పాకిస్తాన్ పై 1965 యుద్దంలో హవల్దార్ హమీద్ - తారాపూర్ ల వీరోచిత పోరాటం
1964 మే 27న నెహ్రూజీ తన కార్యాలయంలో తనువు చాలించగా, ప్రధాని పదవికి శూన్యత ఏర్పడింది. అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు కె.కామరాజ్ చొరవతో జూన్ 9న శాస్ర్తిజీకి ప్రధాని పదవి కట్టబెట్టారు. శాస్ర్తిజీని తక్కువగా అంచనావేసిన పాకిస్తాన్ 1965లో భారత్పై దండయాత్ర చేసింది. అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన శాస్ర్తిజీ వడివడిగా నిర్ణయం తీసుకుని సైన్యానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. భారత్ సైన్యం పాకిస్తాన్ దండయాత్రను తరిమి కొట్టడంతో పాకిస్తాన్ సైన్యం చావుదెబ్బతింది. పాకిస్తాన్పై విజయం భారత్ ప్రతిష్ఠను ఇనుమడింపజేసింది. ఐరాస, అమెరికా, రష్యాల జోక్యంతో 23-9-65న యుద్ధం ముగిసింది.
పంజాబ్ రాష్ట్రంలో ఖేమ్ కరణ్ సెక్టార్ యుద్ధం:
ఈ యుద్ధంలో భారత - పాకిస్థాన్ దేశాల సరిహద్దు. పంజాబ్ రాష్ట్రంలో ఖేమ్ కరణ్ సెక్టార్. వాస్తవాధీన రేఖ (లైన్ ఆఫ్ కంట్రోల్)కి ఇరువైపులా సైన్యాలు మోహరించాయి. కాశ్మీర్ కోసం భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం షురూ అయింది. ఆ యుద్ధంలో మనదేశం తరఫున పాల్గొన్న హవల్దార్ హమీద్ ధీరత్వాన్ని తెలుసుకుందాం...
భారత భూభాగం అయిన ఖేమ్కరణ్ పై 1965లో భారీ ట్యాంక్లతో దాడి చేసింది పాకిస్తాన్. ఆ ట్యాంకులను ఎదుర్కోవాలంటే భారత్ ట్యాంకులు వచ్చే దాకా ఆ పోస్ట్ ను కాపాడుకోవాలి. ఏం చేయాలి ? ఆలోచిస్తున్న అధికారుల మదిలో వెనువెంటనే అబ్దుల్ హమీద్ నైపుణ్యం కదలాడింది.
ఉత్తరప్రదేశ్ గజిపూర్ జిల్లాలోని ధాముపూర్ గ్రామంలో ఉస్మాన్, సకనా బేగం దంపతులకు జన్మించారు అబ్దుల్ హమీద్. వారి కుటుంబ వృత్తి ధర్టీ పని. కాని చిన్నప్పట్నుండి కుస్తీలు, కత్తి సాము అంటే ఇష్టపడే హమీద్ తన 20వ ఏట వారణాసిలో సైన్యంలో చేరాడు. రికాయిల్నెస్ గన్ వాడడంలో అత్యంత ప్రావీణ్యం సాధించిన హమీద్ 1962 చైనా యుద్దంలో తన వీరత్వం ప్రదర్శించాడు. అతను యాంటీ ట్యాంక్ గన్ పేలిస్తే ట్యాంక్ ఖచ్చితంగా ధ్వంసం అయ్యేది. అదీ అతని నైపుణ్యం. పదోన్నతి లభించిన అతను ఇప్పుడు స్టోర్స్లో క్వార్టర్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు.
క్వార్టర్ మాస్టర్ విధుల నుండి వెనక్కి పిలిపించి అతనికి యాంటీ ట్యాంక్ బాధ్యతలను అప్పగించారు అధికారులు. సామాన్యంగా ఒక ట్యాంక్ ని ధ్వంసం చేయాలంటే మరో ట్యాంక్ తో దాడి చేయాలి. యాంటీ ట్యాంక్ గన్ తో నిక్కచ్చిగా గురి చూసి దాడి చేస్తే కూడా ధ్వంసం చేయవచ్చు. కాని ఆ రోజుల్లో టెక్నాలజీ లేమి వల్ల మానవ నైపుణ్యం మీదే ఆధారపడవలసి వచ్చేది, అందులో ఖచ్చితత్వం చాలా తక్కువగా ఉంటుంది.
