Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మేమే అని తేల్చేసిన జైషే అహ్మద్

జమ్మూ‌కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడి చేసింది కశ్మీర్‌కు చెందిన ఉగ్రవాది అదిల్ అలియాస్ వకాస్ తేలింది. ...


జమ్మూ‌కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడి చేసింది కశ్మీర్‌కు చెందిన ఉగ్రవాది అదిల్ అలియాస్ వకాస్ తేలింది. ఈ ఉగ్రదాడి తమ పనేననంటూ జైషే మహ్మద్ కశ్మీరీ న్యూ ఏజెన్సీ జీఎన్‌ఎస్‌కు ఓ సందేశాన్ని పంపారు. దక్షిణ కశ్మీర్ కాకపోరా జిల్లాకు చెందిన వకాస్ జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థలో ఉగ్రవాద కార్యకలాపాల్లో ఏడాది‌పాటు శిక్షణ తీసుకుంటున్నాడు. వకాస్.. పేలుడుకు ముందు రికార్డు చేసిన వీడియోను జైషే మహ్మద్ సంస్థ విడుదల చేసింది.
ఆ వీడియోలో వకాస్ తన రెండు చేతుల్లో ఆటోమేటిక్ రైఫిల్స్ పట్టుకుని, బ్యాక్ డ్రాప్‌లో జైషే మహ్మద్ జెండాతో ఉన్నాడు. ‘వీడియో మిమ్మల్ని చేరుకునేలోపు నేను పరలోకంలో ఉంటాను. జైషే మహ్మద్ సంస్థలో సంవత్సరం పాటు ఉన్నాను. కశ్మీర్ ప్రజలకు ఇదే నా చివరి సందేశం’ అని ఉగ్రవాది వకాస్ చెప్పాడు.
జమ్మూకశ్మీర్ నుంచి 70 వాహనాల్లో దాదాపు 2500 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు శ్రీనగర్ వెళ్తుండగా మానవ బాంబు దాదాపు 350 కేజీల ఐఈడీ నింపిన వాహనంతో కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని ఢీ కొట్టించాడు. ఈ ఘటనలో 20 మంది జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలభై మంది జవాన్లు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పేరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.  గత ఇరవై ఏళ్లలో జమ్మూ కశ్మీర్‌లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదేనని పోలీసులు పేర్కొంటున్నారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments