Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

టి టి డి చంద్రబాబు జాగీరా? - megamindsindia

రెండు   దశాబ్దాల   కిందటి   మాట .     రాఘవేంద్రరావు   దర్శకత్వంలో   నాగార్జున   హీరోగా  ' అన్నమయ్య '  సినిమా   తీస్తున్నారు .  దాన...

రెండు దశాబ్దాల కిందటి మాట.    రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా 'అన్నమయ్యసినిమా తీస్తున్నారుదాని షూటింగ్ను తిరుమల కొండల మీద జరుపుకోవటానికి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరుఅనుమతి కోరారు. విషయం ట్రస్టు బోర్డు ముందు పెట్టారుకమర్షియల్‌ కార్యకలాపాలను కొండమీద అనుమతించేది లేదని టిటిడి బోర్డు కరాఖండిగాతిరస్కరించిందిఇంకోసారి ఆలోచించమని సినిమా వాళ్లు అడిగారుఇంకోసారి బోర్డు అదేసమాధానం చెప్పి 
ససేమిరా అంది. దాంతో నిర్మాత తెలివి తెచ్చుకుని 'కరెక్ట్‌ రూట్‌'లో వెళ్లాడుచెప్పవలసిన వారికిచెప్పవలసిన రీతిలో చెప్పాడుఅప్పుడూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే.'వీళ్లేదోఅడుగుతున్నారుదీని సంగతి కాస్త
చూడండివీరి అర్జీని మళ్లీ బోర్డు ముందు పెట్టి'పునఃపరిశీలించండిఅని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ..కు ఆదేశం వెళ్లిందిఅంతేబోర్డుతోకముడిచిషూటింగ్కు 'సరేఅంది. దానిమీద ఒళ్లు మండిన ఒక మిరాసీదారు సంబంధీకుడు హైకోర్టులో దావా వేశాడుప్రధాన న్యాయమూర్తి ప్రభాశంకర మిశ్రాజస్టిస్‌ వి.ఆర్‌.రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచిసినిమా షూటింగ్కు .ఇచ్చిన పర్మిషన్‌ చట్టవిరుద్ధమని ప్రకటించి రద్దుపరిచిందిరాష్ట్రప్రభుత్వ ప్రభావంలో పడి బోర్డు చట్టప్రకారం తన విచక్షణాధికారాన్నివినియోగించలేకపోయిందని తప్పుపట్టింది.

    1997లో ఇచ్చిన చరిత్రాత్మకమైన తీర్పు (Tallapakam Raghavan Vs State of A.P. 1997 (2) ALT (DB)) లో  కోర్డు చేసిన  న్యాయ నిర్ణయాన్ని చిత్తగించండి.

     1. The Board of Trustees, the committee or the Executive officer are only administrators of the property of Lord Venkateswara. They can have no right of ownership in themselves and they can not decide to do anything against the interest of the right of the owner (i.e.) Lord Venkateswara.
    2. No Administrator can take liberty to destroy the sanctity and Holiness of the Thirumala Tirupathi Devasthanams, and domain of Lord Venkateswara.
    3. The Governement’s interference in the affairs of the Devasthanam or the administration, is beyond the law and without jurisdiction.
