Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మోడీ పాలనలో మజా లేదు - megamindsindia

#మోడీ పాలనలో మజా లేదు....!! *************************** #మన్మోహన్ గద్దెనెక్కే నాటికి 32/- ఉన్న పెట్రోల్ రేటు దిగిపోయే నాటికి 75/- కు చే...

#మోడీ పాలనలో మజా లేదు....!!
***************************
#మన్మోహన్ గద్దెనెక్కే నాటికి 32/- ఉన్న పెట్రోల్ రేటు దిగిపోయే నాటికి 75/- కు చేరింది., మధ్యలో ఒకసారి 83.60/- కూడా టచ్ అయింది..
ఈ #మోడీగారి పాలనేంటి....??
గద్దెనెక్కే నాటికి 75/- ఉన్న పెట్రోలును 69/- కి తీసుకొచ్చారు..
కింద #గూటం పెట్టించుకోవడానికి గత 70 ఏళ్ళుగా అలవాటు పడిన ఈదేశ ప్రజలకు మోడీ పాలన #మజా_కిక్ ఇవ్వడం లేదు..
అంతేకాదు ఎప్పుడూ ఏదో ఒక #కుంభకోణానికి సంబంధించిన వార్తలు వినడానికి, చదవడానికి చెవులూ కళ్ళూ అలవాటు పడిపోయాయి.. వాటికీ మజా లేదు..

సరిహద్దుల్లో.. "కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించిన పాకిస్థాన్; ముగ్గురు భారత సైనికులు మ్రృతి.." వంటి వార్తలు అసలే వినిపించడం లేదు..
మనిషి ఇంట్లోనుంచి బయటికెళ్ళి సాయంకాలం హాయిగా తిరిగొస్తున్నాడు.. ఇంతకుముందు ఎక్కడ #బాంబు పేలుతుందో, శరీరాలు తునాతునకలై ఎక్కడ పడిపోతాయో అనే ఆలోచనతో ఒళ్ళు దగ్గరపెట్టుకుని బ్రతికేవాడు.. బస్సులో/ట్రైనులో కూర్చునేముందు సీటు కింద ప్రక్కన పదిసార్లు చెక్ చేసుకునేవారు..
నిత్యం బస్టాండుల్లో రైల్వే స్టేషన్లలో అనుమానితులకు సంబంధించి ఒకటే ప్రకటనలు.. ఇప్పుడవేవీ లేకుండా మజా లేకుండా పోయింది....
అందుకే మోడీ పాలన చప్పగా ఉన్నది..
#పప్పుదినుశులను ముట్టుకోవాలంటేనే భయమేసేది..
కందిపప్పు/మినప్పప్పు/శనగపప్పు.. అలా ఏ పప్పు ముట్టుకున్నా ముక్కుపిండి 180-200/- వసూలు చేసేవారు.. ఇప్పుడవన్నీ 60-70/- లకే దొరుకుతున్నాయి..
#సెల్‌ఫోన్ రీఛార్జి చేయాలంటే భయమేసేది..
మరీ డేటా రీఛార్జి అంటే గుండె గుభేలే..
28 రోజులకు అన్‌లిమిటెడ్ కాల్స్ కోసం1000-1200/- చెల్లించేవారం..
ఒక GB డేటా కోసం 350/- చెల్లించేవారం..
ఇప్పుడు 398/- లకే మూడు నెలలు అన్నీ అన్‌లిమిటెడ్..
#మెయిల్‌లో వచ్చిన ఒక చిన్న డాక్యుమెంట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి నెట్ సెంటర్ కెళ్ళి 30 నిమిషాలు కుస్తీ పట్టేవాళ్ళం.. ఇప్పుడు 3 సెకెన్లలో పని అయిపోతున్నది..
#కరెంటు బిల్లు కట్టడానికి ఎంచెక్కా ఇంట్లోనుంచెళ్ళి సాయంకాలం వచ్చేవాళ్ళం.. ఇప్పుడు మొబైల్‌లో 3 సెకన్లలో అయిపోతుంది..
#డబ్బులు ఎవరికైనా పంపాలంటే #DDలు తీసి కొరియర్లు చేసేవాళ్ళం.. అందుకు హాయిగా ఒకరోజు ఆడుతూ పాడుతూ కేటాయించేవారం.. ఇప్పడు అదీ బ్యాంకింగ్ మొబైల్ యాప్‌ల ద్వారా 5 సెకన్లలోపే కానించేస్తున్నాం..
మనం పుట్టి పెరిగిన #మనపల్లెకు పోయిరావాలంటే ఎముకలకు నరాలకూ మంచి ఎక్సర్‌సైజు ఉండేది.. మనిషిలోతు గతుకులతో పడుతూ లేస్తూ పోయివచ్చేవారం.. మన ఎముకలు/నరాల బలం ఎంతో తెలిసేది.. ఇప్పుడు అక్కడకూ డబుల్ లేన్న రోడ్లు వేసేయడంతో పోయివచ్చినట్లే తెలియడం లేదు..
ఇంతకుముందు #కరెంటు పోతే ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఎంచక్కా నిద్రమానుకుని కుటుంబసభ్యులతో కబుర్లు చెప్పుకుంటూ విసనకర్రలతో విసురుకుంటూ రాత్రంతా గడిపేవారం.. ఓ నాలుగు గంటలు కూడా నిరంతరాయంగా విద్యుత్ ఉండేది కాదు.. అటువంటిది ఈ మోడీ పాలనలో వేసవిలో సైతం 24 గంటలూ నిరంతరాయంగా దేశం అంతటా విద్యుత్ సరఫరా జరుగుతున్నది.. అంతేకాకుండా ఇప్పుడు #భారత్ మిగులు విద్యుత్ కలిగిన దేశంగా అవతరించి #నేపాల్, #మయన్మార్, #బాంగ్లాదేశ్‌లకు విద్యుత్ ఎగుమతి చేస్తున్నది....
అందుకే మోడీజీ పాలన #చప్పగా_ఉన్నది_మజా_లేదు

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments