Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

భారత ఏకత్వాన్ని చాటే జాతర గురించి తెలుసా? Madhavpur Mela in Telugu - MegaMinds

మన తెలుగురాష్ట్రాలలో అత్యంత వైభవోపేతంగా జరిగే జాతరలలో ఒకటైన మేడారం సమ్మక్క సారక్క జాతర గురించి మనకందరికీ తెలుసు. ప్రతి రెండు సంవ...

మన తెలుగురాష్ట్రాలలో అత్యంత వైభవోపేతంగా జరిగే జాతరలలో ఒకటైన మేడారం సమ్మక్క సారక్క జాతర గురించి మనకందరికీ తెలుసు. ప్రతి రెండు సంవత్సరాలకొకసారి ఈ జాతర జరుగుతుంది. ఈ జాతరలో కనీసం కోటిమంది పాల్గొంటారు. ఈ వీరమహిళలైన సమ్మక్క సారక్కలను జ్ఞాపకంచేసుకుంటూ గిరిజనులంతా జరుపునే జాతర. సరిగ్గా ఇలాంటి ఒక జాతర గురించి ఈ రోజు తెలుసుకుందాం.

అదే "మాధవ్‌పూర్ జాతర" గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో సముద్రానికి సమీపంలోని మాధవపూర్ గ్రామంలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం రామ నవమి నాడు ప్రారంభమయ్యి సాంస్కృతిక ఉత్సవం జరుగుతుంది. కృష్ణుడి విగ్రహాన్ని మోసే రంగురంగుల రథం గ్రామాన్ని ప్రదక్షిణ చేస్తుంది. ఒక వారం పాటు జాతర జరుగుతుంది. వారం రోజుల పాటు జరిగే మాధవపూర్ జాతరకు ఈశాన్య రాష్ట్రాల నుండి అనేకమంది కళాకారులు, హస్తకళకు సంబంధించిన కళాకారులు కూడా వస్తారు. అదేంటి గుజరాత్ లో జరిగే ఈ జాతర కు ఈశాన్య రాష్ట్రాల నుండి రావడమేంది అనుకుంటున్నారా. దీని వెనుక ఒక పురాణకథ వుంది అది చరిత్ర కూడా అందుకే వేల సంవత్సరాల నుండి ఈ జాతర జరుగుతుంది. 
                                   MadhavpurMela                  

వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు ఈశాన్యప్రాంత మిష్మి తెగ వారి పూర్వీకుల రాజు భీష్మకుడి కుమార్తే అయిన రుక్మిణిని వివాహం చేసుకున్నాడని చెప్తారు. దిగువ దిబాంగ్ వ్యాలీ జిల్లాలో రోయింగ్ సమీపంలో ఉన్న భీష్మక్ నగర్, కాళికా పురాణంలో కూడా ప్రస్తావించబడింది. ఈ వివాహం పోరుబందర్‌లోని మాధవపూర్‌లో జరిగింది. ఆ పెళ్ళికి గుర్తుగా ఈ రోజు కూడా మాధవపూర్ జాతర అక్కడ జరుగుతుంది.

ఈ జాతరలో ఈశాన్య ప్రాంతాల నుండి ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ మరియు మణిపూర్ నుండి వచ్చిన కళాకారులు అద్భుతమైన జానపద సాంస్కృతిక ప్రదర్శనలను చేస్తారు. మణిపూర్ నుండి వచ్చిన సంగీత బృందం ఖుల్లాంగ్ ఇషే మరియు నాట్ జెనెలో రుక్మిణికి సంబంధించిన పాటలను పాడుతారు. అరుణాచల్ మరియు మణిపూర్ నుండి రుక్మిణి-కృష్ణ పురాణాల ఆధారంగా నృత్య-నాటకాలు మరియు అరుణాచల్ నుండి మిష్మి తెగకు చెందిన జానపద నృత్యాలు విభిన్న కచేరీలలో భాగంగా ఉంటాయి.

తూర్పు, పడమరల మధ్య ఉన్న ఈ లోతైన సంబంధం మన వారసత్వం. కాలంతో పాటు ఇప్పుడు ప్రజల కృషితో మాధవపూర్ జాతరకు కొత్తదనం కూడా తోడవుతోంది. వధువు వైపు వారిని ఘరాతీ అని పిలుస్తారు. ఈశాన్య ప్రాంతాల నుండి చాలా మంది ఘరాతీలు ఈ జాతరకు రావడం జరుగుతుంది. నలుగురు చంద్రుల వెన్నెలలాగా ఈ జాతర అందాలు పొందుతుంది. ఒక వారం పాటు భారతదేశ తూర్పు, పశ్చిమ సంస్కృతుల సమ్మేళనమైన ఈ మాధవపూర్ జాతర ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్‌కు చాలా అందమైన ఉదాహరణ. మనం కూడా ఎప్పుడైనా ఒక శ్రీ రామనవమి కి ఈ జాతరలో పాల్గొందాం ఏకత్వాన్ని చాటుదాం. జై హింద్. రాజశేఖర్ నన్నపనేని.



By Road GSRTC and private buses come here from Ahmedabad, Rajkot, Dwarka, Veraval, Jamnagar and Junagadh, among others.
By Train Porbandar has a railway station which has connecting trains to places like Rajkot, Ahmedabad and Mumbai.
By Air Porbandar has a domestic Airport which has connecting flights to places like Ahmedabad and major cities of India.

No comments