    (1.ట్రస్టీల బోర్డు అయినా మేనేజింగ్‌ కమిటీ అయినా ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరయినావెంకటేశ్వరస్వామి ఆస్తికి అడ్మినిస్ట్రేటర్లు మాత్రమేవారికి యాజమాన్యపు హక్కు లేదు. అసలు యజమాని శ్రీ వేంకటేశ్వరస్వామిఆయన హక్కు ప్రయోజనాలకు వ్యతిరేకంగావాళ్లు  నిర్ణయం 
చేయజాలరు.    2.శ్రీ వేంకటేశ్వరస్వామి సంస్థానమైన తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతనునాశనం చేసే స్వేచ్ఛ  అడ్మినిస్ట్రేటర్కూ లేదు.    3.దేవస్థానం వ్యవహారాలలో గానిదాని నిర్వహణలో గాని ప్రభుత్వ జోక్యం చట్టవిరుద్ధందాని పరిధికి మించిన పని.)  ఉన్నత న్యాయస్థానం అలా కుండబద్దలు కొట్టినట్టు న్యాయాన్యాయాలను స్పష్టంగాతేల్చి చెప్పిన తరువాత కూడా అటు రాష్ట్ర ప్రభుత్వంఇటు టిటిడి తమ తాహతుకు మించిఅతిచేయడం ఇప్పుడు ముదిరిన వివాదాలకు మూలకారణం.    టిటిడిని పరిపాలించేది ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, ధర్మకర్తల బోర్డు ..నూ  బోర్డునూఇష్టానుసారం నియమించేది రాష్ట్ర ప్రభుత్వంఅంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వం టిటిడికిసూపర్బాస్‌ అయిపోదుఅసలు యజమాని శ్రీవారుఆయన హక్కులకుఆయనసంస్థానం పవిత్రతకూ భంగం కలిగించే  నిర్ణయాన్నీ  కార్యనిర్వాహకుడు తీసుకోవటానికివీల్లేదుఇదే గదా హైకోర్టు మొహం మీద గుద్దినట్టు  తీర్పులో చెప్పింది ?    మరిసనాతన ధర్మానికి నెలవు అయిన ధర్మాన్ని ఆచరించే శతకోటిహిందువులకు పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతిలోని శ్రీవారి సంస్థానంలో ధర్మాన్ని బొత్తిగా విశ్వసించనిశ్రీవారిని కనీసం గౌరవించని అన్యమతస్తులను కొలువులోపెట్టటం వల్ల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి యాజమాన్య హక్కునుఆయన ప్రయోజనాలనుకాపాడినట్టా ? తుంగలో తొక్కినట్టా ?    వేరే  మతానికి చెందిన పూజాదికాల్లోపవిత్ర క్షేత్రాల్లో వేలు పెట్టేందుకుకనీసం క్రీగంటచూసేందుకు దమ్ముల్లేని ప్రభుత్వం హిందువుల అలసత్వాన్ని అలుసుగా తీసుకొనిఒక్కహిందూమతానికి చెందిన దేవాలయాల మీద జబర్దస్తీగా కర్రపెత్తనం చేస్తున్నదే తప్ప దేవాలయాల్లో ఒక్కదానిమీద తన జేబులో నుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టదుకళకళలాడే దేవస్థానాల సొమ్మును సొంత అవసరాలకుదిక్కుమాలిన రాజకీయమెహర్బానీలకు ఎలా కాజేద్దామా అనే చూస్తుంది తప్ప వెలవెలపోయిన గుడులనుఆదుకోవటానికి దమ్మిడీ విదల్చదుకలియుగ వైకుంఠంలా వెలిగిపోయిన తిరుమలదేవస్థానానికి జమపడే ప్రతి రూపాయీ తమ ఇలవేల్పు మీద భక్తితో హిందువులుసమర్పించుకున్నదేహిందూమతాన్ని విశ్వసించే హిందువులు హైందవ దేవస్థానంలోసమర్పించే కానుకలతో నడిచే టిటిడిలో  మతాన్ని ద్వేషించే దేవుడిని కన్నెత్తిచూడటానికికనీసం బొట్టు పెట్టుకోవటానికి కూడా నిరాకరించే అన్యమతస్తులను మేపటం దేవస్థాన పవిత్రతనుదాని ప్రయోజనాలను రక్షించటమాభక్షించటమా?  