శ్రీ దత్తోపంత్ ఠేంగ్డీ 1920 సంవత్సరం నవంబర్ 10 దీపావళి రోజున భావూరావ్ ఠేంగ్డీ, జానకీ దేవి దంపతులకు మహారాష్ట్ర ప్రాంత వార్ధా జిల్లాలోని ఆర్వి గ్రామంలో జన్మించారు. తల్లి జానకీ దేవి దత్తాత్రేయుని పూజించింది దేవుడి వర ప్రసాదంగా దత్తుడి పేరు కొడుకుకి పెట్టింది. తండ్రి న్యాయవాదిగా స్థిరపడ్డారు.
బాల్యం నుంచే దత్తోపంత్ దేశభక్తితో స్వాతంత్ర్య ఉధ్యమంలో భాగంగా జరిగే సత్యగ్రహాల్లో పాల్గొనేవారు భారత్ మాతాకీ జయ్, వందేమాతరం నినాదాలు ఇచ్చేవాడు. తల్లికి శాంత స్వభావం ధార్మికత ఎక్కువ దత్తుకి జ్ఞానేశ్వరి, దాసబోధ, దత్త చరిత్ర వినిపించేది. కుమారుడికి మంచి సంస్కారలు అందాలని తల్లితండ్రులు ఆర్ ఎస్ ఎస్ శాఖకు పంపేవారు, తండ్రి కూడా సంఘ స్వయంసేవక్, చిన్నతనం నుందే కొత్తవారిని పరిచయం చేసుకోవడం వారిని మిత్రునిగా చేసుకోవడం చేసేవాడు.
1934 డిసెంబరు వార్ధా జిల్లాలో హేమంత శిబిరంలో దత్తు మొదటిసారి పరమ పూజ్య డాక్టర్జీని చూసి ఉపన్యాసం విన్నాడు. 15 సంవత్సరంల వయసులో కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన వానరసేనకి ఆర్వీ తాలూకా ప్రముఖ్ అయ్యాడు. ఆర్వీ గ్రామంలో తిలక్ గ్రంధాలయంలో పుస్తకాలన్నీ దత్తోపంత్ చదివేశాడు. మరాఠీ, హిందీ, ఆంగ్లం, సంస్కృత భాషలలో పట్టు సాధించాడు.
తల్లి జానకీ దేవికి గురూజీ అంటే పూజ్య భావన ఉండేది, నాగపూర్ లో గురూజీ ఇంట్లోనే ఉండి దత్తు బి.ఏ, ఎల్.ఎల్.బి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. 1936-38వరకూ హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోషియేషన్ అనే విప్లవ సంస్థ లో క్రియాశీలంగా ఉన్నారు. ఇదే సమయంలో సంఘ జ్వేష్ట ప్రచారక్ మోరోపంత్ పింగళేతో స్నేహం ఏర్పడింది. డాక్టర్జీనీ అనేకసార్లు కలిశారు, గురూజీ నుండి సంస్కారాలు పొందారు. గుర్రూజీ ప్రేరణతో 1942 లో సంఘ ప్రచారక్ గా వచ్చారు.
కేరళ, బెంగాల్ లో ప్రచారక్ గా పనిచేశారు. కేరళ లో ఓ న్యాయవాది ఇంటి కారుషెడ్ లో ఉండి సంఘ శాఖలు విస్తరించారు. 1947-48 లో అస్సాం సహిత ప్రాంతానికి ప్రచారక్ గా పనిచేశారు. మళయాళీ, బెంగాలీ భాషలలో పట్టు సాధించారు.
1948లో గాంధీజీ హత్యని సంఘంపై మోపి సంఘాన్ని నిషేదించారు. దత్తోపంత్ అజ్ఞాతవాసంలో ఉంటూ బెంగాల్ లో సత్యాగ్రహ ఉధ్యమాన్ని నిర్వహించారు. సంఘ నిషేదం ఎత్తివేసిన తరువాత శ్రీ గురూజి సామాజిక క్షేత్రాల్లో సంఘ ప్రభావం ఉండాలని భావించారు 1949 జులై 9 న ఎబివిపి ప్రారంభమయ్యింది.
