లలితాదిత్యుడు : క్రీ.శ. 8వ శతాబ్దం నాటివాడు. చైనా వైపు నుండి వచ్చిన దాడులను త్రిప్పికొట్టిన కాశ్మీర ప్రాంతపు చక్రవర్తి, కాశ్మీరును పరిపాలించిన రాజులలో ప్రతాపాదిత్య మహారాజు ఒకరు. వారి మూడవ కుమారుడే లలితాదిత్య మహారాజు, అతడు గొప్ప యోధుడు. విజయశీలుడు కూడా. ప్రఖ్యాత చారిత్రక కవి కలణుడు వ్రాసిన రాజతరంగిణి కావ్యంలో లలితాదిత్యుని పౌరుష పరాక్రమాలు, గొప్పదనము,కీర్తిప్రతిష్టల గురించి వర్ణించాడు.
విశ్వమును గెలవాలి అనే ఆకాంక్ష కలిగిన లలితాదిత్యుని రాజ్యపరిపాలనా కాలమంతా విజయగాథలతో నిండి ఉంది. ఆయన అరబ్బు,టర్కి తాతార్ మొదలగు ముస్లిం దురాక్రమణదారులను కేవలం ఓడించడమే కాకుండా వారి వెంటబడి చాలాదూరం తరిమికొట్టాడు. రాబోయే మూడు శతాబ్దాల పాటు కన్నెత్తి చూడటానికి కూడా వీలులేకుండా ఉండేలా శత్రువులను అణచివేశాడు.
లలితాదిత్యుడు పంజాబు, కనోజ్, టిబెట్లు మొదలగు రాజ్యములను తన రాజ్యంలో విలీనంకున్నాడు. గెలిచిన రాజులు రాజ్యాల చాలా ఉదారంగా వ్యవహరించేవాడు, లలితాదిత్యుడు తన రాజ్యంలో అధిక సంఖ్యలో వైష్ణవ ఆలయాలను, బౌద్దమందిరాలను నిర్మించి ప్రజారంజకంగా పరిపాలించాడు.
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:
ప్రతులకు : సాహిత్యనికేతన్
కేశవ నిలయం, బర్కత్పురా,
హైదరాబాద్ – 500 027
ఫోన్ : 040-27563236
సాహిత్యనికేతన్, ఏలూరు రోడ్,
గవర్నర్పేట, విజయవాడ – 500 020
సెల్ : 9440643348
ప్రతులకు : సాహిత్యనికేతన్
కేశవ నిలయం, బర్కత్పురా,
హైదరాబాద్ – 500 027
ఫోన్ : 040-27563236
సాహిత్యనికేతన్, ఏలూరు రోడ్,
గవర్నర్పేట, విజయవాడ – 500 020
సెల్ : 9440643348
0 Comments
Thank You