చైనా వస్తువులపై మెగా మైండ్స్ అవగాహన - China products and awareness

megaminds
0
ప్రభుత్వమే చైనా వస్తువులు దేశంలోకి రాకుండా నిషేధించవచ్చు కదా?
        ప్రపంచ వాణిజ్య సంస్థతో చేసుకున్న ఒప్పందాలను బట్టి ప్రతీ దేశం తన ఉత్పత్తిని ప్రపంచ దేశాలలో అమ్ముకునే అధికారం కలిగి ఉంటుంది. ఆ విధంగా చైనా తన వస్తువులుని భారత్‌లో అమ్ముకునే అధికారం కలిగి ఉంటుంది. కావున ఆయా ఒప్పందాలు ఉన్నంతవరకూ ప్రభుత్వాలు, దేశంలోకి వచ్చే విదేశీ వ్యాపారాన్ని, వారి వస్తువులుని అడ్డుకునే అధికారం ఉండదు.

అందువలన ప్రజలు ఆయా విదేశీ వస్తువులను గుర్తించి కొనడం మానేసి, దేశంలో ప్రబలుతున్న విదేశీ వ్యాపార సంస్థలను వెనక్కి పంపవచ్చు. ఈ విధంగానే ప్రజలు స్వచ్ఛంధంగా చైనా వస్తువులు కొనడం మానేస్తే, దేశంలో చైనా వ్యాపారం చేసుకోలేదు.

చైనా వస్తువులు చవకగా లభిస్తాయి కాబట్టి కొంటున్నాము?
       వాస్తవానికి చైనా వస్తువులు చవకగా లభించవు. ఒక వేళ చవకగా లభించినా, అలా చవకగా లభించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
అవి:-
                 చైనాలో శ్రామిక శక్తి (Labor) అత్యంత చవకా లభిస్తుంది. ఇలా చవకగా లభించడానికి కారణం అంటే శ్రామికులకు చాలా తక్కువ మజూరీ ఇచ్చి వారిని దోచుకుంటారు. అందుకే వారు వస్తువులను చాలా చవకగా నిర్మాణం చేసుకోగలుగుతారు. శ్రామికులకు అధికారాలు, వారి బాగు కోసం చట్టాలు లేవు. ఉన్నా అవి వాటి ద్వారా శ్రామికుల అధికారాలు ఎంత మాత్రం కాపాడబడవు. ఫలితంగా చైనా వస్తువులు చాలా చవకగా నిర్మితమౌతుంటాయి.

                 చైనాలో బాలా శ్రామిక శక్తి (Child Labor) కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. బాలలు కూడా దోపిడీకి గురి అవుతారు. వారి అధికారాల కోసం చట్టలు ఉన్నా అవి పని చేయవు. చిన్న చిన్న పిల్లలో ఎంతో పెద్ద పెద్ద, కఠోరమైన పనులు చేసి వస్తు ఉత్పత్తిలో తోడ్పడుతుంటారు. కానీ వీరికి ఇచ్చే వేతనాలు, మజూరి అతి తక్కువగా ఉంటాయి. ఫలితంగా చైనా వస్తువులు చవకగా నిర్మితమౌతుంటాయి.

                  చైనా శ్రామికులు, బాల శ్రామికులే కాదు ఖైదీలు (Prisoners) కూడా ఆ దేశలో శ్రామికులకు మల్లే వాడబడతారు. వారి ద్వారా కూడా పెద్ద ఎత్తున వస్తు ఉత్పత్తి చేయబడుతుంది. వీరికి డబ్బు రూపంలో ఇచ్చే జీతం, వేతనం లేదా మజూరీ ఏమి ఉండదు. ఫలితంగా వస్తువులు చాలా చవకగా నిర్మాణం అవుతుంటాయి. శ్రామికులకు, బాల శ్రామికులకే సరఅయిన చట్టాలేనప్పుడు ఇంక ఖైదీల అధికార సంరక్షణ చట్టాలు ఉంటాయని, ఉన్నా అవి పని చేస్తాయని ఆశించడం కల్ల. ఫలితంగా చైనా వస్తువులు చాలా చవకగా నిర్మితమౌతుంటాయి.

