంతాల్లు 1811, 1823, 1829 లో తిరుగుబాటు చేశారు. 1854లో కనూ, సిద్ధూ అనే గిరిజన సోదరుల నాయకత్వంలో ఈ తిరుగుబాటు మరోసారి చెలరేగింది. వీరు జమీందార్ల భూముల ఆక్రమణ కు ప్రయత్నించారు 1855 జూన్ లో ఈ సోదరులు నాయకత్వంలో సంతాల్ల కోసం ప్రత్యేక రాజ్యం ఏర్పాటుకు ర్యాలీ నిర్వహించారు. ఈ పోరాటంలో 15,000 నుంచి 25,000 సంతాల్ బ్రిటిష్ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయారు. 1856 ఫిబ్రవరిలో కనుహ కూడా సైన్యం చేతిలో మరణించాడు. 1885 జూలైలో బ్రిటిష్ ప్రభుత్వం మార్షల్ లా విధించిన ఉద్యమాన్నిబలవంతంగా అణచివేసింది. అక్కడి గిరిజనులు ఈ పోరాటం గురించి ఇప్పటికీ అనేక పాటలుగా మలిచి వర్ణించి పాడుకుంటారు.
బస్తర్ తిరుగుబాటు (ఛత్తీస్గఢ్)
బస్తర్ ప్రాంతంలో మురియు, మరియ, హాలా మొదలైన గోండు తెగల జీవించువారు. బ్రిటిషర్ల రాకతో బనియాలు, రోహిల్లాలు మొదలైన వడ్డీ వ్యాపారులు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరు గోండుల భూములు ఆక్రమించుకోవడం, వెట్టి చాకిరీ చేయించడం, స్త్రీలను వేధించడం మొదలైన అకృత్యాలు ఒడిగట్టారు. ఈ బాధలకు ఓర్చుకోలేక గిరిజనులు వారి పై 1880 వ సంవత్సరంలో తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటులో ఎంతో మంది గిరిజన వీరులు తమ ప్రాణాలు త్యజించారు. బ్రిటిష్ ప్రభుత్వం 1891 నాటికి ఈ తిరుగుబాటును అణచివేసింది. ఇప్పటికీ ఛత్తీస్ఘడ్ ప్రాంతంలో ఈ తిరుగుబాటు గురించి వనంగా చెప్పుకుంటారు.
ముండా తిరుగుబాటు (బీహార్)
చోటా నాగపూర్ ప్రాంతం లో నివసించే మరో గిరిజన తెగ ముండాలు, తెగ లో అంతర్యుద్ధం కారణంగా వీరి భూమిలో కొంత భాగం సమీప హిందూ రాజుల పాలనలో వెళ్ళింది. ఆ సమయంలోనే క్రైస్తవ మిషనరీల ప్రచారంతో ఆమతాన్ని స్వీకరిస్తే తమ పరిస్థితి మెరుగవుతుందనీ భావించి ముండాలు అధిక సంఖ్య లో మతమార్పిడి చేసుకున్నారు. దీంతో క్రమంగా అధిక సంఖ్యలో గిరిజనేతరులు స్థిరపడడంతో వీళ్ల పరిస్థితి దిగజారింది. అయినా ఎలాంటి మార్పు రాలేదు. చివరకు 1895 లో బిర్సా ముండా నాయకత్వం లో తమ ప్రాంతాల్లో స్థిరపడ్డ గిరిజనేతరులందరినీ తరిమివేయాలి తిరుగుబాటు ప్రారంభించారు. బిర్సా ముండా ను 1895లో నిర్బంధించగా తెగ ప్రజలు విడిపించుకున్నారు. 1899 నాటికి తిరుగుబాటు తీవ్ర స్థాయికి చేరింది. 1900లో బిరా ముండాను మళ్లీ నిర్బంధించారు. కారాగారంలో హింసించడం తో ఇతను మరణించాడు. దీంతో క్రమంగా ఈ ఉద్యమం బలహీనమైంది.
వర్లీ తిరుగుబాటు (1944) (మహారాష్ట్ర)
మహారాష్ట్రలోని థానే జిల్లా వర్లీ ఆదిమ తెగలు నివసించేవి, పంటకోతల సమయంలో కూలీ రోజుకు 12 అణాలు ఇవ్వాలని డిమాండ్ తో ఈ తిరుగుబాటు మొదలైంది. 1945 లో కిసాన్ సభ ఇచ్చిన పిలుపు భూస్వాముల భూములు దున్నవద్దని, వెట్టి చాకిరీ చేయొద్దని, అత్యాచారాలను ప్రతి పాటించాలని లక్ష్యాలతో వీరు తిరుగుబాటును కొనసాగించారు. 1946 లో వర్లీ మహాసభ జరిగింది. చివరకు వ్యాపారులు, భూస్వాములు రాజీకి వచ్చారు. వర్లీ గిరిజనులు డిమాండ్ చేసిన దాని కంటే ఎక్కువ కూలీ సాధించుకున్నారు. ఈ తిరుగుబాటు ఘన విజయం సాధించింది.

