శాంతంగా ఉండటంలో హిందువులు గౌతమబుద్ధులు, రౌద్రంలో వీరభద్రులు రెచ్చగొట్టకు అన్యాయమైపోతావ్!

megaminds
0
ఇప్పుడు మీడియా కెమేరాల ముందు హడావిడి చేసేవాళ్ళూ, పత్రికల్లో విషపు రాతలు రాసి పేరు తెచ్చుకుంటున్నవాళ్ళూ అసలు సమాజంలో కొస్తే ఎంతటి అనామకులంటే వీళ్ళ పక్కింటి వాళ్ళకే వీళ్ళెవరో తెలియదు  నిజం!. ఈ అయిదు ఖండాల భూమి మీద అంగుళం మేరలో కూడా దోపిడీ అనేది లేని ప్రపంచాన్ని సృష్టించే మహదాశయంతో ఉర్రూతలూగిపోతూ ఎప్పుడో స్థాపించబోయే వర్గరహిత సమాజం గురించి చింకి లెక్చర్లు దంచుతూ యూనివర్సిటీ సెమినారు హాళ్ళలో చప్పట్లు మోతలు మోగించేవాళ్ళు తమ వీధిలో ఉన్న రేషన్ షాపులో జరుగుతున్న చిన్నపాటి దోపిడీని కూడా అరికట్ట లేకపోతున్నారు, ఎందుకని? సిద్ధాంత బలం లేకనా, మంది చాలకనా, వాళ్ళ వీధివాళ్లకి వర్గరహిత సమాజం అక్కర్లేకనా, వీళ్ళకి వర్గరహిత సమాజం స్థాపించేటందుకు తగినంత వూపు రాకనా ముహూర్తం బాలేకనా!

మనం బలానికి బూస్టూ వయాగ్రా వాడినట్టు వీళ్ళకి వూపు రావాలంటే ఎరుపు కనబడుతూ ఉండాలేమో! అందుకే ఇలా జనాన్ని విడదీసి ఒకడి మీదకి మరొకణ్ణి ఎగదోసి రక్తపుటేరులు పారిస్తున్నట్టున్నారు. ఇద్దరు సఖ్యంగా ఉన్నవాళ్లని విడదియ్యాలంటే ఏం చెయ్యాలి ఇద్దర్లో దద్దమ్మ ఎవడో కనిపెట్టి, మెల్లగా వాణ్ణి బుట్టలో వేసుకుని, రెండోవాడి మీద అబద్ధాలు చెప్పి నమ్మించాలి! అది చాలు విన్నవాడు అవతలివాడు తనకి చేసిన ద్రోహానికి ప్రతీకారంగా చేస్తున్నట్టు తనని తనే జస్టిఫై చేసుకుంటూ అవతలి వాడిమీద దాడి చెయ్యటానికి! వాళ్లలో ఎవడు గెలిచినా పర్లేదు వీళ్ళకి, వీళ్ళు సృష్టించిన రెండు వర్గాల్లో ఒక వర్గం పూర్తిగా నశించిపోతే ఇంక అక్కడ మిగిలింది వర్గరహిత సమాజమేగా!

వీళ్ళు ఒక వైపున దళితులకి చెవుల్లో పువ్వులు పెట్టటానికి అంబేద్కరునీ ఆయన రాసిన రాజ్యాంగాన్ని తెగ పొగిడేస్తుంటారు, ఇంకోవైపున ఆ రాజ్యాంగాన్ని ధిక్కరించే ఉగ్రవాదుల్ని పోగడనిస్తేనే వాక్ స్వాతంత్ర్యం అవుతుందని లాజిక్కులు లాగుతుంటారు. ఒక కమ్యునిష్టు నాయకుడి కూతురు రాజ్యాంగాన్ని ధిక్కరించిన చోటికి వెళ్ళీనా వీడియోలో కనబడినా వూరికే వెళ్ళిందే తప్ప తను తిట్టలేదుగా అని సమర్ధించుకుంటున్నారు. కాంగ్రెసుతో అంత గాఠ్ఠిగా సావాసం చేసి సిగ్గు పడటం మర్చిపోయినట్టున్నారు! అక్కడ ఈ దేశపు రాజ్యాంగానికి అవమానం జరుగుతుంది అని తెలిసి కూడా వెళ్ళడం రాజ్యాంగాన్ని ధిక్కరించటం కాదు గాబోలు - ఏమి పాండిత్యం? రాజ్యాంగాన్ని పొగుడుతూనే దాన్ని ధిక్కరించటాన్నీ పొగడుతూన్నా వాళ్ళకి వాళ్ళు కనబడకపోవటం వింతగా ఉంది.