ఖేమ్కరణ్ జిల్లాలోని చీమా గ్రామంలోని చెరకు తోటలో మాటువేసి తన జీప్ పైన యాంటీ ట్యాంక్ గన్ బిగించి శత్రువు కోసం వేచి ఉన్నాడు హమీద్, రిక్కించిన చెవులకు తమవైపుకు వస్తున్న ట్యాంక్ శబ్దాలు వినబడ్డాయి. తన జీప్ పైన ఉన్న గన్ లోడ్ చేసి సిద్దం చేసుకున్నాడు. తన గన్ పరిధిలోకి రాగానే గురి చూసి పేల్చాడు. యాంటీ ట్యాంక్ గన్ నేరుగా వెళ్ళి ట్యాంక్ ను ఢీకొట్టింది. ట్యాంక్ కి నిప్పు అంటుకోవడం సిబ్బంది పారిపోవడం కళ్ళారా చూశాడు. రెండు గంటల తర్వాత మూడు ట్యాంకులు వచ్చాయి. భారీగా పేలుళ్ళు జరుపుతూ తమ స్థావరం వైపు వస్తున్నాయి. మళ్ళీ గురి చూసి జీప్ పై బిగించిన రీకాయిల్లెస్ గన్స్ పేల్చాడు. ఒక ట్యాంక్తి నిప్పు అంటుకోగానే మిగతా వాటిని కూడా వదిలేసి పారిపోయారు పాక్ సైనికులు. అలా మొదటి రోజు రెండు ట్యాంకులను ధ్వంసం చేయగా మరో నాలుగింటిని వదిలేసి పారిపోయారు శత్రువులు.
మర్నాడు ట్యాంక్లతో పాటు వైమానిక దాడులకు తెగబడింది పాక్, అయినా హమీద్ వెరవలేదు. గురి చూసి ఆ రోజు మరో రెండు ట్యాంకులను ధ్వంసం చేశాడు. హమీద్ వాడుతున్న రికాయిల్ లెస్ గన్ తో ఒక ట్యాంక్ ని ధ్వంసం చేయడమే చాలా కష్టం. అలాంటిది ట్యాంక్లను ధ్వంసం చేయడమే కాక మరెన్నింటినో వదిలిపోయేలా చేసిన హమీద్ కు పరమవీర చక్రను అప్పటికప్పుడు ప్రతిపాదించారు అధికారులు.
కంట్లో నలుసులా ఉన్న హమీద్ జీప్ అంతు చూడాలని మర్నాడు పాక్ సైన్యం బయల్దేరింది. తమ ట్యాంకులతో ముందుగా ఆ జీప్ పై దాడ్ చేయాలనే వ్యూహంతో వచ్చారు పాక్ సైనికులు. వారికి తాను కనపడకుండా మాటు వేస్తూ మరో మూడు ట్యాంకులను ధ్వంసం చేసి తన విజయ పరంపరను కొనసాగించాడు హమీద్. నాలుగో ట్యాంక్ కి గురిపెడుతుండగా ఆ ట్యాంక్లో ఉన్న శతృసైనికులు పసిగట్టారు హమీద్ జీప్స్, హమీద్ జీపలోని గన్, పాక్ ట్యాంక్ ఒకేసారి పేలాయి. రెండూ లక్ష్యాన్ని ఛేదించాయి. పాక్ ట్యాంక్ ధ్వంసం కాగా ట్యాంక్ దాడికి మామూలు జీప్ తట్టుకోలేకపోయింది. భారత వీరుడు నేలకొరిగాడు.
