రాణి పద్మావతి జీవిత చరిత్ర - Rani Padmavati story in telugu

megaminds
0
రాణి పద్మావతి జీవిత చరిత్ర

"రాణి పద్మావతి" యొక్క పరాక్రమ, యదార్ధ వాస్తవ చరిత్ర కథ భారతీయరాజుల ధర్మనీతి కి, అనకైత్య కారణంగా విదేశీయుల పాక్షింకంగా విజయం సాధించారు. సింహళ రాజ్య (శ్రీలంక ) రాజు సమ్మాన్ సింగ్ జి వారి కుమార్తె రాణి పద్మిని. పద్మావతి చాలా తెలివిగా, అందంగా ఉండేది, ఆమె అందం ఆకర్షణ, కేశ అలంకరణ విశ్వ వ్యాప్తి చెందింది. ఆమె తెలివి ధైర్యం కి ఎటువంటి హద్దులులేవు.

ఆమె వీర వనిత. మహా యోధురాలు, యుద్ధ నైపుణ్యరాలు. ఆమెతో ఎవరైతే యుద్ధం లో గెలుస్తారో వారితో వివాహం చేసుకుంటాను అని వారి నాన్న గారి తో చెపుతుంది. స్వయంవరం లో ఎంతో మంది రాజులతో యుద్ధం చేసింది కానీ ఆమె ను ఎవరు ఓడించలేదు. చివరకు రాణా రతన్ సింగ్ సమ వుజ్జిగా ఆమెతో నిలవడం తో వారి వివాహం జరిగింది.
 
మేవార్ రాజ్యంను రాణా రతన్ సింగ్ పాలించేవాడు. మేవార్ యొక్క కోట 7 వ శతాబ్దంలో నిర్మించిన శత్రు దుర్బేక్షమైన రక్షణ చితౌడ్ కోట. 700 ఎకరాల ఈ కోటను భయంకరమైన, దాడుల మరియు సుడిగాలుల నుండి కాపాడుట కోసం దృడంగా నిర్మించారు.

విదేశీ దురాక్రమణదారుడైన, అల్లాఉద్దీన్ ఖిల్జీ. తన తండ్రి మరియు మామయ్య జలాల్-ఉద్-దిన్ ఖిల్జీని హతమార్చి ఢిల్లీ పీఠం ను ఆక్రమించాడు, నవ యువకు ల తో ఖిల్జికి శారీరక సంబంధాలు కొనసాగించేవాడు. చారిత్రాత్మక ఆధారాల ప్రకారం, అతను తన నివాసం లో అనేక వేల మంది నవ యువకులను అతని వద్ద ఉంచుకున్నాడు. మాలిక్ కఫూర్ అనే ఒక అందమైన నపుంసకుడు ఉండేవాడు. గుజరాత్ దండయాత్ర సందర్భంగా ఖిల్జీ 1000 దీనార్లు చెలించి మాలిక్ కఫూర్ను కొనుగోలు చేశాడు. ఖిల్జీ యొక్క బలహీనతను సానుకూలంగా తీసుకొని, కఫూర్ ముఖ్య సలదారుగా అధికారం చెలాయించేవాడు. పూర్తి ప్రయోజనాన్ని పొందేవాడు. తన పుస్తకం తారిఖ్ -ఇ ఫిరుజ్ షాహిలో అల్లాఉద్దీన్ ఖిల్జీ మరియు మాలిక్ కఫూర్ల మధ్య శృంగార సంబంధం గురించి చరిత్ర కారుడు "జియాదుద్దీన్ బరనీ" ప్రస్తావించారు.

రాణి పద్మావతి అందాల గురించి ఖిల్జీ చాలా విన్నాడు. అతను రాణి కోసం తీవ్రమైన లైంగిక వాంఛలను పెంపొందింకున్నాడు మరియు ఆమె తన భార్యగా చే సుకోవాలని కోరుకున్నాడు. జనవరి 1303 లో అతను చితౌడ్ కోట సమీపంలో లక్షల భారీ సైన్యంతో కవాతు చేసాడు.  కోట చుట్టూ బలమైన రక్షణ ఏర్పాటు చూసి తన ఆత్మ స్థైర్యం సన్నగిలింది. ఖిల్జీ సైన్యం యొక్క బలాన్ని గుర్తిం చిన రాణా రతన్ సింగ్, యుద్ధాన్ని ఎలా నివారించాలో ఆలోచిస్తున్నాడు. ఒకసారి రాణి పద్మిని చూసి నేను (ఖిల్జీ) సైన్యంతో ఢిల్లీకి తిరిగి వెల్తానని, చితౌడ్ కోట కు అనుమతించి నట్లయితే అని ఒక దూతను పంపించాడు.
 
రాణి పద్మవతి చాలా తెలివి గలదు. రాణి పద్మావతి ఆలోచన చేసింది. ఖిల్జీ తన రూపం ను ప్రతిబింబం లో ( అద్దంలో ) మాత్రమే చూడగలిగిన ఒక నిబంధన ను పెట్టిఅంగీకరించింది. ఖిల్జీ ఆమె నిబంధనను ఒప్పుకున్నాడు. అతను తన విశ్వసనీయ సైన్యాధికారులతో వచ్చాడు. మహా అందమైన పద్మావతి యొక్క ప్రతిబింబంన్నీ చూస్తూ, ఖిల్జీ నిశ్చేష్టుడయ్యాడు. ఆమెని ఎలాగైనా పొందాలని కోరికను బలంగా పెంచుకున్నాడు.

