ఆయుర్వేదంలో ఆమ్ల పిత్తమని అంటారు. గుండెల్లో మంటగా ఉండడం, ఆహారం తినకపోతే మంటగా అనిపించడం, తిన్న తరువాత కడుపులో నొప్పి రావడం, వంటివన్నీ అల్సర్ లక్షణాలు. ఈ సమస్యలన్నిటికీ కేవలం సింపుల్ చిట్కాలతో మనం ఉపశమనం పొందవచ్చు.
ఆ చిట్కాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం:
1. శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, జీలకర్ర, ఉసిరికాయ, తెలుపు సైంధవ లవణం పొడి చేసి భోజనం చేశాక మజ్జిగతో తీసుకోవాలి. దీంతో కడుపు నొప్పి తగ్గుతుంది. మిరియాలను తక్కువగా, మిగిలిన పదార్థాలను సమాన భాగాల్లో తీసుకోవాలి.
2. ఒక గ్లాస్ వెన్న తీసిన మజ్జిగలో ఇనుప గరిట వేడి చేసి ముంచి అందులో ఒక టీస్పూన్ చక్కెర, కొద్దిగా జీలకర్ర, అల్లం కలిపి తాగితే కడుపులో మంట తగ్గుతుంది. ఉదయాన్నే పరగడుపునే ఈ మిశ్రమాన్ని తాగాలి.
3.సైంధవ లవణం, వెల్లుల్లి రసం, ఇంగువలను బాగా కలిపి కొద్ది మోతాదులో తీసుకోవాలి. కడుపు నొప్పి, మంట తగ్గుతాయి.
4. మారేడు గుజ్జు, బెల్లంలను సమానంగా కలిపి చిన్న ఉసిరికాయంత మాత్రలా చేసుకుని మజ్జిగతో తీసుకోవాలి. కడుపునొప్పి తగ్గుతుంది.
5. గంజి నీటిని అర గ్లాసు మోతాదులో తీసుకుని అందులో రెండు టీస్పూన్ల నెయ్యి వేసి కలిపి తాగాలి. కడుపులో ఉండే పుండ్లు తగ్గుతాయి.
6. వాల్ నట్స్, దానిమ్మ పండ్లు, వెలగ పండ్లను తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు.
గమనిక:
కారం వస్తువులు, మసాలాలు, జున్ను, మినపపప్పు, పెరుగు, పుల్లని వస్తువులు కొంత కాలం మానేయాలి.
మజ్జిగ, వేయించి వండిన మెత్తని అన్నం, పెసరకట్టు, దానిమ్మ రసం, బెల్లం, పాలు మేలు చేస్తాయి.


