బలుచిస్తాన్ ప్రజలు మన మరాఠాలా?

megaminds
0
బలుచిస్తాన్ ప్రజలు మన మరాఠాలా?: పాకిస్తాన్ లోని అరేబియా మహాసముద్రానికి ఆనుకుని ఉన్న భూభాగం అలాగే భారత్ కి కూడ అతి సమీపాన గల భూభాగమైన బలూచిస్తాన్ లో నివసించే అత్యధిక బలూచ్ ప్రజలు నిజంగా మరాఠాలే ఎలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మూడవ పానిపట్ యుద్ధం 1760 జనవరి లో మరాఠాలు మరియు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన అహ్మద్ షా అబ్దాలీల మధ్య జరిగింది. మొఘల్ చక్రవర్తి మరాఠాల ఆధిపత్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి అతని సహాయం కోరాడు. పేష్వాలు మొఘల్ సామ్రాజ్యాన్ని నిర్మూలించడానికి, పానిపట్‌కు వెళ్ళి వారి శక్తిని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, మరాఠాలు వారి చరిత్రలో అత్యంత అవమానకరమైన ఓటమిని చవిచూడవలసి వచ్చింది. అంత నష్టంలో కూడా, ఆఫ్ఘన్ సైన్యానికి తీవ్ర నష్టం కలిగించారు. అబ్దాలీ మళ్లీ భారతదేశంలో అడుగు పెట్టలేదు.

యుద్ధంలో పోరాడిన పీష్వా సైన్యంలోని దాదాపు 500 మంది సైనికులు ప్రాణాలతో బయటపడి హర్యానా అడవుల్లో చెల్లాచెదురయ్యారు. వారు నేడు రాడ్ (లేదా రోర్) మరాఠాలు అని పిలువబడుతున్నారు. 7 లక్షల నుండి 10 లక్షల మధ్య జనాభాతో, కర్నాల్, రోహ్‌తక్, భివానీ మొదలైన ప్రాంతాల్లో విస్తరించి ఉన్న బలమైన స్థానిక సంఘం. టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్ననీరజ్ చోప్రా ఆ వర్గానికి సంబంధించినవాడే.

అలా పారిపోయిన 500 మంది కాకుండా ఇంకా దాదాపు 22,000 మంది పురుషులు, మహిళలు బానిసలుగా పట్టుబడ్డారు. అబ్దాలీ సైన్యంతో కలిసి ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లవలసి వచ్చింది. ఆఫ్ఘన్ సైన్యం పంజాబ్ గుండా వెళుతున్నప్పుడు సిక్కు యోధులు చాలా మంది మహిళలను పిల్లలను చెర నుండి రక్షించారు. సైన్యం భారత సరిహద్దును విడిచిపెట్టిన తర్వాత, వారు బలూచిస్థాన్‌లోని డేరా బుగ్తీ ప్రావిన్స్‌లో ఉన్నారు. బలూచ్ పాలకుడి సైనికుల్లో కొద్దిమంది పానిపట్ యుద్ధంలో అబ్దాలీతో కలిసి పోరాడారు. అబ్దాలీ సహాయం కోసం కొంత పరిహారం అందించాల్సి వచ్చింది. అబ్దాలీ బానిసలందరినీ (యుద్ధ ఖైదీలు) బలూచ్ పాలకుడికి బహుమతిగా ఇచ్చాడు. అప్పటి నుండి బలూచ్ లో నివసిస్తున్నారు. అబ్దాలీ బానిసలను విడిచిపెట్టడానికి అసలు కారణం మరాఠా ఖైదీలు సుదీర్ఘ ప్రయాణం తర్వాత అలసిపోయారు. అందుకే బహుమతి సాకుతో వారిని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

మీర్ నాసిర్ ఖాన్ నూరి 22000 మంది ఖైదీలను వివిధ సమూహాలుగా విభజించారు. ఈ విభజన కారణంగా బుగ్తీ, మర్రి, గుర్చాని, మజారి మరియు రాయసాని తెగలుగా మారారు. ప్రాంతమంతా ఎండిపోయినందున పొలాలు లేని ప్రాంతంలో వారిని వదిలేశారు. మొదట్లో అక్కడ సరైన వాతావరణం లేక అనేక ఇబ్బందులకి గురయ్యారు. వారు నీటి వనరులను కనుగొని కొంత వ్యవసాయం చేయడం ప్రారంభించారు. మెల్లగా వారి జీవితం పైకి కనిపించడం మొదలైంది.