తుది తీర్పు వెలువడేంతవరకూ అన్యమస్తులెవరినీ ఉద్యోగంలోంచి తొలగించరాదని రాష్ట్రహైకోర్టు ఇచ్చిన ఇంటెరిం ఆదేశాన్ని సాకుగా చూపెట్టిహిందూ ప్రజానీకపు ఒత్తిడిపైతలపెట్టిన పాలనాపరమైన చర్యలన్నిటినీ కట్టిపెట్టిబాహాటంగా చర్చిలకు వెళ్లివస్తూండేఉద్యోగులకు అభయమిచ్చికడుపులో పెట్టుకొని కాపాడుతున్న టిటిడి పెద్దలు వారుచేస్తున్న తప్పులను ఎత్తి చూపిన ప్రధానార్చకుడిపై ఉన్న పళాన వేటువేయడంన్యాయమేనా?    టిటిడి అనేది రాష్ట్ర ప్రభుత్వం సొంత జాగీరు కాదుతరతరాలుగా స్వామిని సేవిస్తూఆగమ శాస్త్రోక్తంగా పూజాదికాలు జరుపుతున్న వంశపారంపర్య అర్చకులు గవర్నమెంట్‌ నౌకర్లు కారుఅధికారుల అనుచిత జోక్యాల వల్లరాజకీయ మెహర్బానీల కారణంగాస్వామి వారి కైంకర్యాలను సక్రమంగా నిర్వహించలేకపోతున్నామనితెల్లవారు ఝామునచేయాల్సిన సుప్రభాత సేవను అర్థరాత్రే కానిచ్చిన సందర్భాలున్నాయని ప్రధానార్చకుడుమీడియా ముందు చెప్పిన సంగతి ఏడుకొండల స్వామికి భక్తులైన ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతపరచిందిఆయన లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు చెప్పవలసిన బాధ్యత టిటిడి పాలకవర్గంమీద ఉంది.    అదేమంత కష్టమైన పని కాదుసుప్రభాతసేవతోమాల సేవ వగైరాలు  రోజున సమయంలో ఎంత సేపు జరిగిందన్న రికార్డు దేవస్థానం వారి దగ్గర ఉంటుందిదానికిసంబంధించి గడచిన  అర్థ సంవత్సరం వివరాలనో ప్రజల ముందు పెడితే రమణదీక్షితులు అన్నది నిజమో అబద్ధమో అక్కడిక్కడే తెలిపోతుంది.    అలాగేఆగమశాస్త్రానికి విరుద్ధంగా పాకశాలలో పెద్ద ఎత్తున తవ్వకాలు జరిగాయనిప్రధానార్చకుడు చెప్పారుఆయన చెప్పింది తప్పు అయిన పక్షంలో 'పోటు'కు ఎలాంటితవ్వకాల పోటూ లేదని నిరూపించే వాస్తవ చిత్రాల సాక్ష్యాలను బహిర్గత పరిస్తే భక్తకోటికిఆందోళన తగ్గుతుందిశ్రీవారి తిరువాభరణాలు తమ అధీనంలో ఉన్నంతవరకూ సజావుగానడిచిన వార్షిక తనిఖీకి  తరువాత దిక్కు లేకుండా పోయిందనిమైసూర్‌ మహారాజాసమర్పించిన అపురూప వజ్రం లాంటివి మాయమయ్యాయని ప్రధానార్చకుడు చేసినఅభియోగంలో పస ఎంతన్నదీ సరైన దర్యాప్తు ద్వారా తేల్చివేయవచ్చు. ఈ రాజమార్గాన్ని వదిలిపెట్టిఫిర్యాదు చేసిన ప్రధానార్చకుడి మీద విరుచుకుపడి,24 గంటలు తిరగకుండా కొలువునుంచి తొలగించటం తెంపరితనంకన్నూ మిన్నూ కాననిదురహంకారంహద్దుమీరిన నియంతృత్వం. ప్రధానార్చకుడు రమణదీక్షితులులో పుట్టెడు లోపాలు ఉండవచ్చుబోలెడు తప్పులుఅతడు చేసి ఉండవచ్చుఇప్పుడు తీరి కూర్చుని  