                 చైనా తన దేశంలోని వస్తు ఉత్పత్తికి పెద్ద ఎత్తున రాయితీ (Subsidization) ఇస్తుంది. విద్యుత్త్‌లో, నీళ్ళు, గ్యాసు, ఇస్ఫాస్ట్రక్టర్ స్థాపనకి లాంటి అన్ని అవసరాలను ఎంతో తక్కువ ధరకి అందిస్తుంది. ఫలితంగా చైనా వస్తువులు చాలా చవకగా తయారౌతాయి.

                  చైనా తన దేశ విధ్యుత్ అవసరాలు తీర్చడానికి అణు విధ్యుత్ నిర్మాణం చేస్తోంది. ఫలితంగా విధ్యుత ధరలు 80 నుంద 90 శాతం వరకూ తగ్గుతాయి. ఈ విధంగా విధ్యుత ధర తగ్గడం వలన వస్తువులు ఉత్పత్త ధర కూడా తగ్గుతుంది.

                   ఇక్కడ గమనించ వలసినది ఏమిటంటే, ఈ విధంగా చైనా అణు విధ్యుత్ నిర్మాణం చేసుకుని తన దేశ విధ్యుత్ అవసరాలను తీర్చుకోవడంతో పాటు వస్తువులను తక్కువ ధరలకు నిర్మాణం చేసుకుంటుంటే, అదే రకమైన అణు విధ్యుత్ నిర్మాణం భారత ప్రభుత్వం భారత్ దేశంలో అణు విధ్యత్ నిర్మాణం చేద్దామనుకుంటుంటే దేశంలోని ఎఱ్ఱ మూకలు పర్యావరణ నాశనమైపోతుందని చెప్పి మన దేశంలో అణు విధ్యుత్ ఉత్పత్తిని అడ్డుకుంటున్నారు. ఇదీ వారి ద్వంద నీతి. ఈ విధంగా వారు చైనా కోసం ఒక నీతి, భారత్ కోసం మరొక నీతి పాటించడం ఎన్నో విషయాలలో గమనించవచ్చు.

                  వీటన్నింటికీ అతీతంగా చైనా, తన వస్తువులను భారత్ విపణిలో ఉత్పత్తి ధర కంటే కూడా తక్కువ ధరకి డంప్ చేస్తుంటుంది. ఈ విధంగా చైనా భారతీయ విపణిని తన చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ కారణం చేత కూడా చైనా వస్తువులు చవకగా దొరుకుతుంటాయి.

చైనా వస్తువుల నాణ్యత, మన్నికతో పాటు అందంగా ఉంటాయా?
                  చైనా వస్తువులు ఆకర్షణీయంగా ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఈ వస్తువులను ఇంత అందంగా, ఆకర్షణీయంగా, కొనుగోలుదారుడి అవసరాలకు అనుగుణంగా నిర్మాణం చేయడం చైనా ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది అనడంలో కూడా సందేహం లేదు. . వారు భారతీయ విపణిని చాలా లోతుగా అధ్యయనం చేస్తారు. దీనికి ఎంతో డబ్బును కూడా వెచ్చిస్తారు. కానీ ఈ విషయాలన్నీ వారి స్ట్రాటజీలో భాగంగా జరుగుతున్నాయి.

                  ఇంక చైనా వస్తువుల నాణ్యత, మన్నిక నిజానికి అవి చెపుతున్నంత శ్రేష్ఠమైనవిగా ఉండవనేది అందరి అనుభవము. కొన్ని వస్తువులు బాగుండి ఉండవచ్చు. అంత మాత్రం చేత చైనా వస్తువులన్నీ నాణ్యతతో పాటు చవకగా వస్తాయని అనడం సత్యదూరం.

                  పైగా భారత్‌లో అమ్ముడు పోయే ఎన్ని చైనా వస్తువులకు దేశంలోని వ్యాపారస్తులు బిల్లు ఇస్తున్నారు, ఆయా వస్తువులకు గ్యారంటీ ఇస్తున్నారని ఎవరినైనా అడిగితే బహుశా అలాంటి ఒక్క సందర్భాన్ని కూడా ఎవరూ చూపించలేన్నది అతి శయోక్తి కాదు.

ఈ ఒక్క విషయం చైనా వస్తువులకి నాణ్యాతా ప్రమాణాలనేవి లేవని స్పష్టంగా తెలియజేస్తుంది.