మన్యం తిరుగుబాటు (ఆంధ్ర,1922-24)
మద్రాసు రెసిడెన్సీ ఆంధ్ర ఏజెన్సీ ప్రాంతం 19,287 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉండేది. ఇందులో గంజాం, విశాఖపట్నం, గోదావరి ప్రాంతం ఉండేవి. బ్రిటీష్ ప్రభుత్వం 1882 లో మద్రాస్ అటవీ చట్టం చేసి పోడు వ్యవసాయం పై అనేక ఆంక్షలు విధించింది. ఇక్కడ గిరిజన తెగలు కోయలు, కొండరెడ్లు అధిక సంఖ్యలో ఉండే వారు. బ్రిటిష్ అధికారులు సహాయంతో స్థానిక నేతలు దుశ్చర్యలకు పాల్పడ్డారు. దీంతో విసిగిపోయిన గిరిజనులను అల్లూరి సీతారామరాజు సమైక్యపరచి తిరుగుబాటు లేవదీశారు. గెరిల్లా పోరాట పద్ధతి లో ఈ తిరుగుబాటు సాగింది. పోలీస్ స్టేషన్ పై దాడి చేసి ఆయుధాలను సేకరించేవారు. సీతారామరాజు అనుచరులతో మొదట చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. తర్వాత అడ్డతీగల, రాజ ఒమ్మంగి, కృష్ణదేవిపేట మొదలైన పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. ఈ తిరుగు బాటును అణిచివేసేందుకు మద్రాసు ప్రభుత్వ రూథర్ ఫర్డ్ ను పంపించింది. సీతారామరాజు ముఖ్య అనుచరుడైన మల్లు దొర ని 1923 సెప్టెంబర్ లో నిర్బంధించారు. మరో అనుచరుడు అగ్గిరాజు కాల్చిచంపారు. దీంతో ఈ ఉద్యమం ముఖ్య నాయకులు కోల్పోయింది. చివరకు 1924 మే 7న సీతారామరాజు కాల్చి చంపడంతో ఈ ఉద్యమం నిలిచి పోయింది.
గోండులు తిరుగుబాటు (తెలంగాణ)
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం నాయకత్వంలో ఈ తిరుగుబాటు జరిగింది. ఈయన 1901 అక్టోబర్ 22న ఆదిలాబాద్ జిల్లాలో 'జోడేఘాట్' ప్రాంతంలో జన్మించారు. నిరక్షరాస్యుడైనప్పటికీ ఆ ప్రాంతం లో గోండు, కాలం మొదలైన గిరిజన తెగలు ఏకం చేసి నిజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిపారు. జోడేఘాట్ పై దాడికి ప్రయత్నించిన నిజాం సైన్యాన్ని సంప్రదాయ ఆయుధాలతో ఎదుర్కొన్నారు. జల్, జంగల్, జమీన్ (నీరు, అటవీ, భూమి) మనవే అనే నినాదంతో గిరిజనులను చైతన్యపరిచారు. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు ప్రభావంతో ఈ ఉద్యమాన్ని నడిపించారు. నిజాం ప్రభుత్వం ఈయనను బంధించడానికి స్థానిక తాలుక్దార్ అబ్దుల్ సత్తార్ ను నియమించింది. ఆయన విఫలం చెందడంతో నిజాం సైన్యం ప్రత్యక్ష దాడికి దిగింది. 1940 అక్టోబర్ 8న జరిగిన దాడిలో కొమరం భీం వీర మరణం పొందారు. ఈయనను సైన్యానికి కుర్థం పటేల్ చూపించాడు. కొమరం భీం ను నిజాం పాలకుల నుంచి తెలంగాణ ప్రజల స్వాతంత్ర్యానికి ప్రయత్నించిన మొదటి వ్యక్తిగా అభివర్ణిస్తారు. గోండులు ఈయనను దేవుడిగా ఆరాధిస్తారు. -లతా కమలం

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia


No comments