దత్తోపంత్ జీ ఎబివిపి స్థాపక సదస్సులయ్యారు విద్యార్థులలో యోగ్యమైన కార్యకర్తల నిర్మాణం జరిగింది. 1949 లోనే కార్మిక క్షేత్రం ఐ ఎన్ టి యు సి లో చేరి కార్మిక రంగాన్ని అధ్యయనం చేశారు. ఈ అనుభవంతో మనదేశంలోని జాతీయ సాంస్కృతిక సమాజ జీవన రచనకు అనుకూలమైన కార్మిక సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ ను స్థాపించారు. 1955 జులై 25 న ఇది ప్రారంభమయ్యింది.
35 మందితో ప్రరంభమై నేదు 2 కోట్ల మంది సభ్యలతో అతిపెద్ద కార్మిక సంస్థగా బి.ఎం.ఎస్. అవతరించింది. 1965 లోబెంగాల్ సమావేశాల్లో కమ్యునిష్ట్ లను ఆయన బెదిరించారు నిర్భయత, పోరాటపటిమతో బి.ఎం.ఎస్.ను పెంచారు.
1964 నుండి 1976 వరకు 2 సార్లు ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యునిగా ఉండి రాజకీయ క్షేత్రాన్ని అధ్యయనం చేశారు. సిద్ధాంత చర్చలు చేస్తూ అనేకమందితో వ్యక్తిగత స్నేహం చేసేవారు. 1975 అత్యవసర పరిస్థితిని ఆయన ముందుగానే ఊహించి దేశ ప్రజలను హెచ్చరించారు. 1979 మార్చి 4న రాజస్థాన్ లోని కోటాలో రైతుల సమ్మేళనం ఏర్పరిచి భారతీయ కిసాన్ సంఘ్ ప్రారంభించారు.
అంబేద్కర్ తో ఆయనకు దగ్గర సంబంధం ఉండేది, సాంఘీక అసమానతలను, అంటరానితనం మొదలైన విషయాలను ఆయనతో చర్చించేవారు. అంబేద్కర్ జన్మశతాబ్ది తిధి 1983 ఏప్రిల్ 14న సామాజిక సమరసతా మంచ్ ప్రారంభించారు. 1993లో సర్వ పంథ్ సమాదర్ మంచ్ ప్రారంభించారు.
1990 దశకంలొ పశ్చిమదేశాలు అభివృద్ధి చెందుతున్నా భారత్ వంటి దేశాలను ఆర్ధిక సంక్షోభంలో నెట్టేందుకు ప్రయత్నించాయి. ఈ ప్రమాదం నుండి దేశాన్ని రక్షించేందుకు 1991 నవంబరు 22న దత్తోపంత్ జీ స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రారంభించారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, దార్శనికుడు.1980లో కమ్యునిజం పది సంవత్సారాలలో అంతమవుతుంది అని చెప్పారు అదే జరిగింది.
1989 లో డాక్టర్జీ శత జయంతి ఉత్సవాలలో మాట్లాడుతూ 21వ శతాబ్దపు సూర్యోదయం తరువాత విశ్వవ్యాప్తంగా హిందూధర్మ పునరుద్ధానం జరుగుతుందన్నారు. అమెరికా, రష్యా, చైనా దేశాలు పర్యటించి కార్మిక ఉధ్యమాలను అధ్యయనం చేశారు. 200 పైగా గ్రంధాలు వ్రాశారు, పద్మ భూషన్ పురస్కారాన్ని తిరస్కరించారు. 2004 అక్టోబర్ 14 అనారోగ్యంతో పూణేలో స్వర్గస్తులయ్యారు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia
At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.