Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

విభూతి ఎందుకు ధరించాలి? ఏ వేళ్లతో భస్మధారణ చేయాలి - Importance of Vibhuti

విభూతి హైందవ సంప్రదాయంలో అత్యంత విశిష్టత కలిగినది. విభూతిని భస్మ అని త్రయంబకం అని కూడా అంటారు. దీని ధారణ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని పలు శా...

విభూతి హైందవ సంప్రదాయంలో అత్యంత విశిష్టత కలిగినది. విభూతిని భస్మ అని త్రయంబకం అని కూడా అంటారు. దీని ధారణ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని పలు శాస్ర్తాలు, పురాణాలు తెలియజేస్తున్నాయి. భస్మధారణ శైవం, వైష్ణవం కాదు. ఇది వైదిక సంస్కారం. ప్రసిద్ధ గురువాయుర్లో స్మార్త సంప్రదాయంలో విష్ణుపూజ చేసేవారు నేటికి భస్మధారణ చేసి శ్రీకృష్ణున్ని పూజిస్తారు. నారాయణబట్టీయం రాసిన నారాయణభట్టాద్రి కూడా భస్మధారణ చేసేవారు. అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శంకరాచార్యులు భస్మధారణ చేసేవారు. ఆయన సిద్ధాంతం ప్రకారం ఉన్నదొక్కటే. విష్ణుసహస్రనామానికి భాష్యం చెప్పిన పరమ వైష్ణవ భక్తుడు శంకరులు. కానీ భస్మధారణ వేద సంప్రదాయం కాబట్టి దాన్ని ధరించారని పెద్దలు చెబుతారు. ఇలా ప్రాచీనకాలంలో అందరూ త్రిపుండ్రాన్ని ధరించేవారు. భస్మం ధరించని ముఖం ఛీ అని వ్యాసభగవానుడు అన్నారు. దేవతలు కూడా భస్మం ధరించారని పురాణాల్లో స్పష్టంగా ఉంది. పద్మపురాణం ప్రకారం శ్రీరామచంద్రుడు అగస్త్యముని దగ్గర లలితాదీక్ష తీసుకొని భస్మధారణ చేసి శివారాధన చేసినట్లు పేర్కొంది. ఇక భారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపమన్యుడు దగ్గర శివదీక్ష తీసుకొని భస్మం పెట్టుకొని శివారాధన చేసినట్లు మనకు స్పష్టంగా తెలుస్తున్నది.

విభూతి ఎలా తయారు చేస్తారు?
ఆవుపేడను ఎండబెట్టి రుద్ర, చండీహోమాల్లో హవనం చేస్తారు. వాటి నుంచి వచ్చిన భస్మాన్ని శుద్ధిచేసి భస్మంగా ఉపయోగిస్తారు. మరికొన్నిచోట్ల ఆవుపేడను ఎండబెట్టి కాల్చి దానికి మరికొన్ని సుగంధ పదార్థాలను చేర్చి భస్మ ఉండలను తయారుచేసి పెట్టుకొంటారు. మంచి భస్మం తేలికగా ఉంటుంది. ఉండలు తేలికగా ఉన్నప్పటికీ పగలగొట్టాలంటే మాత్రం గట్టిగా ఉంటాయి. అదే కల్తీలేని భస్మానికి పరీక్షగా చెప్పుకోవచ్చు.

ఏ వేళ్లతో భస్మధారణ చేయాలి?
మృగ ముద్రతో భస్మధారణ చేయాలి. అంటే చూపుడువేలుతో భస్మం పెట్టుకోరాదు. మృగముద్ర అంటే బొటనవేలు, మధ్యవేలు, అనామిక (ఉంగరపు) వేలుతో పెట్టుకోవాలి. భస్మాన్ని ధరించేటప్పుడు ముందుగా అంగుష్ఠము (బొటనవేలు)తో ఊర్ధపుండ్రము (నామం)ను నిలువుగా ధరించిన పిమ్మట మధ్యమ, అనామిక వేళ్లతో ఎడమ నుంచి కుడివైపునకు రెండు రేఖలను ధరించి, బొటన వేలుతో కుడి నుంచి ఎడమ లేదా ఎడమ నుంచి కుడివైపునకు మూడవ భస్మరేఖను ధరించాలి. ఈ రేఖలు అతిచిన్నవిగానీ, అతి పొడవుగా గానీ ఉండకూడదు. నేత్రయుగ్మ ప్రమాణముగా అనగా రెండు కనుల చివరి భాగమును దాటి పోకుండా నుదురు భాగంలో భస్మాన్ని ధరించాలి.

"భస్మము" ఔషధగుణాలని కలిగి ఉంది. ఇది ఎన్నో ఆయుర్వేద మందులలో వాడ బడుతుంది. ఇది శరీరములోని అధిక శీతలతను పీల్చుకొంటుంది. జలుబు, తలనొప్పులు రాకుండా కాపాడుతుంది . భస్మాన్ని నుదుట ధరించేటప్పుడు మృత్యుంజయ మంత్రము చెప్పాలని ఉపనిషత్తులు చెపుతున్నాయి .
త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాత్ మ్రుత్యోర్ముక్షీయ మామృతాత్

ఏ వేళ్లతో భస్మధారణ చేయాలి

No comments