దేశంలో చౌకిదారుల కథలు - megamindsindia

Unknown
0
దేశంలో చౌకీదార్ల కథలు:
ఓ నేతాజీ.. మరో పటేల్ జి..ఓ కలాం జి..మరో వాజ్పై..
ఓ పీవీ జి మరో శాస్ట్రీ జి.. వీరి కుటుంబ సభ్యులు ఏమి చేస్తున్నారు..? అసలు దొంగ గాంధీ లెవరు..??
నాయకత్వం కొందరికి సాకు. కొందరికి దోపిడీ. కొందరికి–అతి తక్కువమందికి–అవకాశం. సేవ. అందుకే మోదీ గర్వంగా ‘‘నేను మీ చౌకీదారుని’’ అని చెప్పుకోగలిగాడు.
కొంతకాలం  కిందట నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ కాలమ్‌ రాశాను. నా ఆభిమాని దగ్గర్నుంచి సుదీర్ఘమైన ఈ మెయిల్‌  వచ్చింది.‘‘నరేంద్రమోదీని పొగడకండి సార్‌! అతను దుర్మార్గుడు. కర్కశుడు’’ ఆంటూ రాశాడు. నాకూ మా మిత్రుడితో ఏకీభవించాలని  ఉంది. ఒక్క క్షణం నరేంద్రమోదీ అనే దుర్మార్గుడైన ప్రధానమంత్రిని మరిచిపోదాం.
కేవలం కొంతమంది నాయకుల నమూనా కథలు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి ప్రధాని అయ్యేనాటికి కొడుకు హరిశాస్త్రి అశోక్‌ లేలాండ్‌ కంపెనీ ఉద్యోగి. తీరా ఈయన ప్రధాని అయ్యాక హరిశాస్త్రికి సీనియర్‌  జనరల్‌ మేనేజరుగా కంపెనీ ప్రమోషన్‌ ఇచ్చిందట. ‘‘వారెందుకిచ్చారో నాకు తెలుసు. ముందు ముందు నన్ను వాడుకోడానికి. నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చెయ్యి. లేదా నేను చేస్తాను’’ అని ఉద్యోగం మాన్పించారు. ఒక ముఖ్య మంత్రి చొక్కా తొడుక్కున్నాక బొత్తాం తెగిపోతే నౌఖరు అ బొత్తాన్ని నిలబెట్టే కుట్టిన కథ చదు వుకున్నాం. ఆయన పేరు టంగుటూరి ప్రకాశం పంతులు. ఒకాయన–ఎమ్మెల్యే. సభ అయ్యాక చేతిలో ఖద్దరు సంచీతో–రూటు బస్సు ఎక్కడం నాకు తెలుసు. ఆయన పేరు వావిలాల గోపాల కృష్ణయ్య. 
Image result for national stories
ఇలాంటి నాయకులు మనదేశంలో చాలామంది ఉండేవారు, వారిలో ఎవరూ తమ కుటుంబ సభ్యుల కోసం దేశాన్ని నాశనం చేయలేదు..ఇక..నాశనం చేసే వారి గురించి చూస్తే..
ఒకావిడ.. పదవిలోకి రాకముందు కేవలం ఒక స్కూలు టీచరు. అవిడ బహుజన్‌ సమాజ్‌ వాదీ పార్టీ నాయకురాలు మాయావతి. ఆమె సోదరుడు అనందకుమార్‌. 2007లో ఆ మహానుభావుడి ఆదాయం 7 కోట్లు. 7 సంవత్సరాలలో 1,316 కోట్లు అయింది. అంటే 26 వేల శాతం పెరిగింది. ఇది అందరికీ తెలిసినది, తెలియనివి వేల కోట్ల కి పైగానే..! అయన ముఖ్యమంత్రి సోదరుడు అన్న కారణానికి ఒకానొక బ్యాంకు సున్నా వడ్డీతో 67 కోట్లు అప్పు ఇచ్చింది. ఇక ములాయంగారి బంధుజనం వందల లెక్కలో ఉన్నారు. వారిని మీరు వెదకనక్కరలేదు. ఉత్తరప్రదేశ్‌ ప్రతీ పదవిలోనూ, వ్యాపారంలోనూ తమరు దర్శించవచ్చు.
