Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

హిందూ సమాజంలో ఉన్న అభూత కల్పనలు

హిందూ సమాజంలో ఉన్న అభూత కల్పనలు:  మనదేశంలో ఒకవైపున నెమ్మదిగా కమ్యూనిజం వాస్తవిక రూపం దాల్చితూ ఉంది. మరొకవైపు మన దేశ రాజకీయ నాయకుల ద్వారా నిర...

socialism


హిందూ సమాజంలో ఉన్న అభూత కల్పనలు: మనదేశంలో ఒకవైపున నెమ్మదిగా కమ్యూనిజం వాస్తవిక రూపం దాల్చితూ ఉంది. మరొకవైపు మన దేశ రాజకీయ నాయకుల ద్వారా నిర్మితమైన రాజ్యాంగంలో భారతదేశం సామ్యవాద దేశమని ప్రకటించడం జరిగింది. అంటే దీనిలో కమ్యూనిజానికి సంబంధించిన అన్ని విషయాలు జోడింపబడ్డాయి కానీ దాన్ని సాధించే మార్గాల్లో చాలా వ్యత్యాసం ఉన్నది. మన రాజకీయ నాయకులు రష్యా చైనా మాదిరిగా దౌర్జన్యంతో ఆయుధాలతో కాకుండా ఓటు ద్వారా సామ్యవాదాన్ని సాధించాలంటారు.

దీనిలో అంతర్యం ఏమిటంటే చైనా రష్యాలో సమాజానికి మరియు మన సమాజానికి తేడా ఉన్నది. రష్యా, చైనాలోని ప్రజలు క్రియాశీలంగా జాగృతంగా ఉంటారు కాబట్టి వారిని అణిచివేయడానికి ఆయుధాలు సైన్యము అవసరము. కానీ మన భారత సమాజంలోని ప్రజలు వినమ్ర వీర పూజకులు. ఒకవేళ సైన్యం వచ్చి “ప్రియ మిత్రమా!, తలవంచు, నేను నీ శిరస్సును ఖండిస్తాను” అనగానే వెంటనే మనవాళ్లు ముందుకు వచ్చి తలవంచడమే కాకుండా తన శిరస్సును వారికి అర్పించేంతటి మహానుభావులు. ఇంతటి విధేయులైన ప్రజలను ఆయుధాలతో బెదిరించాల్సిన అవసరం ఏముంటుంది? ఓటుతో మభ్య పెడితే సరిపోతుంది. మన నాయకులు వచ్చి సామ్యవాద స్థాపన కోసం అందరూ పెద్ద ఎత్తున ఓటు వేయండి, అంటే అందరూ వేసేస్తారు. సామ్యవాద పక్షంలో ఉన్నసదరు నాయకుడు గెలిచిన తరువాత ప్రజల సమస్యలను విస్మరించి వారిని నిర్జీవమైన యంత్రంలా పరిగణిస్తే ఇదంతా మన కర్మ! మనకు ఇంతే ప్రాప్తం అని ప్రజలు సరిపెట్టుకుంటారు.

1000 సంవత్సరాల ముస్లిం, ఆంగ్లేయుల పాలన ఫలితంగా ఈరోజు కూడా కొంతమంది, ముస్లింలు చాలా గొప్పవారు అని మహాత్ములని అంటూ ఉంటారు. ఆ స్థాయిలో వారిలో భయం భక్తి ఉన్నాయి. మన హిందూ రాజుని కారాగారంలో బంధించి రాజ్యాన్ని ఆక్రమించిన హైదర్ అలి, అనేకమంది హిందువులను ముస్లింలుగా మార్చి మన స్త్రీలపై అత్యాచారాలు చేసిన అతని కుమారుడు టిప్పుసుల్తాన్ విగ్రహాలు పెట్టాలని కొంతమంది అంటున్నారు. ఈ స్థాయిలో వారు మనల్ని భ్రమింప చేశారు. 200 సంవత్సరాల క్రితం ఆంగ్లేయులు వచ్చినప్పుడు వారిని స్వర్గం నుంచి  భగవంతుడు పంపించారు అని కొంతమంది అన్నారు. ఇంకొంతమంది మేధావులు కొంచెం ముందుకు వెళ్లి మన భవిష్య పురాణంలో చెప్పినట్టుగా భవిష్యత్తులో మన దేశాన్ని వికటేశ్వరి అనే పేరు గల మహారాణి శాసిస్తుందని ఉన్నది. అది ఎవరో కాదు విక్టోరియా మహారాణే అన్నారు. ఇటువంటి అమాయక ప్రజలకు కేవలం కాస్త ప్రచారం చేస్తే ఎంతటి అవాస్తవాన్నయినా నిజం లాగా భ్రమింప చేయవచ్చు.

( గతమును తిరగేసి, భ్రమలను తుడిచేసి
జయకేతనమెగరేయగ భవితవ్యం మనదే ఇక.)

No comments