హమీద్ విజయ పరంపర మగిసింది. కానీ హమీద్ పోరాట ఫలితంగా తన ట్యాంకులను ఖేమ్కరణ్ కి పంపే వ్యవధి భారతికి దొరికింది. భారత ట్యాంకులు ఖేమ్కరణ్ కు చేరాయి. భీకర సమరం సాగింది. పాకిస్తాన్ తన 100 ట్యాంకులను వదిలేసి పారిపోయింది. హవల్దార్ అబ్దుల్ హమీదకు మరణానంతరం పరమ వీర చక్ర సత్కారం లభించింది. చీమా గ్రామానికి అసల్ ఉత్తర్ అని పేరు పెట్టారు. దీటైన సమాధానం అని దీని అర్థం. అక్కడ అబుల్ హమీద్ స్మారకం కూడా ఉన్నది.
సియాల్కోట్ సెక్టార్లో చావిందా - ఫిల్లోరా యుద్ధం:
భారత్కు చెందిన పలు ప్రాంతాలపై కన్నేసిన పాకిస్తాన్.. ఆపరేషన్ జిబ్రాల్టర్ చేపట్టింది. వేలాది మందికి గెరిల్లా యుద్ధమెళకువలు నేర్పిన పాక్.. భారత్కు చెందిన కశ్మీర్ను చిక్కించుకోవాలని కుట్ర పన్నింది. కశ్మీరీల మాదిరిగా ఆహార్యంతో కూడిన దుస్తులతో సైన్యాన్ని సిద్ధం చేసి భారత సేనలపై పురిగొల్పింది. దీనిని గుర్తించిన భారత ప్రత్యేక కమెండోలు వారి ఆటలను సాగనీయకుండా చేశారు. దాంతో ఆగ్రహించిన పాక్.. భారత సైనికులపై క్యానన్ బాల్స్ వేయడం ప్రారంభించింది. ఫలితంగా రెండు దేశాల మధ్య యుద్ధనీడలు అలుముకున్నాయి. ఈ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం కశ్మీర్లోని మనకు చెందిన పూంచ్, యురి ప్రాంతాలను ఆక్రమించుకోగా.. మన సైనికులు 8 కిలోమీటర్ల మేర చొచ్చుకునిపోయి పీఓకేకు చెందిన హాజీ పీర్ పాస్ను ఆక్రమించింది. ఈ యుద్ధం 1965 లో ఆగస్ట్ నెలంతా కొనసాగింది.
సియాల్కోట్ సెక్టార్లో 17 Horses బెటాలియన్ కి లెఫ్టినెంట్ కల్నల్ గా తారాపూర్ ఉన్నారు. సియోల్ టెక్ రక్షణ భారం వారిపై పడింది. ఫిల్లోరా మరియు చావిందా మధ్య రెజిమెంట్ ముందుకు సాగుతుండగా, వజిరాలి పై శతృవులు ఎదురుదాడి చేశారు. లెఫ్టినెంట్ కల్నల్ తారాపూర్ తన స్థావరాన్ని నిలబెట్టుకున్నాడు మరియు అతని స్క్వాడ్రన్లలో ఒకదానితో ఫిల్లోరాపై ధైర్యంగా దాడి చేశాడు మరియు పదాతిదళ బెటాలియన్ మద్దతుతో. రెండు వైపుల మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది, దీని ఫలితంగా 13 ట్యాంకులు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్ చావిండాను విడిచిపెట్టాడు మరియు ఫిల్లోరా కైవసం చేసుకున్నారు. లెఫ్టినెంట్ కల్నల్ తారాపూర్ అద్భుతంగా పోరాడారు కానీ యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ, అధైర్యపడకుండా అతను వజిరాలి, జసోరన్ మరియు బుతుర్-డోగ్రాండి ప్రాంతాలను కాపాడుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేశాడు.