ఇక ఈ మద్యే అఖిలేష్ యాదవ్ ని మాయావతి లను ప్రభుత్వ బంగాళా లను ఖాళీ చేయాలని యోగి ఉత్తర్వులు జారీ చేశారు. అప్పుడు అఖిలేష్ తాను చాలా పేద వాణ్ణి అని, తక్కువ ధరలో గృహం దొరికిన వెంటనే ఖాళీ చేస్తానని చెప్పుకొచ్చారు.. ఇక ఎన్నికల కమిషన్ లో వారు ప్రకటించిన ఆస్తుల వివరాలు, భార్య  ₹7,92,64,883 అఖిలేష్ వి ₹16,27,12,495.. అంటే ఎంత, పేదవారో కదా..??
ఇక మన తెలుగు రాష్ట్రాల సీఎం ల ఆస్తుల వివరాల గురించో, కనీసం ప్రతి పక్ష నాయకుల అస్తుల గురించో.. కాంగ్రెస్ పార్టీ తమ స్కాం ల ద్వారా దేశాన్ని దాటించిన లక్షల కోట్ల రూపాయల గురించో మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది..
ఇక  నరేంద్ర మోదీ కథ. ఆయన బంధువులెవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? మొన్న ఇండియా టుడేలో వచ్చిన వ్యాసంలో వివరాలు చూద్దాం. ఒక బాబాయి కొడుకు–అరవింద్‌ భాయ్‌–నూనె డబ్బాలు కొనుక్కుని, అక్కర్లేని పాత ఇంటి సామాన్లను కొనుక్కుని–వాటిని అమ్మి నెలకు 9 వేలు సంపాదించుకుంటాడు. అతని కొడుకు గాలిపటాలు, పటాసులు, చిన్న చిరుతిళ్లను తయారు చేసి అమ్మి వాద్‌నగర్‌లో చిన్న గదిలో ఉంటాడు. జయంతిలాల్‌ అనే మరో సోదరుడు టీచరుగా పనిచేసి రిటైరయ్యాడు. అతని కూతురు లీనాను ఒక బస్సు కండక్టరుకిచ్చి పెళ్లి చేశాడు. వాద్‌ నగర్‌లో ఎవరికీ వీళ్లు నరేంద్రమోదీ అనే ప్రధాని బంధువులని కూడా తెలీదు.
మోదీ అన్నయ్య–సోంభాయ్‌ (వయస్సు 75) పుణేలో ఒక వృద్ధాశ్రమం నడుపుతాడు. ఒకా నొక సభలో కార్యక్రమాన్ని నిర్వహించే అమ్మాయి ‘‘ఈయన నరేంద్రమోదీ అన్నగార’’ని నోరు జారింది. ఆయన మైకు అందుకున్నాడు. ‘‘నాకూ ప్రధాని మోదీకి మధ్య పెద్ద తెర ఉంది. మీకది కని పించదు. అవును. నేను నరేంద్రమోదీ అన్నయ్యని. ప్రధానికి కాను. ప్రధాని మోదీకి నేనూ 1.25 కోట్ల భారతీయుల వంటి సోదరుడిని’’ అన్నారు.
