భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక అమెరికన్ అతనే సత్యానంద్ స్టోక్స్ - American Fought For India's Independence

megaminds
0


ఈ దేశంలో పుట్టి ఒకప్పటి హిందువుల సంతానమైన జిన్నా, లియాకత్ అలీలు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి దేశాన్ని ముక్కలు చేశారు. కానీ ఈ దేశం అఖండంగా ఉండాలని సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని కోరుకున్నారు కొంతమంది విదేశీయులు వారిలో ఒకరు శామ్యూల్ ఎవాన్స్ స్టోక్స్. అమెరికాలో పుట్టి ఈ భారతభూమి కి సేవలందించిన మహనీయుడు స్టోక్స్.

ఆగష్టు 16, 1882న, ఫిలడెల్ఫియాలోని ఒక ప్రముఖ, సంపన్నమైన క్వేకర్ కుటుంబంలో జన్మించిన స్టోక్స్, 22 సంవత్సరాల వయస్సులో, 1904లో సిమ్లా కొండల్లో ఒక కుష్ఠురోగి ఆశ్రమంలో సేవ చేయడానికి భారతదేశానికి వచ్చారు. స్టోక్స్ యొక్క మెంటర్ డాక్టర్ కార్లెటన్ అతని సేవ కి సంతృప్తి చెందాడు. అతనికి కొన్ని ప్రాథమిక శస్త్రచికిత్సా విధానాలను అప్పగించాడు. రోగులకు మానసికంగా చేరువ కావడంలో స్థానిక భాష మాట్లాడటంలో పట్టు సాధించాడు స్టోక్స్.

ఆ వేసవిలో డాక్టర్ కార్లెటన్ అతన్ని హిందుస్థాన్ టిబెట్ రోడ్డులో సిమ్లా దాటి 50 మైళ్ల దూరంలో ఉన్న కోట్‌ఘర్‌కు పంపారు. మోటారు రోడ్డు లేనందున స్టోక్స్ కోట్‌ఘర్‌కు నడిచివెళ్ళారు. ఇది ఆకర్షణీయమైన గ్రామాల సమూహం రుడ్‌యార్డ్ కిప్లింగ్ చేత "మిస్ట్రెస్ ఆఫ్ ది నార్తర్న్ హిల్స్"గా గుర్తింపును పొందింది. కోట్‌ఘర్ ను తన జీవితకాల నివాసంగా కర్మభూమిగా మార్చుకున్నారు స్టోక్స్.

స్టోక్స్ బహుముఖ  ప్రజ్ఞాశాలి తను సిమ్లా లో కుష్టురోగులకు సేవచేసుకుంటూ అక్కడి కార్మికులతో మంచి సంబంధాలు కొనసాగించాడు. సుభతు కోటఘర్ ప్రాంతాలలోని పిల్లలకు, అంటరాని వారికి చదువుచెప్పారు. చలివాతావరణం ఆపిల్ పండ్లకి మంచి స్థానమని గ్రహించి అమెరికాకు సంభందించిన రెడ్ డెలిషియస్ ఆపిల్ ని భారత్ సిమ్లా  లో పండించే విధంగా ఎన్నో పథకాలు రచించి మనకు సిమ్లా ఆపిల్ ని అందించారు.  ఈ రోజు  ప్రపంచ వ్యాప్తంగా ఆపిల్ ని ఎగుమతి చేస్తున్నాము.

స్టోక్స్ భారత్ బ్రిటీష్ వారి భానిసత్వం నుండి విముక్తి పొందాలని ఆశించాడు. 1920 లో  భారత స్వాతంత్ర్య పోరాటం దేశ వ్యాప్తంగా ఉదృతంగా జరుగుతుంది. ఆ సమయంలో హిమాలయ ప్రాంత ప్రజల్ని స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనే విధంగా చైతన్య పరచాడు. 

1920 డిసెంబరు లో నాగ్‌పూర్‌లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశానికి స్టోక్స్ కోట్‌ఘర్ నుండి ప్రతినిధిగా వెళ్ళారు, ఈ ప్రత్యేక గుర్తింపు పొందిన ఏకైక అమెరికన్. 1921లో కాంగ్రెస్ మేనిఫెస్టోపై సంతకం చేసిన ఏకైక విదేశీయుడు, భారతీయులు ప్రభుత్వ సేవలను వదులుకుని స్వాతంత్ర్య ఉద్యమంలో చేరాలని పిలుపునిచ్చారు. 