రతన్ సింగ్ అతన్ని కోట యొక్క గేటు వరకు మర్యాదకు పూర్వకంగా వెళ్ళాడు ఖిల్జీ తన శిబిరానికి క్షేమంగా వెళ్ళాడు. (ఇక్కడ ధర్మనీతి చుడండి) . ఖిల్జీ కపటంగా, మోసంగా అధర్మాంగా, రతన్ సింగ్ ను ఖైదీగా చేసాడు. మరియు అతని శిబిరంలో ఖైదు గా బందించాడు. రాజుకు బదులుగా రాణి పద్మావతిని పంపించాలని ఆజ్ఞాపించాడు. చితౌడ్ కోటకు ఒక సందేశం పంపాడు. యుద్ధ నీతి తెలిసిన, ధైర్యవంతురాలైన చమత్కారమైన పద్మావతి ఒక ప్రణాళికను రూపొందించింది. ఆమె ఖిల్జీ కి ఒక వర్తమానం పంపారు, ఉదయం ఆమె శిబిరానికి పల్లకిలో వస్తాను అని కబురు పంపించింది. రాణి ఉదయం ఖిల్జీ యొక్క శిబిరానికి ఆయుధాలతో సహా పలువురు సైనికులతో పాటుగా గోర మరియు బాదల్ ను ఇద్దరు ప్రముఖ సైన్యాధికారుల తో బయలు దేరింది. (80 ఏళ్ల గోర, బాదల్, మరియు జలాల చౌహాన్ వంశీయుడికి చెందిన చచా-భాటియా ఉన్నారు).

(రాజస్థాన్ చరిత్రలో, వారి పేర్లు స్వర్ణ అక్షరాలలో రాయబడ్డాయి. పండిట్ నరేంద్ర మిశ్రా ఒక పద్యం ద్వారా గోర మరియు బాదల్ కు అద్భుతమైన నివాళి అర్పించారు ), సైనికు లు మహిళల మారువేషంలో, కొన్ని పల్లకి లలో కూర్చుని మిగిలిన 200 పల్లకి ల లో బోయవారు పాత్ర లో వెళ్లటం జరిగింది. ఈ శిబిరాన్ని చేరుకున్నప్పుడు, గోర స్వయంగా రతన్ సింగ్ గుడారానికి వెళ్లారు మరియు ఖిల్జీ సైన్యాన్ని నివారించటానికి మరియు రాజుని రక్షించడానికి బాదల్ ను కోరాడు.

ఖిల్జీ యొక్క గుడారం వద్ద గోర పల్లకిల డోరా ల ను తొలగించారు. గోరా ఖిల్జీ చంపడానికి వెళ్ళాడు, కానీ అతను అతనిని చంపడానికి విఫలమయ్యాడు. ఖిల్జీ ఒక పిరికిపందా తన ఉంపుడుగత్తె వెనుక దాక్కున్నాడు. భారతీయ యోధులు ఎప్పుడూ మహిళలపై దాడి చేయరు. (ఇక్కడ ధర్మనీతి చుడండి) ఖిల్జీ తప్పించుకున్నాడు. ఇంతలో, ఖిల్జీ సైన్యం అక్కడికి చేరుకుంది మరియు భీకర పోరాటం ప్రారంభమైంది. రాణ రతన్ సింగ్ రక్త పు మడుగులో ఉన్నాడు. రణ రతన్ సింగ్ ను రక్షించారు. గోర మరియు బాదల్ మరియు సైన్యం వారి జీవితాలను త్యాగం చేశారు. చితౌడ్ కోట కు కొద్దీ మంది సైన్యం తో చేరుకున్నారు.

ఖిల్జీ మరింత రెచ్చిపోయాడు, ఖిల్జీ అన్ని వైపులా చితౌడ్ కోటను ముట్టడి చేశాడు. అన్ని గేట్లు మూసివేయబడ్డాయి. ఇది ఆగస్టు వరకు కొనసాగింది (జనవరిలో ప్రారంభమైంది). నిల్వ చేయబడిన ఆహార పదార్థాలు పూర్తిగా క్షీణించబడ్డాయి. ఆగష్టు 26 న, 1303, రతన్ సింగ్ తన సైన్యంతో, కాషాయ తలపాగా లను ధరించి, శత్రువులపై ఆత్మ ఆహుతి దాడి చేసాడు. వారి లక్ష్యం కోటను రక్షించడానికి లేదా చనిపోవడం. తరువాత జరిగిన యుద్ధంలో, వారు అందరు వీర మరణం పొందారు. " రాణి పద్మావతి" యొక్క ఉత్తర్వుల ప్రకారం కోటలో భారీ చితి ని ఏర్పాటు చేసింది. రాణి పద్మావతి మరియు ఆమె సహచరులు, వారి ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి, క్రూరమైన శత్రువుల చేతుల్లో అగౌరవంగా ఉండకుండా, జౌహర్ ను ( సతి సహగమనం చేసుకున్నారు) ప్రదర్శిస్తూ, చితి లోకి ప్రవేశించారు. దాదాపు 75 వేల మంది రాజ్ పుత్ మహిళలు మంటల్లో మరణించారు.

ఖిల్జీ మరియు అతని దళాలు ఈ కోటలోకి ప్రవేశించాయి, ధైర్యంగల రాజపుత్రికల మృతదేహాలు యొక్క బూడిదతో మాత్రమే ఎదుర్కోవలసి వచ్చింది. జౌహర్( సతి సహగమనం చేసుకున్నారు) ప్రదర్శన, వారు మరణించారు కానీ వారు చరిత్ర మరియు జానపద లో అమరత్వం ఉంది. ఇది చరిత్ర. కుహనా లౌకిక వాదుల, వామ పక్ష మేధావులు, మెకాలే మానసపుత్రులు మేల్కొనాలి. "ఏ దేశమేగినా ఎందు కాలడిన పొగడరా ని తల్లి భూమి భారతి నిలపర ని జాతి నిండు గౌరవం".

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Megamindsindia

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top