లోపాలుతప్పులు ఏకరువుపెడుతున్న వారు అవన్నీ ఎరిగి కూడా ఇన్ని దశాబ్దాల పాటు అతడిని ప్రధానార్చకుడిగాఎందుకు కొనసాగనిచ్చారో మొదట చెప్పాలితమకు తందానా అన్నంతకాలమూ అతడుఎలాంటివాడయినా సహిస్తారుతమకు ఎదురు తిరిగితేనేమో మరుక్షణం అతడి మెడకాయకోస్తారారమణ దీక్షితులపై పగబట్టినట్టు ఆయనపై ఇప్పుడు ఎవరు ఎన్ని నిందలువేసినావాటిలో నిజానిజాలు ఎలా ఉన్నా నిన్నటిదాకా అతడు శ్రీవారిని అనుదినంస్వయంగా సేవించిన ప్రధానార్చకుడుపైగా దేవస్థానం వారే గుర్తించిన ఆగమ సలహాదారు హోదాలో అతడు ఆగమపరమైన అనాచారాలకుఅపచారాలకు సంబంధించి ఏమిచెప్పినాదానికి ఒక ప్రాముఖ్యం ఉంటుంది.    స్వామికి అపచారం జరిగిందో లేదో సాధికారకంగా చెప్పగలిగినవాడు అర్చకుడుఅర్చకుడే తప్పు జరిగిపోయిందని మొత్తుకున్నప్పుడుదానిపై భక్తులకు కలిగినమనస్తాపాన్ని గుర్తించిసరైన విచారణ ద్వారా అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యతదేవస్థాన పాలకవర్గానిది పని సజావుగా జరిగిన తరువాతఅర్చకుడు నిష్కారణంగాఅభాండాలు వేశాడని విచారణలో రుజువైతేఅతడికి ఎలాంటి శిక్ష విధించినా ఎవరూఆక్షేపించరుఆపాటి వివేకం లేకుండాఅసలు నోరెత్తటమే మహా నేరమైనట్టు అహంకరించితలచిందే తడవుగా ఫిర్యాది తలతీయటం  రకమైన ఫ్యూడల్‌ కండకావరం ? శ్రీవారిదేవస్థానానికి తాము ఆఫ్టరాల్‌ ధర్మకర్తలమే తప్ప సొంతదారులము కామనీదేవస్థానాన్ని పోషించే భక్తకోటికి కలిగే ప్రతి అనుమానానికీ జవాబు చెప్పవలసిన విధితమపై ఉన్నదనీ మరిచిగళమెత్తిన వాడిని నిర్బంధ ఉద్యోగ విరమణతో ఇంటికిపంపటాన్ని చట్టం అనుమతిస్తుందా ?    అసలే టిటిడి కొంతకాలంగా తట్టెడు వివాదాల్లో కూరుకుపోయిందిదేవస్థానం ప్రభుత్వకబ్జాలోకి వెళ్లినప్పటి నుంచీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరుగా తెలుగువాడిని నియమించటంఆనవాయితీదానిని తోసిరాజనిఅభ్యంతరాలన్నిటినీ పెడచెవిన పెట్టి తెలుగువాడు కానిఅనిల్‌ సింఘాల్ను ..గా నియమించటం ఒక వివాదంవిధాన నిర్ణయాలు చేసేట్రస్ట్బోర్డుకు ఛైర్మన్గా క్రైస్తవ పక్షపాతి అని ఆరోపణకు గురైన సుధాకర యాదవ్ని హైందవవర్గాల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతను లెక్కచేయకుండా ఛైర్మన్గా నియమించటం మరోపెద్ద వివాదంహిందూమతాన్ని ఆచరించే వారిని మాత్రమే బోర్డు సభ్యులుగానియమించాలన్న చట్ట నిబంధనను కాలరాసితాను క్రైస్తవురాలిననీతన బ్యాగులోఎప్పుడూ బైబిల్‌ ఉంటుందనీ బాహాటంగా ప్రకటించిన ఉత్తమురాలిని ఏరికోరి బోర్డుమెంబర్ను చేయటం ఇంకా అల్లరిపాలైందిసోషల్‌ మీడియాలో బండారంబట్టబయలయ్యాక నాలిక కరచుకొని  నియామకాన్ని రద్దుపరచినాకొత్త బోర్డులోనిఇంకో మెంబర్కు  క్రైస్తవంతో సంబంధం ఉందన్న ఆరోపణ కొత్తగా రావటం విశేషం.