చైనా వస్తువులను గుర్తించడం ఎలా?
                   చైనా వస్తువుల పైన Made in China అని ఎలాగా రాసి ఉంటుంది. ఈ మధ్య ఇలా రాస్తే వినియోగదారుడు కొనడం లేదని Made in PRC అని ముద్రిస్తున్నారు. PRC అంటే People's Republic of China. ఇది కాకుండా ఎన్నో కంపెనీలు స్పష్టంగా చైనావని మనకి తెలుసు. ఉదా- Lenovo, Coolpad

బాగుందండి. మరి మాకు కావలసిన వస్తువులకు ప్రత్యామ్నాయం (Alternative) ఏమిటి?
                   నిజమే దేశంలో చాలా విదేశీ వస్తువులకి ప్రత్యామ్నాయం లేవు. కానీ ఉన్నంతలో వెతికితే ఎన్నింటికో అద్భుతమైన ప్రత్నామ్నాయం ఉన్నాయి.

భారత్ స్వామిమాన్ ట్రస్ట్‌వారు ఏది స్వదేశీ, ఏదీ విదేశీ అని ఒక పెద్ద సూచీని ఇచ్చారు. ఏది విదేశీ అని తెలుసుకునే బదులు, ఏది స్వదేశీ అని తెలుసుకుంటే సమస్య ఉండదు గదా!!

ఇక్కడ ప్రతీ ఒక్కరు గమనించవలసినది ఏమిటంటే, ఇవాళ విదేశీ అన్నది రేపు స్వదేశీ అవ్వవచ్చు. నిన్న స్వదేశీ అన్నది ఇవాళ విదేశీ అవ్వవచ్చు. ఈ విషయంలో ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండి ఏది విదేశీ, ఏది స్వదేశీ అని నిరంతరం తెలుసుకుంటుండూ ఉండాలి.

స్వదేశీ పాటించడం ఎన్నో రకాలుగా ఉండవచ్చు. దీపావళికి ఎన్నో విధ్యుత్ దీపాలు వెలిగిస్తాము. అందులో 95 శాతం చైనా దీపాలే ఉంటాయి. దానికి బదులుగా ఇంటి ముందు ఆవు నెయ్యతో రెండంటే రెండు దీపాలు వెలిగించి చాలు. ఆవు బ్రతుకుతుంది. పర్యావరణ కాపాడబడుతుంది. రైతు కాపాడబడతాడు. సైనికుడు కాపాడబడతాడు. దేశం కాపాడబడుతుంది.

మరొక ఉదాహరణ పుట్టిన రోజు చేసుకుంటాము. ఈ పేరుతో నీవు ఇంట్లోకి తెచ్చే వస్తువులలో 90 శాతం వస్తువులు చైనావే ఉంటాయి. పుట్టిన రోజుని చేసుకునే తీరుని మార్చుకోవచ్చుగదా. ఏమి చెయవచ్చు. ఒక ఆవుని దత్త తీసుకోవచ్చు. దాని ఆలనా పాలనా చూడవచ్చు. లేదా చెట్టుని దత్తత తీసుకోవచ్చు. ఒక పాఠశాలలో ఒక విద్యార్థి ఫీచు కట్టవచ్చు. లేదా స్వదేశీ వస్తువులు కొనవచ్చు.

ఇలా ఎన్ని రకాలగైనైనా ఆలోచించి ఎన్నో ప్రత్యామ్నాయాలను మనకి మనంగా కనుగొని ఆచరించవచ్చు.

స్వదేశీ అంటే దేశాన్ని రక్షించుకోవడమే. అది మన అందిరి భాధ్యత కూడా.

అంతిమంగా మనం ఖర్చు చేసే ప్రతీ రూపాయి దేశంలోనే ఉండాలి. అది చైనా వస్తువులు కొనడం ద్వారా చైనా వెళ్ళిందా, ఆ డబ్బు, డబ్బు రూపంలో, అశ్త్ర-శస్త్రాల రూపంలో పాకీస్తాన్ చేరుతుంది. ఉగ్రవాద తండాల శక్తి పెరుగుతుంది. ఆ ఉగ్రమూకలు, చైనా అందించిన అశ్త్ర-శస్త్రాలతో, దేశ పొలిమేరలను కాపలా కాస్తున్న సైనికుడైన నా అన్ననో, లేదా నీ తమ్ముడోనో చంపబడతాడు...

కాబట్టి స్వదేశీతో దేశం సుఖ సంతోషాలను సాధించగలదు...

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Megamindsindia

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top