13/14 సెప్టెంబర్ 1965న, లెఫ్టినెంట్ కల్నల్ తారాపూర్ గాయపడినప్పటికీ 17 Horses బెటాలియన్ మరియు 9 గర్వాల్ బెటాలియన్తో కలిసి పదాతిదళ దాడిని ప్రారంభించాడు. వజీరాలి 14 సెప్టెంబరున కైవసం చేసుకున్నారు. కానీ లెఫ్టినెంట్ కల్నల్ తారాపూర్ బుటూర్ మరియు డోగ్రాండి ప్రాంతాల్లో దాక్కున్న శత్రు సేనలపై తన దాడిని కొనసాగించాడు. మరోసారి సాహసోపేతమైన దాడిలో లెఫ్టినెంట్ కల్నల్ తారాపూర్ ఆరు శత్రు ట్యాంకులను ధ్వంసం చేసి, 16 సెప్టెంబర్ నాటికి 9 డోగ్రా బిఎన్ మరియు బుతుర్ & డోగ్రాండితో పాటు 8 గర్వాల్ రైఫిల్స్తో పాటు జస్సోరాన్ను స్వాధీనం చేసుకున్నాడు. తన స్వంత ట్యాంక్ను అనేకసార్లు ఢీకొన్నప్పటికీ, అతను ఈ రెండింటిలోనూ తన ఇరుసులను కొనసాగించాడు. వెనుక నుండి చావిందాపై దాడి చేస్తున్న పదాతిదళానికి మద్దతునిస్తుంది. అతని నాయకత్వం నుండి ప్రేరణ పొందిన రెజిమెంట్ శత్రు కవచంపై దాడి చేసింది మరియు సుమారు అరవై పాకిస్తానీ ఆర్మీ ట్యాంకులను నాశనం చేసింది, కేవలం తొమ్మిది ట్యాంక్ ప్రాణనష్టాన్ని చవిచూసింది. అయితే, లెఫ్టినెంట్ కల్నల్ తారాపూర్ గట్టి సవాలు విసురుతున్నప్పుడు ఒక శత్రువు షెల్ అతని ట్యాంక్ను తగలబెట్టి మంటల్లో చిక్కుకుంది. లెఫ్టినెంట్ కల్నల్ తారాపూర్ నిజమైన సైనిక నాయకుడిలా ముందుండి నడిపిస్తూ యుద్ధరంగంలో వీరమరణం పొందాడు.
లెఫ్టినెంట్ కల్నల్ తారాపూర్ తన అద్భుతమైన ధైర్యం, నాయకత్వం, త్యాగం వలన దేశం యొక్క అత్యున్నత శౌర్య పురస్కారం "పరమ్ వీర చక్ర" అందించారు. లెఫ్టినెంట్ కల్నల్ అర్దేషీర్ బుర్జోర్జీ తారాపూర్ 1923 ఆగస్టు 18న ముంబైలో జన్మించారు. లెఫ్టినెంట్ కల్నల్ తారాపూర్ శివాజీ సైన్యంలో పనిచేసిన గొప్ప యోధుడు రతన్జీబా కుటుంబానికి చెందినవారు. అతని శౌర్యం, విధేయత మరియు సేవలకు గుర్తింపుగా రతన్జీబాకు వంద గ్రామాల బాధ్యతలు అప్పగించారు. గ్రామాలలో ఒకదానికి తారాపూర్ అని పేరు పెట్టారు మరియు అప్పటి నుండి అది కుటుంబానికి బిరుదుగా మారింది. లెఫ్టినెంట్ కల్నల్ తారాపూర్ తండ్రి బుర్జోర్జీ పూర్వపు హైదరాబాద్ స్టేట్లోని కస్టమ్స్ డిపార్ట్మెంట్లో పనిచేశారు మరియు పర్షియన్ మరియు ఉర్దూ భాషలలో నిష్ణాతుడైన పండితుడు.
హవల్దార్ అబ్దుల్ హమీద్ వలన ఈ రోజు ఖేం కరణ్ సెక్టార్ మనతో కలిసి వుంది అలాగే లెఫ్టినెంట్ తారాపూర్ వలన సియోల్ టెక్ సెక్టార్ మన చేతుల్లో వుంది. 1965 పాకిస్తాన్ తో జరిగిన యుద్దంలో మనం విజయం సాధించాం అలాగే దేశం ఈ అమరులిద్దరిని పరమ వీర చక్ర తో గౌరవించింది.

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.