మోదీ అన్నయ్య అమృతాభాయ్‌(72) చెప్పాడు: 1969లో అహమ్మదాబాద్‌ గీతామందిర్‌ దగ్గర రోడ్డు రవాణా సంస్థ క్యాంటీన్‌లో టీ దుకాణం నడిపే రోజుల్లో–ఆ దుకాణం నిజానికి వారి మేన మామది–మోదీ రోజంతా పనిచేసి–ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఆఫీసుకి వెళ్లి వృదులైన ప్రచారక్‌లకు సేవ చేసి–ఏ రాత్రికో కొట్టుకే వచ్చి క్యాంటీన్‌ బల్లమీదే నిద్రపోయేవాడట–ఇల్లు ఒకే గది ఉన్న వసతి కనుక. 2003లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుటుంబంతో ఒకసారి మోదీ గడిపారట. మరి 2012లో ఎందుకు మళ్లీ గడపలేదు? ఒక రాజకీయ విశ్లేషకుడు అన్నాడుకదా: అధికారంతో వారి బంధుత్వం వారి అమాయకమైన జీవనశైలిని కల్మషం చేస్తుందని. ఆనందకుమార్‌కీ, రాబర్ట్‌ వాద్రాకీ ఈ మాట చెప్పి చూడండి.
నాయకత్వం కొందరికి సాకు. కొందరికి దోపిడీ. కొందరికి–అతి తక్కువమందికి–అవకాశం. సేవ. అందుకే మోదీ గర్వంగా ‘‘నేను మీ చౌకీదారుని’’ అని చెప్పుకోగలిగాడు. నేను ప్రధాని  గురించి మాట్లాడడం లేదు. సోంభాయ్‌ చెప్పిన ప్రధాన చౌకీదారు గురించి చెప్తున్నాను. నా అభిమాని నన్ను మరొక్కసారి క్షమించాలి. ఇక మన ప్రస్తుత రాజకీయ నాయకులు వారి కుటుంబ ఆస్తులు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది..
~గొల్లపూడి మారుతి రావు✍️
ఇక ఓ అమెరికన్ చెప్పిన మాటలు మీకోసం..
మీకు నచ్చినా, నచ్చకపోయినా భారతదేశంలో గ్రామీణ రంగం మోదీగారి వెనుక ఉంది. వాళ్లని మీరు భక్తులన్నా, అనుచరులన్నా వాళ్లకి వెంట్రుక ఊడదు (ఇంతకన్న ముతక మాట అన్నాడు ఓ అమెరికన్). మొట్ట మొదటిసారిగా 4ఏళ్ల పాలనలో ఒక్క కుంభకోణమూ లేని పార్టీ నాయకుడు వారికి దక్కాడు. అనూహ్యమైన కుంభకోణాలతో మురిగిన దేశం ఒక ప్రధాని మూగతనాన్ని వేళాకోళం చేసే స్థాయికి చేరుకొన్న నేపథ్యంలో ఇది గొప్ప, వాంఛనీయమైన పరిణామం.
ముస్లింలు మోదీని ద్వేషించటం లేదు. ఇంకా చెప్పాలంటే ముస్లిం మహిళలు మోదీ వైపే. చదువుకున్న హిందూ మేధావులు ఆయన్ని ద్వేషిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో వారు అతి మెళకువగా, శ్రద్ధగా ప్రజాభిప్రాయాన్ని వంకర తోవ పట్టించడానికి చేసిన కృషిని ఆయన గంగలో కలిపాడు కనుక. సరదాగా టీ సేవిస్తూ పత్రికల్లో రాజకీయాలను చర్చించే ‘బాతాఖానీ’మేధావుల నడ్డి మీద ఆయన ఒక తాపు తన్నాడు కనుక.
నాకనిపిస్తుంది చాలామంది భారతీయులు మోదీని వ్యతిరేకించడాన్ని ఒక స్టేటస్‌ సింబల్‌గా భావిస్తూ, తద్వారా తాము మేధావులం, మతాతీత శక్తులమని నిరూపించుకోజూస్తున్నారని. వారికి అదొక ఫేషన్‌. ఒక్క ఉదాహరణ ఢిల్లీ ముఖ్యమంత్రి– కేజ్రీవాల్‌. ఆయన మోదీ విద్యార్హతల్ని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయం సాధికారికంగా సమర్థించే సరికి పూర్తిగా జారిపోయాడు. ఇది అతి నీచమైన ‘spit and run-' రాజకీయం. ఇలా కక్కగా కక్కగా ఏదో మురికి ఆయనకు అంటుకోక మానదని కొందరి ఆశ.