Are the people of Balochistan our Marathas?

బలూచిస్తాన్ (పాకిస్తాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్)లో యుద్ధ ఖైదీలుగా నివసించిన ఈ మరాఠీ పూర్వీకులు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ వారు తమ మరాఠీ సంస్కృతిని అక్కడ కూడా పాటిస్తూనే ఉన్నారు. నేటికీ మరాఠా ఉపకులం బలూచ్ తెగలలో భాగమే కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ ఖైదీలందరూ బలవంతంగా ఇస్లాంలోకి మారవలసి వచ్చింది, అయితే వారి జీవనశైలిలో మరాఠీ సంస్కృతికి సంబంధించిన జాడలను మనం ఇప్పటికీ చూడవచ్చు. వారి మరాఠీ మూలానికి సంబంధించిన ఆధారాలు వారి ఇంటిపేర్లలో చూడవచ్చు. బుగ్తీ యొక్క ఉప-కులంలో ఒకదానికి షాహు (ఛత్రపతి శివాజీ మహారాజ్ మనవడు) పేరు పెట్టారు.

బలూచ్ మరాఠాలకు పేష్వాల పేరుతో పేష్వానీ అనే ఇంటిపేరు కూడా ఉంది. షాహూ మరాఠాలు ఇస్లాంలోకి మారి ఉండవచ్చు, కానీ వారి వివాహాల్లో మరాఠీ సంస్కృతి స్పష్టంగా కనిపిస్తుంది. బుగ్తీ మరాఠాలు హల్దీ వేడుకను నిర్వహిస్తారు, ముడి కట్టి (సప్తపది వలె) మరియు బియ్యం గిన్నె దాటి కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తారు. సంప్రదాయాలు మరియు సంస్కృతితో పాటు, బలూచి భాష మరాఠీతో వంశాన్ని కలిగి ఉంది. షాహు మరాఠాలు తమ తల్లిని ఆయి (आई) అని సంబోధిస్తారు. మొత్తం బుగ్తీ తెగ కూడా దానిని అంగీకరించింది. స్త్రీలను గోడి (गोदी), కమోల్ (कमोल) అని పిలుస్తారు, ఇది గతంలో సాధారణ మరాఠీ పేర్లు.

బలూచిస్తాన్‌లోని మరాఠా కమ్యూనిటీకి చెందిన అతిపెద్ద సంస్థ The Marhtta Qaumi Itehad (పాకిస్థాన్). ఒక సందేశంలో, దాని చీఫ్ వదేరా దిన్ ముహమ్మద్ మరాఠా బుగ్తీ మరియు ఇతర సభ్యులు వజీర్ ఖాన్ మరాఠా, జాఫర్ మరాఠా బుగ్తీ మరియు నస్రుల్లా మరాఠా బుగ్తీ ప్రత్యేక దేశాన్ని కాంక్షిస్తూ ఈ క్రింది విధంగా వ్యక్తపరిచారు.

మా మూలాలను మేము మరచిపోలేదు. మేము నిత్య జీవితంలో శతాబ్దాల నాటి సంప్రదాయాలను కాపాడుకున్నాం. మేము పుట్టుకతో యోధులం. మేము ఇక్కడ సైన్యం, విద్య, రాజకీయాలు, వ్యవసాయం, టెలికాం మొదలైన అన్ని ప్రధాన రంగాలలో స్థిరపడ్డాము. అనేక మరాఠీ పదాలు మరియు వంటకాలు ఇప్పటికీ మన సంస్కృతిలో భాగంగా ఉన్నాయి. మతపరమైన ఆంక్షల కారణంగా, మేము ఛత్రపతి శివాజీ జయంతిని జరుపుకోలేపోతున్నాము, కానీ మేము శివాజీ జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకున్నాము. మా పూర్వీకులు మరాఠాలు అని చెప్పుకునేందుకు మేము గర్వపడతాము అంటారు.

అదండీ సంగతి అందుకే పాకిస్తాన్ లో ఉన్న బలూచిస్తాన్ ప్రజలు తమకు ప్రత్యేక దేశం కావాలని కాంక్షిస్తున్నారు. ఇందిర గాంధీ బాంగ్లాదేశ్ ని విభజించినట్లుగానే మోడీ గారు ఒకడుగు ముందుకేసి బలూచ్ లకి విముక్తి కలిగించాలని ఆశిద్దాం. జై హిందురాష్ట్ర. -రాజశేఖర్ నన్నపనేని.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.


At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top