హైందవ భక్తులు ఇచ్చే సొమ్ముతో నడిచే దేవస్థానం కొలువులో అన్యమతస్తులుపెరిగిపోవటంఅన్యమత ప్రచారం ఉధృతంగా సాగటం ప్రతి హిందువుకూ గుండెలో ముల్లుఅయిన తరుణంలో కొత్తగా ఏర్పడ్డ ట్రస్టు బోర్డులో కూడా క్రైస్తవ పక్షపాతులు ఉండటంహిందూ సమాజానికి మరీ దుస్సహమైంది.    ఈ పరిస్థితుల్లో భక్త జనానికి కలిగిన తీవ్ర మనఃక్లేశాన్ని ఉపశమింప జేయటం ఎలాగాఅన్నది కొత్త పాలకవర్గానికి ప్రప్రథమ ప్రాధాన్యం అయి ఉండాల్సింది దిశగా దృష్టిసారించాల్సిందిపోయికొత్త ఛైర్మన్‌ వచ్చీరాగానే దేవస్థానంలోని హైందవేతర సిబ్బందిప్రయోజనాలను కాపాడుతానని ప్రకటించటం పుండుమీద కారం చల్లటమేహిందూదేవస్థానంలో అన్యమతస్తులైన సిబ్బందిని కంటికి రెప్పలా కాపాడుతామనే వారు కొత్త బోర్డుమొట్టమొదటి సమావేశంలోనే అపచారాలను వ్యతిరేకించిన ప్రధానార్చకుడికి ఆగమేఘాలమీద ఉద్వాసన చెప్పటం అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ.    తమకు కంటగింపు అయిన రమణ దీక్షితులను అర్జంటుగా వదిలించుకోవటానికి టిటిడిబోర్డు ప్రయోగించిన అస్త్రం 65 ఏళ్లకు అర్చకులు విధిగా రిటైర్డు కావాలన్నది ! ఇది ఇంకోపెద్ద అక్రమంఅర్చకుల జీత భత్యాలుసర్వీసు నియమాలకు సంబంధించి ఏదైనాపథకాన్ని రూపొందించే అధికారాన్ని 2007లో సవరించిన రాష్ట్ర ఎండోమెంట్స్‌ చట్టంలోని144 సెక్షన్‌ ఎండోమెంట్స్‌ కమీషనర్కి ఇచ్చిందిఅలాంటి పథకం ఏదైనా ధార్మిక పరిషత్తుఆమోదిస్తేనే అమలు కావాలనీ అదే సెక్షన్‌ నిర్దేశించిందిదీనికింద టిటిడిలో అనువంశికఅర్చకత్వం నెరపుతున్న వారికి సంబంధించి ఒక పథకాన్ని అప్పటి ..వై.ఆర్‌.కృష్ణారావు తయారు చేశారుకమీషనర్‌ దానిని అంగీకరించారుధార్మిక పరిషత్తుఆమోదం తెలిపిందిఆనువంశిక అర్చకులకు రిటైర్మెంట్‌ ఉండదన్నది  పథకంలోని ఒకముఖ్యాంశమటఅన్నివిధాల తమకు అనుకూలంగా ఉండటం వల్ల పూర్వపు అర్చకమిరాసీదారులు  పథకానికి అంగీకారం తెలిపిఅంతకుముందు సుప్రీంకోర్టులో తామువేసిన దావాను కోర్టు అనుమతితో ఉపసంహరించుకున్నారు. మరి ఇలాంటి పరిస్థితిలో 65 ఏళ్ళు నిండిన అర్చకులు తప్పుకొని తీరాలంటూ బోర్డుఎవరికీ చెప్పా పెట్టకుండా మెరుపు వేగంతో చేసిన నిర్ణయం చట్ట పరీక్షకు నిలబడుతుందా ?
సెక్షన్‌144 లో పేర్కొన్న విధివిధానాలకు విరుద్ధంగా అర్చకుల సర్వీసు నియమాలనుఏకపక్షంగా మార్చే అధికారం బోర్డుకు ఉన్నదా ? అర్చకులకు సంబంధించిన పథకానికిఆమోద ముద్ర వేయవలసిన ధార్మిక పరిషత్తుకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అతీగతీ లేనప్పుడు బోర్డు చేసిన నిర్బంధ రిటైర్మెంటు నిర్ణయం ఎంతవరకు న్యాయబద్ధం?    