దురదృష్టం... భారతీయ సైన్యం చేసిన దాడులనీ కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. మాకు ట్రంపు ఉన్నాడు. అమెరికాని సమర్థించే ఆయన ఏ చర్యనయినా బొత్తిగా చదువురాని అమెరికన్‌ కూడా సమర్థించాడు. మీ సైన్యం చర్యలనే మీరు ఖండించే స్థితికి వస్తే– మీలో ఏదో సీరియస్‌ లోపం ఉన్నట్టే లెక్క.
ప్రపంచంలో ఇండియా ఇప్పుడిప్పుడే తనదైన స్థానంలో నిలదొక్కుకుంటోంది. ఆ స్థానాన్ని సుస్థిరంగా నిలుపుకోవాలంటే గుజరాత్‌ టీకొట్టు మనిషే మీకు గట్టి దన్ను. రాహుల్‌ గాంధీ అనే ఆ శాల్తీని కాక ఈయన్ని మళ్లీ ఎన్నుకోడానికి మరో ఎన్నిక మీకు అవసరమనిపిస్తే మిమ్మల్ని ఆ దేవుడే రక్షించుగాక అంటున్న ఓ అమెరికన్.
ఏది ఏమైనా.. డియర్ #మోడీజీ...!!
#ఇంగ్లీష్ వారి నుండి పాలన మారిన తదుపరి సాగిన  పలు దశాబ్దాల పాలనలలో వలెనే
మీరు కూడా లక్ష కోట్లో..
పది లక్షల కోట్లో
వంతున మీరు మీవాళ్లు కలిసి
స్కాములు చేసుకుంటూ పోతూ ఉండి ఉంటే .......
దొరికినంత దోచుకొni పంచుకొంటూ
పోతూ ఉండి ఉంటే
మాకీ బాధ ఉండేది కాదు.
ఎందుకంటే అది మాకు 70  ఏళ్లుగా అలవాటైపోయింది..
#స్కాముల వల్ల అవినీతి వల్ల మా జేబుల్లో డబ్బులు డైరక్ట్ గా పోవు గదా..?
మాకేమీ నేరుగా తెలియని వవి.
 #భవిష్యత్ అంటే రాబోయే తరాలు అంటే మా పిల్లలు, మనవలు, ముని మనవలు ఎంత ఇబ్బంది పడితే మాత్రం #మాకేమిటి..
మేము ఈ రోజుకి #సుఖంగా ఉన్నామా లేదా అన్నదే మాకు ముఖ్యం.
అది మానేసి మీరిలా #నల్లధనం నిర్మూలన.. #అవినీతిని అరికడతాను అంటే ఎలా చెప్పండి..?
ఇదేమాట ఎన్నికల్లో చెబితే నమ్మి మీకు #ఓటేశాం..
కాదనడంలేదు. అయితే మామూలుగా నాయకులు వాగ్దానాలు చేసి మర్చిపోతారు గదా.. కానీ
నిజంగానే అవినీతిపై యుద్ధం చేస్తానంటే ఎలా చెప్పండి..?
 మీకంటే పెళ్ళాం బిడ్డలు లేరు.. కుటుంబం, సంపాదన అనే లంపటాలు లేవు...
మరి మా సంగతి..? ఏం.. దేశంలో జనమంతా #సన్యాసులనుకున్నారా ? లేక మీలా నిబద్ధత గల #ఆరెస్సెస్ ప్రచారక్ లు అని భావిస్తున్నారా..? 