1921లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారత్ సందర్శించాల్సి ఉండగా, బ్రిటీష్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ మరియు కాంగ్రెస్ పార్టీ సహజంగానే వ్యతిరేకించాయి. పంజాబ్ ప్రావిన్షియల్ కాంగ్రెస్ కమిటీ (PPCC) సమావేశం డిసెంబర్ 3 మధ్యాహ్నం జరగాల్సి ఉంది. స్టోక్స్ సమావేశానికి హాజరయ్యేందుకు లాహోర్‌కు వెళుతుండగా, వాఘా వద్ద అరెస్టయ్యాడు. అతనిపై ఉన్న అభియోగం రాజద్రోహం మరియు హిజ్ మెజెస్టి సబ్జెక్ట్‌లలోని వివిధ తరగతుల మధ్య ద్వేషాన్ని ప్రోత్సహించడం. స్టోక్స్‌కు బెయిల్‌ను ఇస్తామన్నప్పటికీ అతను దానిని తిరస్కరించాడు. ఆ మధ్యాహ్నానికి, లజపత్ రాయ్, గోపీ చంద్, సంతాన సహా పీపీసీసీలోని చాలా మంది కీలక సభ్యులు అరెస్టయ్యారు. యంగ్ ఇండియా పత్రికలో మొదటి పేజీ కథనంలో గాంధీ స్టోక్స్ అరెస్టును "ప్రభుత్వం యొక్క ప్రత్యేక చర్య" అని పేర్కొన్నారు. అతనిపై విచారణ జరిగింది మరియు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించబడింది. యునైటెడ్ స్టేట్స్‌ ఫిలడెల్ఫియా లెడ్జర్, ది న్యూ యార్క్ టైమ్స్ మరియు అనేక ఇతర వార్తాపత్రికలలో స్టోక్స్ అరెస్ట్ వార్త ప్రధాన శీర్షికగా వచ్చింది.

ఆ తరువాత స్టోక్స్ జీవితంలో అనేకమైన సంఘటనలు జరిగాయి, నిజం చెప్పాలంటే స్టోక్స్ ఒక క్రైస్తవ మిషనరీ సంస్థ ద్వారా సేవచేస్తూ ఇక్కడ మతకార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చాడు ఎలాగంటే థెరిస్సా లా కానీ స్టోక్స్ విషయంలో అలా జరగలేదు. ఇక్కడ ఉన్న గొప్ప సంస్కృతికిని అనుభూతి చెందాడు 1932లో స్టోక్స్ సత్యానంద్ గా మారాడు, తన జీవితాన్ని భారతదేశానికి అంకితం చేయాలనుకున్నాడు తన భార్య ప్రియదేవి స్టొక్స్ (born Agnes Benjamin) కూడా అందుకు ఒప్పుకుంది. హిందూ తత్వశాస్త్రంపై ఆసక్తిని పెంచింది స్టోక్స్ సనాతన హిందుత్వాన్ని సాధన చేశాడు, తన కుటుంబం మొత్తం హిందుత్వాన్ని ఆమోదించింది. ఎంతో మందిని క్రైస్తవంలోకి వెళ్ళకుండా అడ్డుకున్నాడు. ఒక్కోసారి బ్రిటీషర్స్ తో తగాదాలు జరిగేవి.

గొప్ప నాయకుడు, సంఘ సంస్కర్త అనారోగ్యంతో మే 14, 1946న సిమ్లాలో మరణించారు. భారతదేశ అగ్రనేతలు అందరూ స్టొక్స్ దహనసంస్కారాల్లో పాల్గొన్నారు. బాధించే విషయం ఏమిటంటే ఈ దేశంతో ఎటువంటి సంబంధం లేకపోయినా ఈదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఒక అమెరికన్ ని స్వాతంత్ర్యం వచ్చాక భారత ప్రభుత్వం మరచిపోయింది.

1999 లో స్టోక్స్ మనుమరాలు ఆశా శర్మ ఒక పుస్తకం An American in Gandhi’s India వ్రాయడం ద్వార స్టొక్స్ జీవితం వెలుగులోకి వచ్చింది. ఈ పుస్తకానికి దలైలామా ముందుమాట వ్రాశారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని స్మరించుకోవడం మన బాధ్యత. జై హింద్.


At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top