వాళ్లేమి కోరుకుంటూన్నారో స్పష్టంగానే తెలుస్తున్నది! టెర్రరిస్టుల్ని అమరవీరులుగా చిత్రించటానికీ, ఇంటికో టెర్రరిష్టుని పుట్టించమని దేశంలోని తల్లిదండ్రులకి విజ్ఞప్తుల్ని చెయ్యనివ్వటానికీ, ఈ దేశాన్ని ముక్కలు చెయ్యండని విదేశీయుల్ని ఆహ్వానించడానికీ అనుమతిస్తేనే అది నిజమైన భావస్వాతంత్ర్యమని వారి ఉద్దేశం, అంతేనా? వాళ్ళు భావస్వాతంత్ర్యాన్నే కోరుకున్నారు గాబట్టి అందులో తప్పేమీ లేదని కొందరు గోడమీది పిల్ల్లులు వాదించదలుచుకుంటే వాళ్ళకి కూడా కలిపి ఈ మేధావులకి ఒక సూటి ప్రశ్న వేస్తున్నాము. ఏ విధమయిన అనుమానమూ లేకుండా వాళ్ళు ఉగ్రవాదులని మీకు తెలుసు వాళ్ళు ఈ దేశాన్ని విచ్చిన్నం చెయ్యాలని దొంగతనంగా సరిహద్దులు దాటి వచ్చి ఈ దేశప్రజల్లో కొందర్ని హతమార్చడమూ మీకు తెలుసు. అయినా సరే, భావస్వాతంత్ర్యం పేరుతోనూ, మరొక రకం తిక్క విశ్లేషణ తోనూ ఇవ్వాళ ఒక ఉగ్రవాదిని నువ్వు అమరవీరుణ్ణి చేసి పొగిడితే రేపు పదిమంది పుట్టరా? నీ చేతల మూలంగానే ఇవ్వాళ్టి రోజున ఉగ్రవాదానికి నువ్వు సపోర్టు ఇస్తూ మళ్ళీ రేపటి రోజున ప్రభుత్వాన్ని ఉగ్రవాదాన్ని నిరోధించడంలో విఫలమైందని విమర్శిస్తావు నువ్వు నోటికి తింటున్నది అన్నమా, గడ్డియా, మరొకటా?

అమాయకంగా జాతీయత అంటే ఏమిటి అని అడుగుతుంటారు.మహాశయా మెలికలు పెట్టలేనంత గట్టి నిర్వచనాలు మేం చెప్పలేము గానీ నీ దేశప్రజల మీదకి నువ్వే ఉగ్రవాదుల్ని ఉసిగొలిపే వికృతమైన స్వేచ్చని కోరుకెవటం మాత్రం కాదు! మీడియా ముందు గంతులు వేసి పాప్యులారిటీ తెచ్చుకోవటం వరకూ సాగిననతకాలం సాగించుకోండి మీకూ భుక్తి గడవాలిగా! కానీ క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉన్న సమైక్యతని మాత్రం చెదరగొట్టకండి. ఒకసారి అక్కడ పునాది కదిలి దేవుళ్ళు దెయ్యాలుగా మారితే అసలు మీరు క్షమంగానే ఉండరు, మీ స్వార్ధ రాజకీయాల మాట దేవుడెరుగు!

దేశవిభజన నాటీ రక్తనదీప్రవాహాల తర్వాత కూడా ఈ దేశప్రజలు సమైక్యతనే కాంక్షించారు, దశాబ్దాని కొకసారి వ్యూహాలు పన్ని మీరు రగిలించిన విద్వేషాగ్నుల తర్వాత కూడా ఈ దేశప్రజలు స్నేహసౌభ్రాతృత్వాలనే కోరుకున్నారు. అయోధ్యలో మసీదు కూల్చడం హిందువుల కుట్ర, దానికి ప్రతీకారం తీర్చుకుంటున్నాం అని చెప్పి ఎన్నిచోట్ల బాంబుల్ని పేల్చినా తిన్ననైన ముస్లిములు ఎవరూ వాటిని నమ్మి మీవైపుకి రావడం లేదు! ఈసారి మళ్ళీ అలాంటి వ్యూహం పన్నితే అది మీకు అంతిమవ్యూహం అవుతుంది మీ చేతులతో మీకు మరణశాసనం రాసుకోవద్దు! పిల్లి శాపాలకు ఉట్లు తెగవు, మీరు గత్తర చేసినంత మాత్రాన భారత్ ఖాజీ సాయెబుగారు పోయి తురకల్లో గల్సాడన్నట్టు రేపెప్పుడో హిందూరాజ్యం అవ్వదు నూటికి 80% వాళ్ళే గనక ఇప్పటికే ఇది హిందువుల రాజ్యమే!

రాజకీయ, సామాజిక, ఆర్ధిక కోణాలలో ఎన్నివైపుల నుంచి పరిశీలించినా నిజమైన హిందువు ఎవడూ కులం పేరున గానీ మతం పేరున గానీ ఈ దేశ ప్రజలని విడగొట్టడు. ఆ అవసరం యే హిందువుకీ లేదు!క నీసం కామన్ సెన్సుతో ఆలోచించినా అలా విదగొట్టడంలో ఉన్న ప్రమాదం గురించి తెలుసుకోవచ్చు. ప్రజల్ని తన సమర్ధతతో మెప్పించి రాజమార్గం ద్వారా గాక కుట్రలు, మోసాలు, జరుగుబాట్లు, తిరుగుబాట్లతో నిండిన వక్రమార్గం ద్వారా అధికార పీఠానికి ఎగబాకే ఉద్దేశం ఉన్నవళ్ళు మాత్రమే అలా ప్రజల్ని గ్రూపులుగా విదగొడతారు. ఆ ప్రజల్ని గ్రూపులుగా విడగొట్టాలిన్స్ అవసరం ఇవ్వాళ కాంగ్రెసుకీ, కమ్యునిష్టులకీ ఎక్కువగా ఉంది, భాజపాకి తక్కువగా ఉంది

అధికారంలో ఉన్న భాజపాకి తన అధికారం సుస్థిరం కావాలంటే హిందువుల్ని మరింతగా సంగహ్టితం చెయ్యడం తప్ప మరో మార్గం లేదు. పోగొట్టుకున్న అధికారన్ని తిరిగి దక్కించుకోవాలంటే కాంగ్రెసుకి హిందువుల్ని విడగొట్టటమూ, విశాల హందూ సమైక్యతకి అవరోధాల్ని సృష్టించడమూ తప్ప మరో మార్గం లేదు. కాబట్టి వైరివర్గాలు రెండూ ముసుగులు విప్పి కలహించుకుంటున్నాయి అది స్పష్టం!వీ రికి తొలి కబళాలుగా విశ్వవిద్యాలయ విద్యార్ధులు దొరికారు. దేశంలోని అన్ని ప్రముఖ రాజకీయపక్షాలూ విశ్వవిద్యాలయాల్ని రంగస్థలాలుగా చేసుకుని ఆడుతున్న ఈ ప్రచ్చన్న చదరంగం ఇతర రంగాలలోకి కూడా పాకకముందే మేల్కొని ఈ ధోరణుల్ని కట్టడి చెయ్యకపోతే చరిత్ర మధ్యయుగాల నాటి యుద్ధాలని మళ్ళీ మన కళ్ళముందు నిలబెడుతుంది!.

ఈ తరం భౌతికంగా క్రీ.శ 2023లో ఉన్నప్పటికీ భావజాల సంఘర్షణ పరంగా కాలం కొన్ని శతాబ్దాలు వెనక్కి నడిచి తొలినాటి వీదేశె దండయాత్రల కాలంలో నిలబడి ఉంది. ప్రజలెప్పుడూ ఒక రకంగానే ఉన్నారు. ఇక్కడి ప్రజలు మహావృక్షాలు కారు, పచ్చిక బయళ్ళ వంటివారు. ప్రకృతిని గౌరవించి వినయంతో ఒదిగిఉండి పచ్చగా బతకడమే వారికి తెలుసు. ఎవరైనా తమ పాదాల కింద అణిచివెయ్యాలని చూస్తే పాదం ఒత్తిడి  ఉన్నంతసేపు లొంగినట్టు కనిపించినా ఒత్తిడి పోగానే మళ్ళీ శిరసెత్తి నిలబడతారు! మహమ్మదీయులు ఈ దేశం మీద దాడి చేసిన ప్రతిసారి సంపద మాత్రమే కొల్లగొట్టలేదు, కసిగా ఆలయాల్ని ధ్వంసం చేసిపోయేవాళ్ళు! వాళ్ళటు వెళ్ళగానే తమ ఆలయాల్ని మళ్ళీ కట్టుకునేవాళ్ళు తప్ప వాళ్ళు కట్టి పోయిన మసీదుల్ని మాత్రం వీళ్ళు కూల్చేవాళ్ళు కాదు! పాత్రలు, పాత్రధారులు, సన్నివేశాలు, సంవిధానాలు, వ్యూహాలు, ఆర్భాటాలు అన్నింటితోనూ సరిగ్గా ఆనాటి దృశ్యమే ఈనాడు కూడా కనబడుతున్నది.

ప్రజల్ని విడగొట్టాలని అనుకున్నవాడికి ఒకటే ఆయుధం  ఆధారాలు లేకపోయినా అబద్ధాల్ని ప్రచారం చెయ్యటం, వాళ్ళు చెప్పింది చెప్పినట్టు నమ్మనివాణ్ణి హిందూ ఫాసిస్టులని తిట్టటం! ప్రజల్ని కలపాలని అనుకున్నవాడికి ఒకటే ఆయుధం ఆధారాలతో సహా నిజాల్ని విప్పిచెప్పటం! హిందువులు ఎంతోకాలం స్తబ్దంగా ఉండలేరు, వీళ్ళు ఉండనివ్వరు, ఉండకూడదు కూడాను! శాంతంగా ఉండటంలో హిందువులు గౌతమబుద్ధులు, రౌద్రంలో వీరభద్రులు రెచ్చగొట్టకు అన్యాయమైపోతావ్! -హరిబాబు సూరనేని, మెగామైండ్స్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.


At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top