దేశం అభివృద్ధి చెందితే మాకేమిటి.. చెందకుంటే మాకేమిటి..? అందుకోసం మమ్మల్ని 50 రోజులు ఇబ్బంది పెడతారా..? మీ పాలన మాకేం నచ్చలేదు.
 అవినీతి లేకుండా చేసేస్తే.. మాకు ఈజీ మనీ ఎలా వస్తుంది..? ఎన్నికల్లో ఓటుకి రెండు వేలు #ఎవడిస్తాడు..?
మాకు ఎంత వస్తుంది అనేది మాకు ముఖ్యం కాదు.
అవినీతిలో భాగం కావడమే మాకు ప్రధానం.
మేమలానే రుచిమరిగి యున్నాము.
 మేము ఏ సరుకులు కొన్నా బిల్లు అడగము తీసుకోము. అందువల్ల మాకు రూపాయి కలిసొచ్చినా చాలు.. ఆ అక్రమ వ్యాపారి ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడతాడు అదే మాకు సంతోషం. అలాంటి అక్రమ వ్యాపారులు కోట్లు సంపాదించుకుంటే అదే మాకు పరవశం.
 #స్విస్_బ్యాంకులో డబ్బంతా తెచ్చి మాకు పంచేస్తాం అని చెప్పారు గదా అప్పట్లో... ముందు విమానంలో వెళ్లి ఆ డబ్బు కంటైనర్ లో తెచ్చి మాకు మనిషికి ఇంతని పంచేసి మాట నిలబెట్టుకోండి.
ఆ తర్వాత మీ పక్కన, మీ పార్లమెంట్లో, మీ ఢిల్లీ లో ఉన్న కుబేరులందరి డబ్బులూ లాగేసి అవి కూడా #పంచేయండి.
ఆ తర్వాత మా దగ్గరికి రండి... అప్పటికి అన్నీ బాగుంటే.. మీరు, మేమూ ఉంటే.. అప్పుడు మా డబ్బులు మీకు లెక్క చెబుతాం. టాక్స్ కట్టాల్సి ఉంటే వాయిదాల్లో కడతాం. నో ప్రాబ్లమ్. 
 అయ్యా .. ఈలోగా మీకు మరీ ఖాళీగా ఉంటే.. అంత తాపత్రయంగా ఉంటే.. అవినీతి పై పోరాటం పేరుతొ ఒక నెలరోజులు #బందులు, హర్తాళ్లు చేయించండి.. మేము కూడా పాల్గొని మద్దతిస్తాం.
షాపులు కట్టించేస్తాం.. ఇంకా అవసరం అయితే #ప్రభుత్వ_వాహనాలు, #బస్సులు, #రైళ్లు_కాల్చేస్తాం. పోలీసు కాల్పుల వరకూ తీసుకెళ్లి మీకు మంచి పేరు తెస్తాం.
 ఏం..భారత  దేశంలో మీరొక్కరే తెలివైన వాళ్ళని మీ ఫీలింగా..? ఏం మాకు తెలియదా దొంగలు ఎవరో..?
వాళ్ళు మా పక్కనే లేరా..? ఏదో అందరం అలా #కలిసిమెలిసి బతుకేస్తున్నామ్ డెబ్బదేళ్ళుగా..... ఇంతకాలంగా..!!
"దేశ" ప్రయోజనాల పేరుతొ మా మధ్య విభేదాలు తెస్తారా..?  మీ తీరు అస్సలు నచ్చడం లేదు
మాకు మన #సైనికులు చచ్చిపోయినా దేశం నాశనమయ్యినా మాకు సంతోషమే గానీ .. మీకు పేరొస్తే ఎలా సహిస్తాం..? చెప్పండి. మిగిలిన భ్రష్టాచార నేతలు వారి పార్టీలు, వారి కుటుంబ రాజకీయ వ్యాపారాలు బడవాల మనుగడేంకాను......
జై హింద్..

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top