Image result for ramana deekshitulu

65 ఏళ్లు నిండిన అర్చకులు రిటైర్‌ కావాలన్న నిబంధన రాష్ట్రంలోని దేవాలయాల్లోముందునుంచీ ఉన్నమాట నిజంకాని దాన్ని ఒక విధానంగా కాకుండా అర్చకులమెడమీద కత్తిలా పెట్టితమ మాట విననిఆడించినట్టల్లా ఆడని అర్చకులనుసాగనంపడానికి మాత్రమే ఇష్టానుసారంగా అధికారులు ప్రయోగిస్తున్నారుతిరుమలలోకూడా 65 ఏళ్ళ రిటైర్మెంట్‌ నిబంధన ఎప్పటినుంచో అమల్లో ఉన్నదని అధికారులుదబాయిస్తున్నారు కదా ? మరి రమణ దీక్షితులకు 70 ఏళ్లు దాటినా ఇప్పటిదాకా అతడినిఎలా కొనసాగనిచ్చారు ? అతడికి 65 ఏళ్లు నిండాయన్న సంగతి ఇన్నేళ్లు లేటుగా ఇప్పుడేఎందుకు గుర్తుకొచ్చింది ?    అన్నమయ్య సినిమా షూటింగ్కు అనుమతి ఇవ్వవచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం టిటిడిబోర్డుకు ఉత్తరం రాయటమే దాని పరిధిని అతిక్రమించిన అధికార దుర్వినియోగంచట్టవిరుద్ధం అని హైకోర్టు మొట్టికాయ వేసింది కదాదేవస్థానంలో జరుగుతున్న అపచారాలగురించి ప్రధానార్చకుడు నోరెత్తినదే తడవుగా ..నుబోర్డు ఛైర్మన్నూ హుటాహుటినముఖ్యమంత్రి తన దగ్గరికి పిలిపించుకొని మంతనాలడటంఅతడి అభియోగాలన్నీఅబద్ధాలని ముఖ్యమంత్రే బహిరంగ యాగీ చెయ్యటం మాత్రం అధికార దుర్వినియోగంకాదాప్రధానార్చకుడు ఆగమ నియమాలకుకైంకర్యాలకుదేవుడి నగల భద్రతకుసంబంధించి లేవనెత్తిన అంశాలలో  విధమైన సంబంధం లేని టిటిడి సిబ్బందిని అతడిమీదికి ఉసికొలపటంవారి చేత నల్లబాడ్జిలు పెట్టించిఅమంగళ సూచకమైననలుపురంగును స్వామివారి దివ్యమంగళ సన్నిధిలో ప్రదర్శింపజేయటం ఆలయపవిత్రతకు భంగకరం కాదాఅసలు యజమాని అయిన వెంకటేశ్వరుడికి నడమంత్రపుపెత్తందారులు చేసినది తీవ్రాప్రచారమే కాదాప్రధానార్చకుడు అన్న కనీస గౌరం కూడాలేకుండా 'రమణ దీక్షితులును బొక్కలో వేసి నాలుగు తగిలించాలిఅని బాధ్యత గల రాష్ట్రమంత్రి చంద్రమోహన్రెడ్డి నోరు పారేసుకోవటం  రకమైన రాజకీయ సంస్కృతి ?    అలాగే.. పంచతంత్రం కథలో ఇనుమును ఎలుకలు తినేశాయని ఎవడో చెప్పినట్టునాణేలు విసిరితే వజ్రం పగిలిపోయిందని తి.తి.దేవరలు చెప్పటం ఎవరిని మోసగిద్దామని ? పింక్‌ డైమండ్‌ అనేదే లేదనిలేనిదాన్ని ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలమని అడుగుతున్న..సింఘాలుడు మైసూర్‌ మహారాజా సమర్పించిన 'రాజ్పింక్వజ్రం ఏమైందంటే ఏమిచెబుతాడు ?      హిందూ సమాజం ముక్తకంఠంతో కోరుతున్నట్టుసుబ్రహ్మణ్య స్వామి డిమాండుచేస్తున్నట్టు కోర్టు పర్యవేక్షణ కింద సిబిఐ ఎంక్వయిరీ జరిపిస్తే అన్ని విషయాలూ బయటపడతాయి కదా ? కేంద్రంలోని మోదీ సర్కారు సిబిఐని అడ్డంగా వాడేసుకుంటుందేమోనన్నభయానికీ ఆస్కారం ఉండదు కదా ? రాష్ట్రాన్నేలే వారికివారి తైనాతీలకుదాచిపుచ్చుకోవలసింది ఏమీ లేకపోతే సిబిఐ విచారణకు వెరపెందుకు ?    ఏడుకొండల స్వామి పవిత్ర దేవస్థానాలకు దుష్ట రాజకీయ గ్రహణంప్రభుత్వ పెత్తనపుపీడాకారం 
తొలగేదెప్పుడు ?

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments